అగ్రరాజ్యంపై అన్నదాత ఆగ్రహజ్వాల – 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపు
సహనం వందే, న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ డీల్ వల్ల భారత వ్యవసాయ రంగం కుప్పకూలుతుందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమెరికా కార్పొరేట్ కంపెనీలకు తలొగ్గిందని ఆరోపిస్తూ ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ ఒప్పందంపై అటు విపక్షాలు, ఇటు అన్నదాత ముక్తకంఠంతో యుద్ధం ప్రకటిస్తున్నారు. నిరసన జ్వాలలు మొదలు…ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల…