హైదరాబాద్‌లో పాకిస్తాన్ పేర్లతో బిజినెస్

సహనం వందే, హైదరాబాద్: కాశ్మీర్‌లో 26 మంది అమాయక భారతీయుల ప్రాణాలను బలిగొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరిహద్దుల్లో నెత్తురు ఏరులై పారుతుంటే… మన హైదరాబాద్ నగరంలో మాత్రం పాకిస్తాన్ నగరాల పేర్లతో వ్యాపారం యథేచ్ఛగా కొనసాగడం అత్యంత సిగ్గుచేటు. కరాచీ బేకరీ, పెషావర్ హోటల్ వంటి ప్రసిద్ధ సంస్థలు తమ పేర్లను ఇప్పటికీ మార్చకపోవడం వారి దేశభక్తి రాహిత్యాన్ని తేటతెల్లం చేస్తోంది. శత్రుదేశపు నగరాల పేర్లను బ్రాండ్‌లుగా వాడుకోవాల్సిన దుస్థితి…

Read More

స్మిత వర్సెస్ సీఎం

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఒకరకంగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఢీకొంటున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ ఫోటో రీట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు పోలీసులు జారీ చేసిన నోటీసులకు ఆమె ఏమాత్రం వెరవడంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ట్వీట్లను వరుసగా రీట్వీట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. తన ట్వీట్లను తొలగించకపోగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా రీట్వీట్లు…

Read More

కుల వివక్షపై ‘రోహిత్’ కొరడా

సహనం వందే, బెంగళూరు: విద్యా వ్యవస్థలో కుల వివక్షను అరికట్టడానికి ‘రోహిత్ వేముల చట్టం’ తీసుకురావాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనను గుర్తుచేస్తూ, విద్యా సంస్థల్లో వివక్షను అరికట్టేందుకు ఈ చట్టం అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కుల వివక్ష…

Read More

ఆస్తి కోసం తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు

సహనం వందే, నారాయణపేట: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లిలో మానవ సంబంధాలు పూర్తిగా దిగజారిన ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణిస్తే కనీసం అంత్యక్రియలకు కూడా రాని కొడుకు, తండ్రికి తామే కొడుకులం అంటూ ముందుకొచ్చిన కూతుళ్ల కథ ఇది. కుమారుడికి ఆస్తి పంచినా తీరని కోపం క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తిని కుమారుడు, కుమార్తెలకు పంచారు. కుమారుడు గిరీష్‌కు 15 ఎకరాల…

Read More

ప్యాలెస్ పాలిటిక్స్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: రాజకీయ నాయకులు పేదల సేవకులమని గొప్పలు చెప్పుకుంటూ, సామాన్య దుస్తులు, చెప్పులు ధరించి అత్యంత సాధారణ జీవన శైలితో కనిపిస్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధరించే దుస్తులు అత్యంత సామాన్యుడిని గుర్తుచేస్తాయి. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సాధారణమైన బట్టలు, చెప్పులతో కనిపిస్తారు. ఇక ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటినుంచి ఒకే స్టయిల్ సాధారణ దుస్తులు ధరిస్తారు. వందల కోట్లు ఉన్న తెలంగాణ రెవిన్యూ మంత్రి పొంగిలేటి…

Read More

సిజేరియన్ డెలివరీలపై కఠిన చర్యలు

వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ సహనం వందే, హైదరాబాద్: సరియైన కారణం లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సి-సెక్షన్ ఆడిట్‌ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ కాన్పుల సంఖ్యను మరింత పెంచాలని మంత్రి అన్నారు. సాధారణ కాన్పుల వల్ల కలిగే లాభాలను, సిజేరియన్ వల్ల జరిగే నష్టాలను…

Read More

స్మితా సబర్వాల్‌కు కంచె గచ్చిబౌలి ఎఫెక్ట్

పోలీసుల నోటీసులు సహనం వందే, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల అంశానికి సంబంధించి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి దయనీయంగా ఉందంటూ వైరల్ అయిన కొన్ని నకిలీ ఫోటోలను స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పోలీసులు ఈ విషయంపై మరింత విచారణ జరుపుతున్నారు.

Read More

ఉద్యమాలకు గ్లామర్

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఆధునిక ఉద్యమాలకు కొత్త దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని 400 ఎకరాల అటవీ భూములను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, విద్యార్థులు, మేధావులు, సినీ తారలు, ప్రజాసంఘాలు ఒక్కటై ఈ భూములను కాపాడారు. ఈ భూములను పునరుద్ధరించాలని బుధవారం తీర్పు ఇవ్వడంతో ఈ ఉద్యమం చారిత్రక విజయాన్ని సాధించింది. అటవీ సంపద కోసం విద్యార్థుల…

Read More

హిందీ హిందువుల భాష… ఉర్దూ ముస్లింల భాష కాదు

సహనం వందే, ఢిల్లీ: హిందీ హిందువుల భాష, ఉర్దూ ముస్లింల భాష అనే భావనను సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది. ఈ నమ్మకం వాస్తవ దూరం అని పేర్కొంటూ, భాష కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఉపయోగపడే సాధనమని, దానికి ఏ మతంతోనూ సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బుధవారం ఒక కేసు విచారణ సందర్భంగా చేశారు. భాషలను మతాలతో ముడిపెట్టడం వల్ల సమాజంలో చీలికలు వస్తాయని, భారతదేశం లాంటి…

Read More

35 రకాల ఔషధాలపై నిషేధం

నొప్పి నివారణ, మధుమేహం సహా పలు మందులు సహనం వందే ఢిల్లీ: దేశవ్యాప్తంగా 35 రకాల ఔషధాల తయారీని నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలను కూడా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నొప్పి నివారణ, మధుమేహం వంటి వ్యాధులకు ఉపయోగించే అనుమతి లేని సుమారు 35 రకాల ఔషధాలపై నిషేధం విధిస్తూ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థ సూచనల మేరకు అనుమతి…

Read More