ఎర్రజెండా దించరా… కాషాయ జెండెత్తరా – జైశ్రీరామ్ నినాదాల్లో బెంగాల్ కమ్యూనిస్టులు
సహనం వందే, బెంగాల్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తున్నాయి. దశాబ్దాల కాలం రాష్ట్రాన్ని ఏలిన కమ్యూనిస్టు శ్రేణులు ఈసారి అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ను గద్దె దించడమే లక్ష్యంగా వామపక్ష ఓటర్లు నిశ్శబ్దంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికారు. ఈ అంతర్లీన రాజకీయ పరిణామమే బెంగాల్లో కాషాయ జెండా ఎగరడానికి ప్రధాన కారణమైంది. తృణమూల్ లక్ష్యంగా వ్యూహంబెంగాల్ రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రం అమలైంది….