ప్రజావాణి … ‘హైడ్రా’బాణి – రంగనాథ్ ఆధ్వర్యంలో కార్యక్రమం

సహనం వందే, హైద‌రాబాద్‌:హైడ్రా ప్రజల పక్షాన నిలుస్తోంది. ప్రజా గొంతుకగా మారుతుంది. అందుకోసం హైడ్రా కమిషనర్ ప్రత్యేకంగా ప్రజావాణి చేపట్టారు. సోమవారం నిర్వహించిన ప్ర‌జావాణికి 58 ఫిర్యాదులందాయి. ఇందులో అధిక‌భాగం పార్కుల క‌బ్జాలు, ర‌హ‌దారుల ఆక్ర‌మ‌ణ‌లు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల కాజేత ప్ర‌యత్నాల‌పై ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. ఈ ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. గూగుల్ మ్యాప్స్‌, లేఔట్ల‌తో పాటు.. ఎన్ఆర్ ఎస్‌సీ, స‌ర్వే ఆఫ్ ఇండియా, గ్రామ రికార్డుల‌ను ఫిర్యాదుదారుల ముందే ఆన్‌లైన్లో…

Read More

‘సృష్టి’కి వైద్యాధికారి అండదండ… నకిలీ ఐవీఎఫ్ సెంటర్లకు అనుమతులు

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ యూనివర్సల్ ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతకు హైదరాబాదుకు చెందిన ఒక కీలక వైద్యాధికారి అండదండలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమెపై అనేక ఫిర్యాదులు రావడం… కేసులు నమోదు కావడం జరిగింది. అయినప్పటికీ ఆ ఫెర్టిలిటీ సెంటర్ కు అన్ని విధాలుగా ఆ అధికారి అనుమతులు ఇచ్చినట్టు విమర్శలు వస్తున్నాయి. ఆమె చేస్తున్న అక్రమాల్లో ఆయనకు కూడా వాటా ఉందన్న ప్రచారం జరుగుతుంది. సంతానం లేని దంపతులను మోసం చేస్తూ కోట్లు…

Read More

సినీ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

సహనం వందే, హైదరాబాద్: టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు నెలకొన్నాయి. వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆయన రెండు కిడ్నీలు పాడవ్వడంతో డయాలసిస్ చేయించుకుంటూ వచ్చారు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. కిడ్నీ మార్పిడికి రూ. 50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు…

Read More

రుచుల విందులో ‘అదుర్స్’ – ప్రపంచంలో 50వ స్థానం హైదరాబాద్

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచ ఆహార పటంలో భారతదేశం తన విశిష్టమైన వంటకాలతో మరోసారి సగర్వంగా నిలిచింది. ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్‌అట్లాస్ ప్రకటించిన ప్రపంచంలోని టాప్ 100 ఆహార నగరాల జాబితాలో ఆరు భారతీయ నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఇది భారతదేశపు అద్భుతమైన, వైవిధ్యమైన వంటకాల వారసత్వానికి నిదర్శనం. ఈ జాబితాలో ముంబై (5వ స్థానం) అగ్రగామిగా నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో అమృత్‌సర్ (43వ స్థానం), ఢిల్లీ (45వ స్థానం), హైదరాబాద్ (50వ స్థానం), కోల్‌కతా…

Read More

పదో తరగతి బాలిక కర్కషత్వం -ప్రియుడి మోజులో పడి తల్లి హత్య

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన తల్లి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పదో తరగతి చదువుతున్న బాలిక, ఆమె ప్రియుడు శివ, అతని తమ్ముడు కలిసి తల్లి అంజలిని దారుణంగా హత్య చేసిన ఘటన నగరాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. అయితే ఈ దారుణమైన హత్యకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన మృతురాలి చిన్న కుమార్తె ప్రియ… ఈ వ్యవహారంలో వెలుగులోకి తెచ్చిన నిజాలు యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి….

Read More

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై… సినీ హీరోల విలనిజం పోకడ

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై… సినీ హీరోల విలనిజం పోకడ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల తెలుగు సినిమా పరిశ్రమలోని అగ్రశ్రేణి హీరోలు, నిర్మాతలు, దర్శకులు డోంట్ కేర్ అన్న ధోరణి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాలతో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ, అదే సమయంలో రాయితీలు, అనుమతులు పొందడంలో మాత్రం ప్రభుత్వాలపై ఆధారపడుతున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వందలు, వేల కోట్ల రూపాయలకు పడగలెత్తిన కొందరు సినీ ప్రముఖుల కళ్లు నెత్తికెక్కాయని,…

Read More

మంత్రుల గుండెల్లో రేవంత్ రెడ్డి- శాఖల కేటాయింపు వెనుక వ్యూహం

సహనం వందే, హైదరాబాద్:మంత్రివర్గ విస్తరణ తర్వాత శాఖల కేటాయింపు ప్రకటించని ఆ రెండు రోజులు రాష్ట్రంలోని మంత్రులంతా నిద్రలేని రాత్రులు గడిపారు. తమ శాఖ మారుతుందని కొందరు… అప్రధాన్య శాఖలోకి మారుస్తారని మరికొందరు… ఇద్దరు డిప్యూటీ సీఎంలు వస్తారని ఇంకొందరు… ఇలా ఒత్తిడితో కూడిన వాతావరణంలోకి వెళ్ళిపోయారు. చివరకు ముఖ్యమంత్రి ఎలాంటి ప్రక్షాళన లేకుండానే… శాఖలు మార్చకుండానే… తన వద్ద ఉన్న శాఖలను కొత్త వారికి ఇచ్చి వారిని అత్యంత కూల్‌గా ఉంచారు. దీంతో పాత మంత్రులు…

Read More

మెడికల్ కౌన్సిల్ – నకిలీ వైద్యులపై కొరడా

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టి.ఎం.సి.) ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో సరైన వైద్య విద్యా అర్హతలు లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్న 15 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసింది. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలుగత నెలలో జరిగిన ఈ తనిఖీల అనంతరం ఈ కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తెలియజేసింది. ఈ తనిఖీలను…

Read More

స్కూల్ మోదీ… కాలేజీ చంద్రబాబు..ఉద్యోగం రాహుల్ గాంధీ

సహనం వందే, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆదివారం హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ‘ప్రజలే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్, తన రాజకీయ జీవితంలో ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలతో తనకున్న అనుబంధాన్ని ఆసక్తికరంగా వెల్లడించారు. ‘స్కూల్ మోదీ… కాలేజీ చంద్రబాబు దగ్గర చదివాను. ఇప్పుడు రాహుల్…

Read More

ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ చీఫ్ అసంతృప్తి

సహనం వందే, హైదరాబాద్: మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదని, వెంటనే తమ పనితీరును సరిదిద్దుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసిన ఆయన, ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూ మీటింగ్‌లో మాట్లాడుతూ, పలువురు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడంతో…

Read More