8 Hours Sleep

ఎనిమిది గంటల భ్రమ – నిద్రను లెక్కించడం మానేయండి

సహనం వందే, హైదరాబాద్: ఎనిమిది గంటల నిద్ర ఖచ్చితంగా అవసరమనేది ఒక పెద్ద అపోహగా మారుతోంది. ఆధునిక విజ్ఞానం ఇప్పుడు కొత్త నిజాలను వెలికితీసింది. అతి నిద్ర, తక్కువ నిద్ర రెండూ ప్రమాదకరమని హెచ్చరిస్తోంది. మెదడు చురుగ్గా ఉండాలంటే ఎంత నిద్ర అవసరమో ఇప్పుడు శాస్త్రీయంగా స్పష్టమైంది. అసలు ఎనిమిది గంటల సూత్రం వెనుక ఉన్న చిక్కుముడిని విప్పుదాం. నిద్రపై కొత్త కోణంఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అనే వాదన బలహీనపడుతోంది. ఐదు లక్షల మంది పెద్దలపై…

Read More
Rama Mandi

రాముడి గుడిలో రావణాసురులు – అయోధ్య రామమందిర నిధుల దోపిడీ వెనుక

సహనం వందే, అయోధ్య: అయోధ్య రామాలయం పవిత్రతను మంటగలుపుతూ వెలుగులోకి వచ్చిన విరాళాల దుర్వినియోగం వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. భక్తి భావంతో భక్తులు సమర్పించుకున్న కానుకలు అన్యాక్రాంతం కావడమే కాకుండా ట్రస్ట్ నిర్వహణలో లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఈ ఘటనపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మొసలి కన్నీరు కార్చింది. తాము షాక్‌కు గురయ్యామని, ఈ పరిస్థితికి అత్యంత బాధపడుతున్నామని ట్రస్ట్ ప్రతినిధులు కంటి తుడుపు…

Read More
Adani

అదానీ కేసు మూసివేతపై జడ్జి ఫైర్ – లంచం కేసు రద్దుపై అమెరికా కోర్టు ఆగ్రహం

సహనం వందే, వాషింగ్టన్: అమెరికా గడ్డపై భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీపై నమోదైన లంచం, మోసాల కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ అమెరికా న్యాయశాఖ వేసిన పిటిషన్ ను అక్కడి ఫెడరల్ జడ్జి నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అదానీని కేసు నుండి బయటపడేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో వివరణ ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని నిలదీశారు. అదానీ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ న్యాయపోరాటం ఇప్పుడు కీలక దశకు చేరింది. తగ్గేది లేదంటున్న జడ్జిసాధారణంగా అమెరికా న్యాయశాఖ…

Read More
Shankh MItra

ఏడాదికి 7 వేల కోట్ల జీతం – అమెరికాలో భారతీయుడికి దక్కిన గౌరవం

సహనం వందే, హైదరాబాద్: ఎప్పుడైనా ఊహించారా? ఒక్క ఏడాదికి ఏకంగా 7 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ఎవరైనా తీసుకుంటారని? మనలో చాలా మందికి లైఫ్ మొత్తం సంపాదించినా ఈ ఫిగర్ కలలో కూడా రాదు. కానీ భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న రెండో సీఈఓగా నిలిచారు. అసలు ఈ శంఖ్ మిత్ర ఎవరు? ఎందుకు ఆయనకు ఇంత భారీ ప్యాకేజీ ఇచ్చారు? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ…

Read More
BJP Vs TDP

కేంద్రంలో టీడీపీ పట్టు తప్పుతుందా? – ప్రాంతీయ పార్టీలను చీల్చుతున్న బీజేపీ

సహనం వందే, అమరావతి: ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ పట్టు ఇక తగ్గుతుందా? ప్రాంతీయ పార్టీలను వరుసగా చీలుస్తూ కేంద్రంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటోంది. లోక్‌సభలో 240 స్థానాలతో సొంత మెజారిటీకి దూరంగా ఉన్న కాషాయ దళం… ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వస్తున్న అసమ్మతి ఎంపీలతో 319 స్థానాలకు చేరింది. ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. మారుతున్న బలాబలాలులోక్‌సభ ఎన్నికల్లో 240 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీకి…

