
ఎయిర్ ఇండియా ఘటనతో… ప్రయాణీకుల ‘నేల’చూపులు
సహనం వందే, హైదరాబాద్/ఢిల్లీ:విమాన ప్రయాణం చేయాలంటే అనేకమంది భయపడుతున్నారు. అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనంతరం దేశంలో పలుచోట్ల నెలకొన్న సంఘటనలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. గురువారం వేర్వేరు చోట్ల రెండు విమానాలు అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి లేహ్కు వెళ్తున్న ఇండిగో విమానం (6ఈ 2006), హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన స్పైస్జెట్ విమానం సాంకేతిక లోపంతో తిరిగి వెనక్కు వచ్చేశాయి. ఈ రెండు ఘటనల్లోనూ ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అందరూ…