హైదరాబాద్‌లో పాకిస్తాన్ పేర్లతో బిజినెస్

సహనం వందే, హైదరాబాద్: కాశ్మీర్‌లో 26 మంది అమాయక భారతీయుల ప్రాణాలను బలిగొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరిహద్దుల్లో నెత్తురు ఏరులై పారుతుంటే… మన హైదరాబాద్ నగరంలో మాత్రం పాకిస్తాన్ నగరాల పేర్లతో వ్యాపారం యథేచ్ఛగా కొనసాగడం అత్యంత సిగ్గుచేటు. కరాచీ బేకరీ, పెషావర్ హోటల్ వంటి ప్రసిద్ధ సంస్థలు తమ పేర్లను ఇప్పటికీ మార్చకపోవడం వారి దేశభక్తి రాహిత్యాన్ని తేటతెల్లం చేస్తోంది. శత్రుదేశపు నగరాల పేర్లను బ్రాండ్‌లుగా వాడుకోవాల్సిన దుస్థితి…

Read More

సిజేరియన్ డెలివరీలపై కఠిన చర్యలు

వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ సహనం వందే, హైదరాబాద్: సరియైన కారణం లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సి-సెక్షన్ ఆడిట్‌ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ కాన్పుల సంఖ్యను మరింత పెంచాలని మంత్రి అన్నారు. సాధారణ కాన్పుల వల్ల కలిగే లాభాలను, సిజేరియన్ వల్ల జరిగే నష్టాలను…

Read More

యాదాద్రి జిల్లాలో వైద్యం అస్తవ్యస్తం

సహనం వందే, హైదరాబాద్: ప్రభుత్వం నుంచి నిధులు రావడమే కష్టం. అలాంటిది వచ్చిన నిధులను కూడా వాడుకోకపోవడం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వైద్యాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఆ జిల్లాకు వచ్చిన నిధుల్లో దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయకపోవడంతో అవి తిరిగి వెనక్కి పోయాయి. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్ సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్ సీ), జిల్లా ఆసుపత్రుల్లో సమస్యలు తిష్ట వేశాయి. దీంతో రోగులకు సరైన వైద్యం చేయడానికి…

Read More

కరెన్సీ వెనుక క్యాస్టిజం

(విజయ్ పుట్టపాగ, టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ లాంటి మహనీయుడి చిత్రం మన కరెన్సీ నోట్లపై లేకపోవడం కేవలం పొరపాటు కాదు, ఆధిపత్య వర్గాల కుట్ర. భారత రాజ్యాంగ శిల్పి, రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటులో కీలక సూత్రధారి, కుల నిర్మూలన యోధుడైన అంబేద్కర్‌ను గౌరవించకపోవడం సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న వివక్షను సూచిస్తుంది. మహాత్మా గాంధీ జాతిపిత కాగా… అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన యోధుడు. దేశంలో అధిక సంఖ్యాకులైన బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆరాధ్య…

Read More

వక్ఫ్ భూముల కుంభకోణం!

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డుకు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లోని వక్ఫ్ ఆస్తుల దుస్థితి మరోసారి తెరపైకి వచ్చింది. అసలు ఎన్ని ఎకరాలు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి? ఎంత మేర కబ్జాకు గురయ్యాయి? అనే అంశాలపై తాజాగా ఒక నివేదిక వెలువడింది. తెలంగాణలో 74% వక్ఫ్ భూములు కబ్జా!తెలంగాణలో వక్ఫ్ బోర్డు…

Read More

యాదాద్రిలో వైద్య డిప్యూటేషన్ల దందా

ఏకంగా 106 మంది సిబ్బందికి డిప్యూటేషన్లు సహనం వందే, హైదరాబాద్:వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్లపై మంత్రి దామోదర రాజనర్సింహ నిషేధం విధించినా, యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం వైద్య మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. మంత్రి ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. తమకు ఎవరూ ఎదురులేదన్న ధోరణితో ఉన్నారు. మంత్రి ఆదేశాలకు విరుద్ధంగా, ఈ కాలంలో ఏకంగా 106 మందిని డిప్యూటేషన్ ద్వారా ఇష్టమైన చోటకు పంపించారు. నర్సింగ్ ఆఫీసర్లు మొదలు సీనియర్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర సిబ్బందికి డిప్యూటేషన్లు…

Read More

భువనగిరి వైద్య శాఖలో అసంతృప్తి జ్వాలలు

సహనం వందే, భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయంలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితులపై వైద్య ఉద్యోగులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. మహిళా ఉద్యోగులపై జరుగుతున్న వేధింపులు, విపత్కర సమయాల్లో డీఎంహెచ్ఓ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, పరిపాలనాపరమైన అవకతవకలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై జిల్లాలోని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఏకతాటిపైకి వచ్చారు. ఈ మేరకు వారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. తమ ఆవేదనను, డీఎంహెచ్ఓ నిరంకుశ వైఖరిని వివరిస్తూ…

Read More

కుల వ్యవస్థపై అవిశ్రాంత పోరాటం

నేడు జ్యోతి రావ్ ఫూలే జయంతి (కె.రాములు, ఎండీ, ఆగ్రోస్)భారతదేశ చరిత్రలో కుల వ్యవస్థ ఒక చీకటి అధ్యాయం. ఈ దుర్మార్గమైన వ్యవస్థ సమాజంలో అసమానతలను, అణచివేతను సృష్టించిన కాలంలో దానిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన గొప్ప సంఘ సంస్కర్తలలో జ్యోతి రావ్ ఫూలే అగ్రగణ్యులు. ఆయన చేసిన సామాజిక పోరాటం, మహిళల విద్య కోసం ఆయన చేసిన కృషి నేటికీ మనకు స్ఫూర్తినిస్తుంది. కుల వివక్షతో అణగారిన వర్గాల విముక్తి కోసం, స్త్రీ విద్య యొక్క…

Read More

నా బ్రాండ్ ‘యంగ్ ఇండియా’

సహనం వందే, హైదరాబాద్:‘ప్రతీ ముఖ్యమంత్రికీ ఒక బ్రాండ్‌ ఉంటుంది. రూ. 2కే కిలో బియ్యం ఎన్టీఆర్‌ బ్రాండ్.. ఐటీ అంటే చంద్రబాబు.. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్‌ గుర్తుకు వస్తారు. కొంతమంది ఉద్యమాలే తమ బ్రాండ్‌ అని గొప్పలు చెప్పుకుంటారు.. యంగ్‌ ఇండియా స్కూల్‌ ఈజ్‌ మై బ్రాండ్‌’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. “దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని నేను విశ్వసిస్తున్నా. యంగ్ ఇండియా మా బ్రాండ్‌గా, తరగతి గదులను బలోపేతం చేస్తాం” అన్నారు….

Read More

గూడు కోసం జర్నలిస్టుల గోడు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారిలో దాదాపు 80 శాతం మంది బడుగు, బలహీన వర్గాల నుంచి వచ్చినవారే. మిగిలిన 20 శాతం మంది దిగువ మధ్య తరగతి నేపథ్యం గలవారు. అయినప్పటికీ, జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో జర్నలిస్టులను సంపన్న వర్గాలుగా వ్యాఖ్యానించడం విచారకరం. ఈ తీర్పు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హామీ అమలు సందిగ్ధంలో పడింది. ఈ పరిస్థితుల్లో జర్నలిస్ట్ హౌసింగ్…

Read More