
సిజేరియన్ డెలివరీలపై కఠిన చర్యలు
వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ సహనం వందే, హైదరాబాద్: సరియైన కారణం లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సి-సెక్షన్ ఆడిట్ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ కాన్పుల సంఖ్యను మరింత పెంచాలని మంత్రి అన్నారు. సాధారణ కాన్పుల వల్ల కలిగే లాభాలను, సిజేరియన్ వల్ల జరిగే నష్టాలను…