
ఐఐటీపై ఆరు’గురి’
సహనం వందే, కోట: ఒకే శిక్షణ కేంద్రంలో కలిసి చదివిన ఆరుగురు స్నేహితులు జేఈఈ మెయిన్స్-2025 పరీక్షలో అపూర్వ విజయాన్ని సాధించారు. రాజస్థాన్ కోట కేంద్రంగా వీరంతా సమిష్టిగా చదివి 100 పర్సంటైల్ సాధించారు. దేశవ్యాప్తంగా కేవలం 24 మంది మాత్రమే సాధించిన 100 పర్సంటైల్లో ఈ ఆరుగురు ఉండటం విశేషం. ఈ ఆరుగురి స్నేహబంధం, పట్టుదల, అవిశ్రాంత కృషి ఎందరికో స్ఫూర్తినిచ్చేలా నిలిచింది. ఒకే చోట చదివి లక్ష్యాన్ని ఛేదించి…కోటకు చెందిన అర్ణవ్ సింగ్ (టాప్…