Housing Plots to Journalists

నెల రోజుల్లో జర్నలిస్టులకు ఇళ్లు – మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి హామీ

సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాల కాలంగా కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు సొంతింటి కల సాకారం కాబోతోంది. కలం వీరుల పోరాటానికి కాలం కలిసి వస్తోంది. న్యాయవివాదాల సుడిగుండంలో చిక్కుకున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు సర్కారు శాశ్వత పరిష్కారం చూపేందుకు సిద్ధమైంది. జూన్ 2వ తేదీ నాటికి ఈ సమస్యను ఒక కొలిక్కి తెస్తామని ప్రకటించి జర్నలిస్టుల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. పొంగులేటి కీలక ప్రకటనరాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఒక కీలక భేటీ జరిగింది….

Read More
Agentic AI Phone

ఐఫోన్ స్థానంలో ఏఐ ఫోన్ – చాట్ జీపీటీ ఆధ్వర్యంలో ఏజెంటిక్ ఏఐ ఫోన్

సహనం వందే, హైదరాబాద్: స్మార్ట్‌ఫోన్ విప్లవానికి అసలైన ముగింపు పలకబోయే రోజులు దగ్గరపడ్డాయి. మనం ఫోన్ వాడే విధానాన్ని ఓపెన్ ఏఐ సంస్థ సమూలంగా మార్చేస్తోంది. కేవలం స్క్రీన్ మీద వేళ్లతో నొక్కడం కాకుండా మన ఆలోచనలను పసిగట్టి పనులు చేసే ఏజెంటిక్ ఏఐ ఫోన్ వస్తోంది. ఇది ప్రస్తుతం మన దగ్గరున్న ఐఫోన్ కంటే వేల రెట్లు తెలివైనది. ఇది స్మార్ట్‌ఫోన్ల ప్రపంచంలో రెండో విప్లవంగా నిలిచిపోనుంది. యాప్‌లు మాయం…ప్రస్తుతం మనం ఒక పని చేయాలంటే…

Read More
Ahmedabad Fake AI Face Cheatings

తమ ముఖమే తమకు శత్రువు – అహ్మదాబాద్‌లో ఏఐతో నకిలీ బాస్ అవతారం

సహనం వందే, అహ్మదాబాద్‌: సాంకేతికత సాయంతో సత్యం సమాధి అవుతోంది. అహ్మదాబాద్‌లో వెలుగుచూసిన ఈ ఘోరం మన డిజిటల్ భద్రతను ప్రశ్నిస్తోంది. మీ మొబైల్‌కు ఎటువంటి సమాచారం రాకుండానే మీ గుర్తింపు మాయమవుతుంది. కృత్రిమ మేధస్సు ఇప్పుడు నేరగాళ్ల చేతిలో మారణాయుధంగా మారింది. అద్దంలో మీ ముఖం చూసుకోవాలన్నా భయపడే రోజులు వచ్చేశాయి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కితే ప్రాణాలు పోయేదాకా తెలియదు. అహ్మదాబాద్‌లో నకిలీ బాస్అహ్మదాబాద్ పోలీసులకు పట్టుబడ్డ నలుగురు నేరగాళ్లు వేసిన ప్లాన్ వింటే…

Read More
gohnson & gohnson Baby Talcum Powder

సువాసనల చాటున స్మశానాల వాసన – జాన్సన్ అండ్ జాన్సన్ మరణశాసనం

సహనం వందే, లండన్: తల్లి ప్రేమకు ప్రతిరూపంగా, పసిబిడ్డల సుగుణాల రాశిగా ముద్రవేసుకున్న జాన్సన్ అండ్ జాన్సన్ బ్రాండ్ ఇప్పుడు మరణశాసనంగా మారింది. దశాబ్దాల కాలంగా నమ్మకమే పెట్టుబడిగా సాగిన వ్యాపారం వెనుక భయంకరమైన క్యాన్సర్ నిజాలు దాగున్నాయనే ఆరోపణలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. పౌడర్ డబ్బాలో సువాసనల వెనుక మృత్యువు దాగి ఉందనే బాధితుల గొంతుక ఇప్పుడు బ్రిటన్ హైకోర్టు హాల్‌లో గర్జిస్తోంది. అంతర్జాతీయ కేసు…బ్రిటన్ న్యాయ చరిత్రలోనే ఇది అతిపెద్ద హెల్త్ ప్రొడక్ట్ కేసుగా నిలవనుంది….

Read More
AC effects Kidneys

ఏసీ అలవాటు కిడ్నీకి చేటు – చల్లని గది… రాళ్ల నిధి

సహనం వందే, హైదరాబాద్: వేసవి భానుడు భగభగలాడుతుంటే జనం ఏసీ గదుల్లోకి పారిపోతున్నారు. కానీ ఆ చల్లని గాలి కింద కూర్చుంటే ప్రాణాలు సేఫ్ అని అనుకుంటే పొరపాటే. బయట ఎండలు మండటం ఒకెత్తయితే లోపల చల్లదనం కిడ్నీలను రాళ్లమయం చేస్తోంది. చెమట పట్టని శరీరం లోలోపల విషాన్ని నింపుకుంటోంది. అందుకే ఇప్పుడు ఏసీ గదులే కిడ్నీ స్టోన్లకు అసలైన కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. చల్లదనం వెనుక ప్రమాదంవేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి మనం ఏసీని ఆశ్రయిస్తున్నాము….

Read More
Nasik TCS Sex Scandal

సాఫ్ట్‌వేర్ ముసుగు.. హార్డ్‌కోర్ ద్రోహం – నాసిక్ టాటా కంపెనీలో కామ పిశాచులు

సహనం వందే, నాసిక్: నాసిక్ లోని అతిపెద్ద ఐటీ దిగ్గజం ముసుగులో చీకటి దందాలు సాగుతున్నాయి. అమాయక యువతులే లక్ష్యంగా సాగుతున్న ఈ అరాచకాలు కార్పొరేట్ వ్యవస్థలోని కుళ్ళిన కోణాన్ని బయటపెట్టాయి. అధికారం, అణచివేత మధ్య నలిగిపోతున్న ఉద్యోగినుల ఆర్తనాదాలు ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నాయి. వ్యవస్థాగత వైఫల్యాలు నేరస్థులకు వరంగా మారడం ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం. కంపెనీ ముసుగులో చీకటి కోణంవడాలా రోడ్డులోని అశోక బిజినెస్ ఎన్‌క్లేవ్‌లో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బీపీఓ కార్యాలయం…

Read More
Telangana Medicines Scam

మందులు మింగేసిన వందల కోట్లు – 390 కోట్ల విలువైన ఔషధాలు మట్టిపాలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య రంగంలో మెడిసిన్ కొనుగోళ్ల పేరుతో జరిగిన భారీ కుంభకోణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మందులు చివరకు చెత్తకుప్పల పాలయ్యాయి. కోవిడ్ సంక్షోభాన్ని సాకుగా చూపి, అవసరానికి మించి చేసిన కొనుగోళ్లు ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల చిల్లు పెట్టాయి. పాలకుల నిర్లక్ష్యానికి ఈ గణాంకాలే నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. ఆడిట్ నివేదికలో విస్తుపోయే నిజాలుతెలంగాణలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు మరియు ఆరోగ్య సేవల నిర్వహణపై కాగ్ నిర్వహించిన…

Read More
Ayodhya Temple at Kukutpally

హైదరాబాదులో అయోధ్య భాగ్యం – భాగ్యనగరంలో రామ మందిరం

సహనం వందే, హైదరాబాద్: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ దేశమంతా రామమయమైంది. భక్త కోటి పరవశించిపోతున్న తరుణంలో హైదరాబాద్‌లో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. కూకట్‌పల్లిలో వెలసిన అయోధ్య రామ మందిర నమూనా భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. అచ్చం అసలు గుడిని తలపిస్తూ ఆధ్యాత్మిక శోభను వెదజల్లుతోంది. ఈ అద్భుత నిర్మాణం వెనుక ఉన్న విశేషాలు ఇప్పుడు నగరాన్ని ఆకర్షిస్తున్నాయి. అచ్చం అయోధ్య నమూనాఅయోధ్యలో నిర్మించిన రామ మందిరాన్ని చూసేందుకు అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే కూకట్‌పల్లి హౌసింగ్…

Read More
Get Companion Business with Aloneness

ఒంటరితనం తుంటరి వ్యాపారం – భారతీయ మార్కెట్లో అమ్మకానికి ఆత్మీయత

సహనం వందే, హైదరాబాద్: మెట్రో రైలు కోచ్ నిండా జనం ఉంటారు. వీధులన్నీ కిక్కిరిసి కనిపిస్తాయి. ఫోన్లలో నిరంతరం నోటిఫికేషన్లు మోగుతుంటాయి. కానీ గుండె లోతుల్లో మాత్రం అంతుచిక్కని నిశ్శబ్దం ఉంటుంది. కోట్లాది మంది మధ్య కూడా మనిషి తనకు తాను ఒంటరి అయిపోతున్నాడు. ఈ శూన్యం నుంచే సరికొత్త వ్యాపారం పుట్టుకొచ్చింది. డబ్బులిస్తే తోడుగా నడిచే స్నేహితులు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నారు. అమ్మకానికి ఆత్మీయతభారతదేశంలో ఇప్పుడు 95.8 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంత పెద్ద…

Read More
North Korea KIM Comments

ప్రాణత్యాగమే యుద్ధ వ్యూహం – కిమ్ సంచలనం… వీరత్వానికి కొత్త అర్థం

సహనం వందే, హైదరాబాద్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సైనికులకు మరణ శాసనం రాశారు. శత్రువుకు దొరికి బందీలుగా మారడం కంటే ప్రాణత్యాగమే మిన్నని పిలుపునిచ్చారు. సైనికులను మనుషులుగా కాకుండా యుద్ధ యంత్రాలుగా మార్చి రష్యా కోసం బలిపీఠం ఎక్కిస్తున్న కిమ్ వ్యూహం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రాణమే ఆఖరి ఆయుధంయుద్ధభూమిలో శత్రువుకు పట్టుబడటం అవమానమని కిమ్ తేల్చి చెప్పారు. ఒకవేళ చిక్కుకునే పరిస్థితి వస్తే ఆత్మాహుతికి పాల్పడాలని కఠిన ఆదేశాలు జారీ…

Read More