ఇఫ్తార్ విందుల్లో కలిశెట్టి సందడి – మసీదుల్లో ఎంపీ అప్పలనాయుడు ప్రార్థనలు
సహనం వందే, విజయనగరం: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నారు. వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ ఆయన అందరినీ ఆత్మీయంగా పలకరించారు. సుదీర్ఘ పర్యటనలో ఎంపీఅప్పలనాయుడు బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 200 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా పర్యటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా ప్రాంతాల్లోని మసీదులను సందర్శించారు. నెల్లిమర్ల, ఎచ్చెర్ల, చీపురుపల్లి నియోజకవర్గాలతో పాటు రాజాం…