
హత్యకు గురైన వ్యక్తి కోర్టులో ప్రత్యక్షం
సహనం వందే, అమెరికా: సాధారణంగా కోర్టులో నేరం చేసినవాళ్లు, సాక్షులు, లాయర్లు వాదోపవాదాలు వినిపిస్తుంటారు. కానీ అమెరికాలోని ఓ కోర్టులో మాత్రం మూడేళ్ల క్రితం హత్యకు గురైన వ్యక్తి స్వయంగా మాట్లాడి అందరినీ షాక్కు గురిచేశాడు! అవును మీరు విన్నది నిజమే. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీతో సృష్టించిన అతని డిజిటల్ రూపం కోర్టులో ప్రత్యక్షమై, తన హంతకుడి శిక్షా విచారణలో బాధితుడి వాంగ్మూలాన్ని వినిపించింది. ఈ అద్భుతమైన ఘటన న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర…