Marriage System

ఏడడుగుల తడబాటు – మూడు’ముళ్ల’ బంధానికి బీటలు

సహనం వందే, గుజరాత్: ఆధునిక ప్రపంచంలో పెళ్లిళ్ల తీరు మారిపోయింది. విందులు, వినోదాలు, డ్యాన్స్‌లు పెరిగాయి. పెళ్లి అంటే కేవలం అలంకరణలు, విందులు కాదు. అది రెండు ఆత్మల కలయికకు సంబంధించి పవిత్ర ప్రక్రియ. మంత్రోచ్చారణల మధ్య, అగ్ని సాక్షిగా జరిగే సప్తపది ముఖ్యం. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటే సరిపోదు. కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు నేటి ఆధునిక కాలంలో పెళ్లి అర్థాన్ని కొత్తగా చూపిస్తున్నాయి. సప్తపది ప్రాముఖ్యతగుజరాత్ హైకోర్టు జూన్ 23న సంచలన తీర్పు ఇచ్చింది….

Read More

‘నెల’ దాటితే ముఖ్యమంత్రి ఔట్ – 30 రోజులు జైలుకు వెళ్తే పదవీ గండం

సహనం వందే, న్యూఢిల్లీ: అధికారం అంటే శాశ్వతం అనుకునే వారికి పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన ఒక హెచ్చరిక. నిందితుడిగా 30 రోజులు కస్టడీలో ఉంటే చాలు ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అయినా కుర్చీ వదలాల్సిందేనని కమిటీ స్పష్టం చేస్తోంది. నేరం నిర్ధారణ కావాల్సిన అవసరం లేదు, కేవలం జైలు గడప తొక్కడమే పదవికి శాపంగా మారబోతోంది. ప్రజాస్వామ్య మూలాలను కదిలించే ఈ కీలక అంశంపై సమగ్ర విశ్లేషణ. కస్టడీ వర్సెస్ శిక్షప్రధాని లేదా ముఖ్యమంత్రులు 30 రోజుల…

Read More
Deepak Gehlavath IPS

ఐపీఎస్ @ 3 కోట్ల లంచం – సీబీఐ వలలో సీనియర్ ఐపీఎస్ అధికారి

సహనం వందే, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మందుల తయారీ కేసులో సీబీఐ మరో కీలక అడుగు వేసింది. అవినీతికి వ్యతిరేకంగా కొరడా ఝుళిపించింది. ఏకంగా ఒక ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకుంది. ఆ అధికారి వ్యవస్థనే పక్కదారి పట్టించాలని చూసిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 3 కోట్ల రూపాయల లంచం వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. అధికారి అవినీతి బాగోతంప్రస్తుతం అరెస్టు అయిన దీపక్ గహ్లవత్ ఒక ఐపీఎస్ అధికారి. ఆయన సివిల్ ఏవియేషన్…

Read More
Gold Rates

బం’ఘోరం’ – డబ్బు కోసం బంగారం అమ్మేస్తున్నారు

సహనం వందే, హైదరాబాద్: భారతీయులకు బంగారం అంటే ఒక పవిత్రమైన ఆస్తి. కష్టకాలంలో కూడా అమ్మని ఈ పసిడి ఇప్పుడు మార్కెట్‌లోకి వరదలా వస్తోంది. ధరల పతనం సామాన్యులను భయాందోళనకు గురిచేస్తోంది. బీరువాల్లో దాచుకున్న సంపద కరిగి నగదుగా మారుతోంది. ఇది కేవలం అమ్మకం కాదు… దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న భారీ మార్పుకు నిదర్శనం. పడిపోతున్న పసిడి విలువబంగారం ధరలు రికార్డు స్థాయి నుండి వేగంగా దిగజారుతున్నాయి. పది గ్రాముల ధర 1.40 లక్షల రూపాయల…

Read More
Whats App

నెంబర్ లేని వాట్సాప్ నేరగాళ్ల బిందాస్ – మెటాపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర

సహనం వందే, న్యూఢిల్లీ: వాట్సాప్ తీసుకొస్తున్న సరికొత్త మార్పు డిజిటల్ ప్రపంచంలో కలకలం రేపింది. ఫోన్ నంబర్లు లేకుండా కేవలం యూజర్ నేమ్స్‌తో చాటింగ్ చేసే సదుపాయంపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. దేశ భద్రతను పణంగా పెట్టి తీసుకువస్తున్న ఈ ఫీచర్‌ను వెంటనే నిలిపివేయాలని మెటా సంస్థను ఆదేశించింది. సైబర్ నేరాలకు ఇది ఒక కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంక్షల బాటలో ప్రభుత్వంఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ అంశంపై తీవ్ర…

Read More
Muslim Reservation in Bengal

బెంగాల్‌లో ముస్లిం రిజర్వేషన్లు ఔట్ – 77 ముస్లిం కమ్యూనిటీల ఓబీసీ కోటాకు కత్తెర

సహనం వందే, పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గత ప్రభుత్వం కల్పించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ ఏకంగా 77 ముస్లిం కమ్యూనిటీలను జాబితా నుంచి తొలగించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని సామాజిక సమీకరణాలను మరోసారి వేడెక్కించింది. ముస్లింలలోనూ భిన్న వర్గాలుముస్లిం కమ్యూనిటీలలో కూడా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వివిధ…

Read More
OLD Age Divorces

శేష జీవితంలో కొత్త ఆశలు – ముసలితనంలో పెరుగుతున్న విడాకులు

సహనం వందే, హైదరాబాద్: జీవితం చరమాంకంలోకి అడుగుపెడుతున్న వేళ జంటల మధ్య దూరం పెరుగుతోంది. ఏళ్లుగా సాగిన సంసారాలు ఇప్పుడు విడాకుల బాట పడుతున్నాయి. పిల్లలు పెద్దలై వేరు కావడం, రిటైర్మెంట్ తర్వాత ఖాళీ సమయం పెరగడం వెనుక ఉన్న అసలైన చిచ్చును రగిలిస్తోంది. మనిషి జీవిత కాలం పెరగడంతో ఇప్పుడు కొత్త జీవితం కోరుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా తమదైన సంతోషం కోసం పాత బంధాలకు స్వస్తి పలుకుతున్నారు. పెరిగిన విడాకుల వేగంప్రపంచవ్యాప్తంగా 1990లో 50…

Read More
Ayodhya Rama Mandir Scam

అయోధ్య దోపిడీపై లాయర్ల గర్జన – నిందితుల తరఫున వాదించొద్దని నిర్ణయం

సహనం వందే, అయోధ్య: రామ మందిరం పవిత్రతను కాపాడాలనే ఆకాంక్షతో అయోధ్య లాయర్లు కదన రంగంలోకి దిగారు. విరాళాల సొమ్మును అక్రమంగా కాజేసిన వారికీ, వారికి వత్తాసు పలికే వారికీ ఇక్కడ చోటు లేదని తేల్చి చెప్పారు. చట్టం కంటే భక్తి, నైతికత ముఖ్యమని భావిస్తున్న వకీళ్లు… దోషులను వెళ్ళగొట్టే వరకు విశ్రమించేది లేదని హెచ్చరిస్తున్నారు. నిర్ణయాత్మక మలుపుఅయోధ్యలోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. రామ మందిర విరాళాల అక్రమ నిధుల కేసులో నిందితులకు…

Read More
8 Hours Sleep

ఎనిమిది గంటల భ్రమ – నిద్రను లెక్కించడం మానేయండి

సహనం వందే, హైదరాబాద్: ఎనిమిది గంటల నిద్ర ఖచ్చితంగా అవసరమనేది ఒక పెద్ద అపోహగా మారుతోంది. ఆధునిక విజ్ఞానం ఇప్పుడు కొత్త నిజాలను వెలికితీసింది. అతి నిద్ర, తక్కువ నిద్ర రెండూ ప్రమాదకరమని హెచ్చరిస్తోంది. మెదడు చురుగ్గా ఉండాలంటే ఎంత నిద్ర అవసరమో ఇప్పుడు శాస్త్రీయంగా స్పష్టమైంది. అసలు ఎనిమిది గంటల సూత్రం వెనుక ఉన్న చిక్కుముడిని విప్పుదాం. నిద్రపై కొత్త కోణంఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అనే వాదన బలహీనపడుతోంది. ఐదు లక్షల మంది పెద్దలపై…

Read More
Rama Mandi

రాముడి గుడిలో రావణాసురులు – అయోధ్య రామమందిర నిధుల దోపిడీ వెనుక

సహనం వందే, అయోధ్య: అయోధ్య రామాలయం పవిత్రతను మంటగలుపుతూ వెలుగులోకి వచ్చిన విరాళాల దుర్వినియోగం వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. భక్తి భావంతో భక్తులు సమర్పించుకున్న కానుకలు అన్యాక్రాంతం కావడమే కాకుండా ట్రస్ట్ నిర్వహణలో లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఈ ఘటనపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మొసలి కన్నీరు కార్చింది. తాము షాక్‌కు గురయ్యామని, ఈ పరిస్థితికి అత్యంత బాధపడుతున్నామని ట్రస్ట్ ప్రతినిధులు కంటి తుడుపు…

Read More