
ఆదిలాబాద్లో ఆగని జొన్న దందా
సహనం వందే, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో జొన్న అక్రమ వ్యాపారం ఆగడం లేదు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ల నుంచి భారీగా జొన్నలను తరలించి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మే దందా జోరుగా సాగుతోంది. తాజాగా సిరికొండ మండలంలో 350 క్వింటాళ్ల జొన్నలను అధికారులు సీజ్ చేయగా, ఈ అక్రమ వ్యాపారంలో ఓ నియోజకవర్గ స్థాయి నేత హస్తం ఉన్నట్లు సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పట్టుబడిన ఐచర్ వాహనాన్ని అధికారులు విడుదల చేయడం, కేసులు నమోదు చేసి చేతులు…