
నేడు ఇంటర్ ఫలితాలు విడుదల!
మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటన సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అధికారికంగా తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొంటారని…