నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం

సహనం వందే, హైదరాబాద్: వానాకాలం పంటల సాగుకు సన్నద్ధంగా ఉండాలని, నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం వ్యవసాయశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వానాకాలం పంటల సాగుపై సమీక్ష సమావేశం…

Read More

‘అగ్ల్రీ’ చైర్మన్లు… డమ్మీ ఎండీలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ శాఖలోని కార్పొరేషన్లు ఇప్పుడు చైర్మన్ల సొంత జాగీర్లుగా మారిపోయాయి. కొందరు చైర్మన్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఐఏఎస్ అధికారులుగా ఉన్న ఎండీలు సైతం వారి గుప్పిట్లో డమ్మీలుగా మిగిలిపోయారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న చైర్మన్ల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎండీలు గులాంలు.. చైర్మన్లదే పెత్తనం! వ్యవసాయశాఖలో ఆగ్రోస్, ఆయిల్ ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థ, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, హాకా, టెస్కాబ్, మార్క్‌ఫెడ్ వంటి…

Read More

‘కంచ’ విధ్వంసంపై సుప్రీం గరం గరం

సహనం వందే, ఢిల్లీ: కంచ గచ్చిబౌలిలోని విలువైన అటవీ భూమిని ఐటీ ప్రాజెక్టు కోసం ధ్వంసం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. అటవీ భూమిని తిరిగి పూర్వ స్థితికి తీసుకురావాలని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఆరుగురు ఉన్నతాధికారులను జైలుకు పంపాల్సి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. సుమోటోగా స్వీకరించిన కోర్టు…ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం సమీపంలోని…

Read More

జొన్న ‘అవినీతి’ కేంద్రాలు

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో అనేక జొన్న కొనుగోలు కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారాయి. పక్క రాష్ట్రాల నుంచి అడ్డదారిలో జొన్నలు తెచ్చి, మద్దతు ధర పేరుతో దళారులు లక్షల రూపాయలు కొల్లగొడుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు కళ్లు మూసుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా తాంసిలో ముక్కిపోయిన అక్రమ జొన్నలు పట్టుబడటం సంచలనం రేపింది. ఈ ఘటన వెనుక అధికారుల హస్తం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసలు ఈ జొన్నలు ఎవరివో, ఎక్కడి నుంచి తెచ్చారో తేల్చకుండా అధికారులు దాస్తున్నారు….

Read More

సీపీఆర్’హూ’?

సహనం వందే, హైదరాబాద్: అయోధ్యరెడ్డి ఆర్టీఐ కమిషనర్ గా నియమితులవడంతో, ఆయన ఖాళీ చేసిన ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల అధికారి పోస్టులోకి కొత్తగా ఎవరు వస్తారన్న విషయం మీడియా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి కార్యాలయంలో అత్యంత కీలకమైన ఈ సీపీఆర్ఓ పదవి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక పదవిని దక్కించుకోవడానికి సీనియర్ జర్నలిస్టులు పోటీ పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కొందరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయగా,…

Read More

ప్రజారోగ్యంలో ఖల్ ‘నాయక్’

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ప్రజల ఆరోగ్యం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా కొందరు అధికారులు తమ జేబులు నింపుకుంటున్నారు. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్‌పై విజిలెన్స్ విచారణలో అక్రమాలు బట్టబయలైనా, ప్రభుత్వం మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. నోటీసులు ఇచ్చినా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు వైద్య సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఆరు నెలల కిందట ఆయన్ను తప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం…

Read More

వ్యవసాయశాఖలో కోవర్ట్

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల అమలుతీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ, రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతుండటం వెనుక వ్యవసాయశాఖలోని ఒకరిద్దరి హస్తం ఉందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పథకాల రూపకల్పన నుంచి అమలు వరకు జరుగుతున్న తప్పిదాలు యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? లేక ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే దురుద్దేశంతో కొందరు కావాలనే చేస్తున్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా…

Read More

ఆయిల్ ఫెడ్ అవకతవకల్లో ‘ప్రవీణ్యుడు’

సహనం వందే, హైదరాబాద్: ఆయన ఆయిల్ ఫెడ్ నర్సరీలో అక్రమాలకు పాల్పడ్డాడని నిర్ధారించారు. అప్పటి ఎండి నిర్మల దీనిపై విచారణ చేసి తప్పు జరిగినట్టు నిర్ధారించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు నర్సరీలో జరిగిన అక్రమాలకు అతన్ని బాధ్యున్ని చేసి రూ. 40 లక్షలు రికవరీ చేయాలని ఆమె నిర్ణయించారు. కానీ ఆమె అనంతరం వచ్చినవారు ఎవరూ కూడా అక్రమాలకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకోకపోగా అందలం ఎక్కించారు. ఇప్పుడు హైదరాబాద్ ఆయిల్ ఫెడ్ సంస్థలో…

Read More

కొకైన్ మత్తులో ‘ఆసుపత్రి’ మాజీ…

సహనం వందే, హైదరాబాద్: ప్రముఖ ఒమేగా హాస్పిటల్స్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) నమ్రతా చిగురుపాటి (34) ఏకంగా వాట్సాప్ ద్వారా రూ. 5 లక్షల విలువైన కొకైన్ కొనుగోలు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనతో ఉన్నత వర్గాల్లో డ్రగ్స్ ఎంతలా పాతుకుపోయిందో మరోసారి బహిర్గతమైంది. ఈ వ్యవహారంలో ముంబైకి చెందిన డ్రగ్ సరఫరాదారుడు వంశ్ ధక్కర్‌కు సహకరిస్తున్న బాలకృష్ణ (రాంప్యార్ రామ్) అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్…

Read More

సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డికి సంఘీభావం

సహనం వందే, హైదరాబాద్: సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షి జర్నలిస్టులు, ఇతర మీడియా ప్రతినిధులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆ సంస్థ తీవ్రంగా ఆరోపిస్తోంది. సాక్షి మీడియా వర్గాల ప్రకారం… పోలీసులు ఎటువంటి సెర్చ్ వారెంట్ చూపకుండానే…

Read More