
కాంగ్రెస్ లో మహిళాగ్రహం
సహనం వందే, హైదరాబాద్: అధికారంలోకి రావడానికి కష్టపడ్డ మహిళా నేతలకు కాంగ్రెస్ పార్టీ మొండిచెయ్యి చూపిస్తోంది. నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడంతో మహిళా కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అర్హుల జాబితాను పీసీసీ, ఏఐసీసీకి పంపి ఏడాదిన్నర గడుస్తున్నా ఒక్కరికి కూడా పదవి దక్కకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేకపోతే ఎలా పనిచేయాలని వారు నిలదీస్తున్నారు. 20 ఏళ్లకు పైగా పార్టీ కోసం పనిచేసినా పదవులు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని…