
‘నకిలీ’ల చేతిలో ప్రాణాలు
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నకిలీ డాక్టర్లు, అనధికార ఆసుపత్రులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. అర్హత లేని వ్యక్తులు వైద్యులుగా మారి, నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్లు, ఆసుపత్రులు నడుపుతూ ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా బయటపడుతున్నాయి. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్ వంటి జిల్లాల్లో ఇటీవల జరిగిన తనిఖీలు ఈ సమస్య తీవ్రతను వెల్లడిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో నకిలీ వైద్యులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ దందా ఇంకా కొనసాగుతుండటం ఆందోళన…