భువనగిరి వైద్య శాఖలో అసంతృప్తి జ్వాలలు

సహనం వందే, భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయంలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితులపై వైద్య ఉద్యోగులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. మహిళా ఉద్యోగులపై జరుగుతున్న వేధింపులు, విపత్కర సమయాల్లో డీఎంహెచ్ఓ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, పరిపాలనాపరమైన అవకతవకలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై జిల్లాలోని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఏకతాటిపైకి వచ్చారు. ఈ మేరకు వారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. తమ ఆవేదనను, డీఎంహెచ్ఓ నిరంకుశ వైఖరిని వివరిస్తూ…

Read More

కుల వ్యవస్థపై అవిశ్రాంత పోరాటం

నేడు జ్యోతి రావ్ ఫూలే జయంతి (కె.రాములు, ఎండీ, ఆగ్రోస్)భారతదేశ చరిత్రలో కుల వ్యవస్థ ఒక చీకటి అధ్యాయం. ఈ దుర్మార్గమైన వ్యవస్థ సమాజంలో అసమానతలను, అణచివేతను సృష్టించిన కాలంలో దానిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన గొప్ప సంఘ సంస్కర్తలలో జ్యోతి రావ్ ఫూలే అగ్రగణ్యులు. ఆయన చేసిన సామాజిక పోరాటం, మహిళల విద్య కోసం ఆయన చేసిన కృషి నేటికీ మనకు స్ఫూర్తినిస్తుంది. కుల వివక్షతో అణగారిన వర్గాల విముక్తి కోసం, స్త్రీ విద్య యొక్క…

Read More

నా బ్రాండ్ ‘యంగ్ ఇండియా’

సహనం వందే, హైదరాబాద్:‘ప్రతీ ముఖ్యమంత్రికీ ఒక బ్రాండ్‌ ఉంటుంది. రూ. 2కే కిలో బియ్యం ఎన్టీఆర్‌ బ్రాండ్.. ఐటీ అంటే చంద్రబాబు.. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్‌ గుర్తుకు వస్తారు. కొంతమంది ఉద్యమాలే తమ బ్రాండ్‌ అని గొప్పలు చెప్పుకుంటారు.. యంగ్‌ ఇండియా స్కూల్‌ ఈజ్‌ మై బ్రాండ్‌’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. “దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని నేను విశ్వసిస్తున్నా. యంగ్ ఇండియా మా బ్రాండ్‌గా, తరగతి గదులను బలోపేతం చేస్తాం” అన్నారు….

Read More

గూడు కోసం జర్నలిస్టుల గోడు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారిలో దాదాపు 80 శాతం మంది బడుగు, బలహీన వర్గాల నుంచి వచ్చినవారే. మిగిలిన 20 శాతం మంది దిగువ మధ్య తరగతి నేపథ్యం గలవారు. అయినప్పటికీ, జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో జర్నలిస్టులను సంపన్న వర్గాలుగా వ్యాఖ్యానించడం విచారకరం. ఈ తీర్పు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హామీ అమలు సందిగ్ధంలో పడింది. ఈ పరిస్థితుల్లో జర్నలిస్ట్ హౌసింగ్…

Read More

అగ్రకులాల గుప్పిట్లో బహుజన ఉద్యమం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో రెడ్డి రిపబ్లిక్‌ రాజ్యం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కమ్మ, కాపు వర్గాలే రాజ్యమేలుతున్నాయి. కేవలం 15% గా ఉన్న అగ్రకులాలు 85% ఉన్న బడుగు బలహీన వర్గాలను శాసిస్తున్నాయి. రాజకీయ అధికారం మొదలు… సమస్త సంపద వారి చేతుల్లోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో మెజారిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీలను తమ గుప్పెట్లో పెట్టుకుని, వారిని ఓటు బ్యాంకుగా మార్చుకొని రాజ్యాధికారం చలాయిస్తున్నారు. రాజ్యాధికారం కోసం పోరాడాలని అంబేద్కర్, కాన్షీరాం, జ్యోతిరావు పూలే వంటి…

