రాగి బాటిళ్లతో కిడ్నీలకు ముప్పు!

సహనం వందే, హైదరాబాద్: కాపర్ (రాగి) బాటిళ్లు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే, అతిగా రాగిని తీసుకోవడం వల్ల ‘కాపర్ టాక్సిసిటీ’ సమస్య తలెత్తుతుంది. ఇది కిడ్నీలు, లివర్‌కు తీవ్రమైన హాని కలిగించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ లేదా లివర్ సమస్యలు ఉన్నవారు రాగి బాటిళ్లను ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం… రాగి మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది…

Read More

కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్‌లో అందాల తారలు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో అపారమైన సేవ‌లందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు మంగళవారం సందర్శించారు. సౌందర్యం కేవలం బాహ్య రూపానికే పరిమితం కాదని, సామాజిక సేవలో కూడా తమ వంతు పాత్ర పోషించగలమని ఈ సందర్శన ద్వారా వారు చాటిచెప్పారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులకు కిమ్స్ గ్రూప్…

Read More

గుల్జార్ ఘటన…వ్యవస్థాగత ఉగ్రవాదం

సహనం వందే, హైదరాబాద్: పహల్గాంలో ఉగ్రవాదుల చేతుల్లో 26 మంది చనిపోతే, భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై యుద్ధం చేసింది. మరి హైదరాబాదులోని గుల్జార్ హౌస్‌లో మంటలు చెలరేగి 17 మంది చనిపోతే ఎవరిపై మనం యుద్ధం చేయాలి? నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలను బలిగొన్న ఇక్కడ ఉగ్రవాదులు ఎవరు? అధికారులు కాదా? ఇది అంతర్గత వ్యవస్థాగత ఉగ్రవాదం కాదా? ఈ ఉగ్రవాదులపై చర్యలు ఉండవా? ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటే సరిపోతుందా? ఇది కేవలం దుర్ఘటన కాదు….

Read More

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 ప్రారంభం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో మిస్ వరల్డ్ 2025 పోటీలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళా ప్రదర్శనల మధ్య ఈ పోటీలు ప్రారంభమైనట్లు ముఖ్యమంత్రి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. 110 దేశాల ప్రతినిధుల ప్రదర్శనతెలంగాణ సంప్రదాయ కళలు, పోటీదారుల పాశ్చాత్య కళల మేళవింపుతో మిస్ వరల్డ్…

Read More

‘అందం’పై యుద్ధమేఘం

సహనం వందే, హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజలు ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నారు. భారత సైన్యం సరిహద్దుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా శత్రువును ఎదుర్కొంటున్న సమయంలో, అందాల పోటీల్లో ఆనందించే పరిస్థితి దేశంలో లేదని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ‘మన జవాన్లు దేశం కోసం పోరాడుతుంటే, హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహించడం జాతీయ మనోభావాలను గాయపరుస్తుంద’ని ఒకరు సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోటీలు కొనసాగితే దేశ ఐక్యతకు భంగం కలిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు…

Read More

అత్యవసర సర్వీసు ఉద్యోగుల సెలవులు రద్దు

సహనం వందే, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశ సైన్యానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని స్పష్టం చేశారు. కీలక ఆదేశాలు:

Read More

ప్రభుత్వ డబ్బుతో ఏఐజీకి డప్పు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ వేదికపై పరువు తీసుకుంటోంది! అందాల పోటీల పేరుతో ప్రజల సొమ్మును యథేచ్ఛగా ధారపోస్తూ ప్రైవేట్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తోంది. మెడికల్ టూరిజం ముసుగులో ఒకవైపు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వంటి ఆసుపత్రుల వ్యాపారానికి ఎర్ర తివాచీ పరుస్తోంది. మరోవైపు ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు పెంచేందుకు అందమైన అమ్మాయిలను వాడుకుంటోంది. ఇది ప్రభుత్వ సొమ్ముతో జరుగుతున్న వ్యాపారం కాదా? ప్రజల నమ్మకాన్ని మంటగలిపే దారుణమైన చర్య కాదా?…

Read More

రేవంత్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య అగాధం మరింత పెరిగింది! పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9 తర్వాత సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు తెగేసి చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే సమ్మెకు సిద్ధం కావడంతో, రాష్ట్రంలో ఉద్యోగుల ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఆర్టీసీ సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించిపోనుంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఉద్యోగులను మరింత రెచ్చగొట్టాయి. ‘ఉద్యోగులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారొద్దు’ అంటూ హితవు పలికిన సీఎంకు,…

Read More

తెలంగాణ ఉద్యోగుల ఆగ్రహజ్వాల

సహనం వందే హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్యకార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టడానికి సిద్ధమైంది. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఒక రోజు సుదీర్ఘ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు సమావేశమై, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9వ తేదీ తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు….

Read More

జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత

జడ్జీల సంఘం నేతలు మురళిమోహన్, ప్రభాకరరావు సంతాపం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. ఆమె మృతికి తెలంగాణ జడ్జీల సంఘం అధ్యక్షులు కె. ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి కె.మురళి మోహన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. న్యాయసేవల రంగంలో ప్రియదర్శిని చేసిన కృషిని వారు కొనియాడారు. ఆమె మృతదేహానికి నివాళి అర్పించారు….

Read More