
ఆయిల్ ‘ఫ్రాడ్’తో కోటీశ్వరులు – కోట్లకు పడగలెత్తిన అధికారులు
సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఆయిల్ ఫెడ్ లో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థను ఫణంగా పెట్టి కోట్లకు పడగలెత్తుతున్నారని అందులోని ఉద్యోగులే మండిపడుతున్నారు. తమ అధికారాలను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పామాయిల్ మొక్కల్లో అక్రమాలు, నూనెల విక్రయాల్లో అవకతవకలు, నర్మెట్ట ఫ్యాక్టరీ టెండర్లలో గోల్మాల్… ఇలా అనేక రూపాలుగా అవినీతి పేరుకుపోయినట్లు చెప్తున్నారు. అందులోని కీలక స్థానాల్లో ఉన్నవారు సిండికేట్ అయ్యి సంస్థను నట్టేట ముంచుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం…