
డాక్టర్ రఘురామ్ కు గ్లాస్గో కీర్తి కిరీటం
సహనం వందే, లండన్:హైదరాబాద్కు చెందిన ప్రముఖ రొమ్ము క్యాన్సర్ శస్త్రవైద్యుడు డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటన్లోని ప్రఖ్యాత గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ (ఆర్సీపీఎస్జీ) ఆయనకు గౌరవ ఫెలోషిప్ ప్రదానం చేసింది. దక్షిణాసియాలో ఈ గౌరవం పొందిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా 1997లో ఇదే కాలేజీ నుంచి ఎఫ్ఆర్సీఎస్ పరీక్షలో అర్హత పొంది ఇప్పుడు గౌరవ ఫెలోషిప్ అందుకున్న ఏకైక శస్త్ర వైద్యుడుగా ప్రపంచంలోనే…