Read More

అసెంబ్లీకి రారు… ప్రజల వద్దకు పోరు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో ఎమ్మెల్యేల పనితీరుపై పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ సంస్థలు నిర్వహించిన సర్వే రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. పాలక, ప్రతిపక్ష పార్టీల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో స్థానంలో నిలవడం తీవ్ర దుమారానికి రేకెత్తిస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావడం లేదని, ప్రజల్లో కూడా తిరగడం లేదని విమర్శలు వస్తున్నప్పటికీ, సర్వేలో ఆయనకు రెండో స్థానం దక్కడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక కేసీఆర్ మేనల్లుడు ఎమ్మెల్యే హరీష్…

Read More

ట్రంప్ ఖమ్మంలో పుట్టాడా?

   అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ పేరుతో ఆధార్– ఖమ్మంలోని మామిళ్లగూడెం అడ్రస్ తో కార్డు– ఇలా ఏఐతో నకిలీ ఆధార్, పాన్ కార్డులు– ఎలాంటి పత్రాలనైనా సృష్టించే అవకాశం– ఆర్థిక మోసాలు మరింత పెరిగే ప్రమాదం– ఆందోళన వ్యక్తం చేస్తున్న యంత్రాంగం సహనం వందే, హైదరాబాద్:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పుట్టాడా? వినడానికి విస్మయం కలిగిస్తున్నా… ఆధార్ కార్డు మాత్రం అలాగే చెబుతుంది. అమెరికాలో జన్మించిన ట్రంప్ కు భారత్ లోని ఆధార్…

Read More

నేరాలతో రాష్ట్రం అస్తవ్యస్తం

 – హత్యలు, అత్యాచారాలు, సైబర్ నేరాలతో అట్టుడుకుతోన్న తెలంగాణ – హైదరాబాద్‌లో విదేశీ యువతిపై అఘాయిత్యం – గతవారం ఎంఎంటీఎస్ రైలులో మహిళపైనా ఇదే పరిస్థితి దాడి – భద్రత ఎక్కడ? – హైదరాబాద్ నడిబొడ్డున అడ్వకేట్ హత్య సంచలనం – బెట్టింగ్ యాప్ లతో ఆత్మహత్యలు… ఇటీవల రైలు పట్టాల కింద పడి యువకుడి ఆత్మహత్య – హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వివాదం… విద్యార్థులపై లాఠీచార్జి – హోం మంత్రి లేక నిర్లక్ష్యం… ముఖ్యమంత్రే…

Read More

‘ఓవైసీకి తెలుగు రాదు… సీతక్కకు హిందీ రాదు’

   అసెంబ్లీ సాక్షిగా తెలుగుపై సాంస్కృతిక దాడి – హైదరాబాద్ హిందీ నగరంగా మారుతుంది – ఈ దుస్థితి తెలుగు అస్తిత్వానికి పెను ముప్పు! – సిటీలో తెలుగులో మాట్లాడేవారు 40 శాతమే – ఉత్తరాది వలసలు, వ్యాపారాలతో అధోగతి – పదో తరగతిలో హిందీ ఫెయిల్ అయ్యేవారు ఎక్కువే – విద్యార్థుల మెడకు త్రిభాషా సూత్రం అమలు – మ్యూజియం భాషగా తెలుగు మారకముందే మేల్కొనాలి – హిందీ దురాక్రమణను తిప్పి కొట్టాలని ‘సౌత్ సేన’…

Read More

సెంట్రల్ వర్సిటీ భూమి రణరంగం

   ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు – అది ప్రభుత్వ భూమి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్ఠీకరణ సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం విద్యార్థుల ఆగ్రహానికి దారితీసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టగా, పోలీసులు వారిని అక్రమంగా అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ భూమిని ఐటీ పార్కులు, ఇతర…

Read More