
భాస్కర మెడికల్ కాలేజీలో ఇంటర్న్ల వేదన
సహనం వందే, హైదరాబాద్: మొయినాబాద్లోని భాస్కర మెడికల్ కాలేజీ (బీఎంసీ) ఎంబీబీఎస్ ఇంటర్న్లకు నెలకు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే స్టైపెండ్గా చెల్లిస్తోందని ఆరోపిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కి ఫిర్యాదు అందింది. కళాశాల యాజమాన్యం ఇందుకు సంబంధించి 2003 నాటి పాత ప్రభుత్వ ఉత్తర్వును చూపుతూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్ఎంసీ గత కొద్ది నెలలుగా తెలంగాణ వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) దృష్టికి తీసుకెళ్లినా, ఎలాంటి చర్యలు…