హిందీపై ఎదురు తిరిగిన ద్రవిడ గడ్డ – మూడు భాషలపై స్టాలిన్ నిప్పులు
సహనం వందే, తమిళనాడు: దక్షిణాది గడ్డపై మళ్ళీ భాషా యుద్ధం మొదలైంది. కేంద్రం తెచ్చిన విద్యా విధానంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిప్పులు చెరిగారు. హిందీని రుద్దే ప్రయత్నం చేస్తే బీజేపీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. నిధుల ఆంక్షలతో రాష్ట్రాన్ని లొంగదీసుకోవాలని చూడటం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. ఈ గొడవ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ సెగలు పుట్టిస్తోంది. తమిళనాడుకు నిధుల వేటుతమిళనాడుకు రావాల్సిన విద్యా నిధులను కేంద్రం కావాలనే తొక్కి పెడుతోంది. మూడు భాషల విధానాన్ని అమలు…