
వేణుస్వామి మైండ్ గేమ్ – సెలబ్రిటీల గోప్యతపై దాడి
సహనం వందే, హైదరాబాద్:ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం సంఘటనను తాను ముందే చెప్పానని జ్యోతిష్యురాలు శర్మిష్ఠ చేసిన పిచ్చి వ్యాఖ్యలపై దేశం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జ్యోతిష్యం చెప్తున్నారా? చావు ముహూర్తాలు పెడుతున్నారా? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అచ్చం అలాగే తెలుగు రాష్ట్రాల్లో వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సెలబ్రిటీలతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు. వారికి మానసిక వేదన కలిగిస్తూ కోట్లు గడుస్తున్నాడు. జోస్యం చెప్పి… దాని విరుగుడుకు యజ్ఞ యాగాల పేరుతో వసూళ్లు…