Kalisetti celebrates 44years of TDP

సముద్రపు అలలపై కలిశెట్టి అడుగులు – రణస్థలం తీరాన పసుపు జెండా రెపరెపలు

సహనం వందే, రణస్థలం: గాలిలో తేలే పసుపు రంగు కేవలం ఒక పార్టీ గుర్తు మాత్రమే కాదు. అది వేల మంది గుండె చప్పుడు. రణస్థలం సముద్ర తీరాన అలల హోరులో ఆ పసుపు జెండా రెపరెపలాడుతుంటే చరిత్ర మళ్ళీ తలవొంచి నమస్కరించింది. మత్స్యకారుల కష్టాల్లోనూ, పేదల కన్నీళ్లలోనూ తోడున్న ఒక రాజకీయ ప్రస్థానం ఇది. గతాన్ని మరిచిపోని ఒక నాయకుడి ఆరాటం ఈ వేడుకలో కనిపించింది. పసుపు జెండా పండుగవిజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వినూత్నంగా…

Read More
Madhavilatha Airport issue

మంత్రం మధ్యలో ముస్లిం – విమానాశ్రయంలో మాధవీలత దుర్గాసూక్తం

సహనం వందే, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఒకవైపు నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకుంటున్న ఇతర మతస్థులు… మరోవైపు కెమెరా ముందు గట్టిగా మంత్రాలు పఠిస్తున్న బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవీలత. ఈ దృశ్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా మతపరమైన హక్కులు, రాజకీయ ఉద్దేశాల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం భక్తి ప్రదర్శన మాత్రమేనా లేక వ్యూహాత్మకమైన చర్యనా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. విమానాశ్రయంలో మంత్రోచ్ఛారణఢిల్లీ…

Read More
Pawan Vijay Talks

విజయ్‌పై ‘పవనాస్త్రం’ – బీజేపీ, విజయ్ పొత్తుకు పవన్ రాయబారం

సహనం వందే, అమరావతి: తమిళనాడు రాజకీయ రణరంగం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల గుప్పిట్లో ఉన్న తమిళ నాట తమ జెండా ఎగురవేయాలని బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో సినీ గ్లామర్‌ను రాజకీయ శక్తిగా మలుచుకున్న విజయ్ ను తమ కూటమిలోకి ఆహ్వానించేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ కీలక బాధ్యతను రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అప్పగించడం ఇప్పుడు దక్షిణ భారత…

Read More
Ali LariJani - Iran War

రగిలే అగ్నిపర్వతం – ఇరాన్ యుద్ధ వ్యూహకర్త అలీ లారిజానీ

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ పాలన చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. వరుసగా అగ్రశ్రేణి నాయకులు ప్రాణాలు కోల్పోతున్నా ఆ దేశ వ్యవస్థ మాత్రం అస్సలు కుప్పకూలడం లేదు. ఈ అజేయమైన మనుగడ వెనుక ఉన్న అసలైన రాజకీయ వ్యూహాలు… వారి తెగింపును ప్రిన్స్‌టన్ ప్రొఫెసర్ బెర్నార్డ్ హైకెల్ విశ్లేషించారు. అగ్నిపర్వతంలా మండుతోన్న ఆ దేశాన్ని తన వ్యూహాలతో శాసిస్తున్న వ్యక్తి అలీ లారిజానీ. అమెరికా, ఇజ్రాయెల్ గర్జనలకు భయపడకుండా ఆయన గీస్తున్న గీత…

Read More
CPM Veera Bhadram

తుపాకి గొట్టం నేలమట్టం – నక్సలిజం అంతం… సీపీఎంలో ‘వీర’విద్రోహం

సహనం వందే, హైదరాబాద్: తుపాకి గొట్టం ద్వారానే అధికారం దక్కుతుందని నమ్మిన నక్సలైట్ల ప్రస్థానం ముగిసింది. విప్లవ పంథా విఫలమైందని గుర్తించిన 130 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చి చేరారు. మరోవైపు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే సీపీఎంలో లాబీయింగ్‌లు బయటపడటంతో ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలు ఈ వారం తెలంగాణ రాజకీయాల్లో అల్లకల్లోలానికి దారితీశాయి. విప్లవ పతనం దిశగా…తెలంగాణలో ఎర్రజెండా పట్టు సడలిపోయింది. మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు…

