మంత్రి సేఫ్… సెక్రటరీ ఔట్ – కేంద్ర విద్యాశాఖలో ప్రక్షాళన
సహనం వందే, న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేస్తున్న నీట్ పేపర్ లీక్ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించాలని నిరసనకారులు గొంతుకలు చించుకుంటుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం అనూహ్య రీతిలో చక్రం తిప్పింది. మంత్రిని అలాగే ఉంచి, తెరవెనుక ఉండే విద్యాశాఖ కార్యదర్శిపై వేటు వేసింది. విద్యార్థులు, యువజన సంఘాలు, సీజేపీ ఆందోళనలతో దేశ రాజధానితో సహా దేశవ్యాప్తంగా నిప్పులు చెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వంలోని పెద్దల మెడకు…