Read More
Whats App Global Head Kunasha

డెలివరీ బాయే వాట్సాప్ బాస్ – వాట్సాప్ గ్లోబల్ హెడ్ కునాల్ షా ప్రస్థానం

సహనం వందే, ముంబై: ముంబై వీధుల్లో కొరియర్ డెలివరీ బాయ్‌గా జీవితాన్ని మొదలుపెట్టిన ఒక సామాన్యుడు నేడు ప్రపంచ టెక్ రంగాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాడు. కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేస్తూ బతికిన కునాల్ షా ప్రస్థానం ఒక అద్భుతం. తన మేధస్సుతో అసాధారణమైన విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మందికి పైగా వాడుతున్న వాట్సాప్ సంస్థకు గ్లోబల్ హెడ్‌గా ఎంపికై చరిత్ర సృష్టించారు. కష్టాల పునాది1983…

Read More
Adani Met S/o Trump

ట్రంప్ కొడుకుతో అదానీ రహస్య భేటీ – వెలుగులోకి లంచాల కేసు సంచలనాలు

సహనం వందే, హైదరాబాద్: అమెరికాలో లంచాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ భారత బిలియనీర్ గౌతమ్ అదానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్‌తో భేటీ వ్యవహారం వెలుగు చూడటం అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికాలో అదానీపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న సమయంలోనే ట్రంప్ జూనియర్ ఇండియాలో పర్యటించారు. అహ్మదాబాద్‌లో జరిగిన వీరిద్దరి రహస్య సమావేశం, కేసు రద్దుకు దారితీసిన పరిణామాల పట్ల అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భేటీ…

Read More
CM Vijay

విజయ్ వర్సెస్ విజయ్ – పెరియార్ సిద్ధాంతాలపై ద్వంద్వ వైఖరి

సహనం వందే, చెన్నై: తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త శక్తిగా ఉద్భవించిన విజయ్‌… తన పార్టీ సిద్ధాంతాలపై సంచలన ప్రకటన చేశారు. దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలను శాసించిన పెరియార్ రామస్వామి వారసత్వాన్ని స్వీకరిస్తూనే ఆయనకు విరుద్ధమైన ఆస్తికత్వ మార్గాన్ని ఎంచుకోవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ద్వంద్వ వైఖరి ద్వారా విజయ్ సరికొత్త సామాజిక సమీకరణాలకు తెరలేపారు. ద్రవిడ గడ్డపై ఆస్తికత్వ ముద్రతమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. ద్రవిడ రాజకీయ పితామహుడు…

Read More
Ayodhya Ram Mandir

అవినీతి అయోధ్య… విరాళాల మాయ – రాముని పేరుతో వేల కోట్ల అక్రమాలు

సహనం వందే, అయోధ్య: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం పేరుతో సేకరించిన వేల కోట్ల రూపాయల విరాళాలు గాలిలో కలిసిపోయాయి. భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడంతో రామమందిర ఆర్థిక వ్యవహారాల్లోని చీకటి కోణాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అంతులేని అవినీతి ఆరోపణలురామమందిర నిర్మాణం, నిర్వహణలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని దశాబ్దాలుగా విమర్శలు వస్తున్నాయి. రామమందిరం పేరుతో వసూలు…

Read More
News System

డబ్బు మైకం… మీడియా మౌనం – ప్రకటనల సంకెళ్లలో వార్తల కన్నీరు

సహనం వందే, హైదరాబాద్: ఉచిత వార్త అంటే అది ఉచితం కాదు. అది ప్రజలను ఒక వస్తువుగా మార్చేసే వ్యూహం. ప్రకటనల కోసం వార్తలను వండడం, కార్పొరేట్ లాభాల కోసం వాస్తవాలను తొక్కేయడం నేడు మీడియాలో సాధారణమైపోయింది. కానీ ప్రపంచంలో కొన్ని సంస్థలు ప్రకటనలకు స్వస్తి పలికి కేవలం ప్రజల చందాలతోనే నిలబడగలుగుతున్నాయి. వార్తలకు డబ్బులు చెల్లించడం అంటే మీ ప్రజాస్వామ్య హక్కును మీరు కాపాడుకోవడమే. ప్రకటనల మాయాజాలం ప్రమాదకర పరిణామంమీడియా సంస్థలు ప్రకటనలపైనే బతుకుతుంటే అవి…

Read More