Read More
US Vs India's Rise

అ’గ్లి’రాజ్యం… వక్రబుద్ధి – చైనా మాదిరి భారత్ ఎదుగుదల వద్దట

సహనం వందే, హైదరాబాద్: అమెరికా నిజ స్వరూపం బట్టబయలైంది. ఇండియాను పూర్తిగా కంట్రోలులో పెట్టుకోవాలని నిస్సిగ్గుగా ప్రకటించింది. భారత్ తోక జాడించకుండా చూడాలని స్పష్టం చేసింది. గతంలో చైనాను ప్రోత్సహించి తప్పు చేశామని… ఇప్పుడు భారత్ విషయంలో అటువంటి పరిస్థితిని పునరావృతం చేయబోమని బహిరంగంగా ప్రకటించటం అగ్రరాజ్య అహంకారానికి నిదర్శనం. భారత్ తమకు పోటీగా మారనివ్వబోమంటూ అమెరికా అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారాయి. అగ్రరాజ్యం వక్రబుద్ధి…చైనాలా ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతే…

Read More
Tammineni

తమ్మినేని వీర’భ్రష్టం’ – సీపీఎం కేంద్ర కమిటీ అభిశంసన

సహనం వందే, హైదరాబాద్: సిపీఎం కోటలో ముఠాతత్వం ముదిరి పాకాన పడింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఎర్ర జెండా నీడన లాబీయింగ్‌లు రాజ్యమేలాయి. రాష్ట్ర మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై కేంద్ర కమిటీ వేసిన వేటు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. సిద్ధాంతాల ముసుగులో జరిగిన తెరవెనుక మంత్రాంగం బట్టబయలైంది. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఆకాంక్షలే మిన్నగా వ్యవహరించారన్న ఆరోపణలు ఇప్పుడు నిజమయ్యాయి. తమ్మినేనిపై క్రమశిక్షణ వేటుసీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని పార్టీ…

Read More
Telugu States Politics

రేవంత్ పంతం… నారా వారి కన్నెర్ర – తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సెగలు

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ కక్ష సాధింపులు మాత్రం పీక్స్‌కు వెళ్లాయి. అటు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సెగలు… ఇటు ఏపీలో వరుస కేసులు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. సమస్యలను గాలికొదిలేసి ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రాజకీయ చదరంగం ఇప్పుడు సామాన్య ప్రజల్లో కొత్త చర్చకు తెరలేపింది. తెలంగాణలో ట్యాపింగ్ గుబులుతెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఫోన్ ట్యాపింగ్…

Read More
60 Lakh Voters Risk in Telangana - Chief Election Commissioner

తెలంగాణలో 35 లక్షల ఓట్ల ఊచకోత? – ఓట్ల సవరణకు ఎన్నికల కమిషన్ నిర్ణయం

సహనం వందే, హైదరాబాద్: దేశంలో ఎన్నికల నగారా మోగకముందే ఓట్ల రాజకీయం ముదిరింది. ఓటరు జాబితా సవరణ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియ పెను దుమారం రేపుతోంది. లక్షలాది మంది ఓటు హక్కును కాలరాయడం వెనుక అధికార బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య పునాదులనే కదిలించేలా సాగుతున్న ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ పరిస్థితి రానుంది. తెలంగాణలో ఓట్ల వేట రాష్ట్ర పర్యటనలో ఉన్న…

Read More
ఒకే ప్రేములో జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు

కటౌట్ కిక్.. పాలిటిక్స్ షేక్ – ఒకే ఫ్రేములో జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఒక కటౌట్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా రాబోయే ఎన్నికల పొత్తుల వైపు ఈ ఫ్లెక్సీ సంకేతాలు పంపుతోంది. పుట్టినరోజు వేళ కొత్త రచ్చ…వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు (డిసెంబర్ 21) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ…

Read More