ప్రముఖులు జైళ్లలో అతిథులు – డబ్బుంటే జైళ్లు గెస్ట్ హౌస్ లే

సహనం వందే, రాజమండ్రి:‘జైలుకు పంపిస్తే విశ్రాంతి తీసుకుంటా’… ఈ వ్యాఖ్య చేసింది ఎవరో కాదు… తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్. ధనికులకు చట్టం చుట్టం అవుతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. తప్పుచేసి జైలుకు వెళ్లినప్పటికీ వారికి రాచ మర్యాదలు కల్పిస్తారు. ఒకప్పుడు జగన్… తర్వాత రేవంత్ రెడ్డి..‌. చంద్రబాబు నాయుడు… కవిత.‌.‌. ఇప్పుడు మిధున్ రెడ్డి. వీళ్ళందరికీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. జైళ్లు ఒకరకంగా ధనికులకు విశ్రాంతి కేంద్రాలుగా మారిపోవడం దురదృష్టకరం. ఎంత డబ్బు చెల్లిస్తే అన్ని…

Read More

ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి ఊట – ఐఐఓపీఆర్ బృందం పర్యటనలో వాస్తవాలు

సహనం వందే, అశ్వారావుపేట:ఆయిల్ పామ్ తోటలు తవ్విన కొద్దీ అవినీతి బండారం బయటపడుతుంది. ఇదొక వెబ్ సిరీస్ లాగా రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తుంది. జన్యు లోపాలున్న మొక్కలతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే, ఆయిల్ ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం, కుమ్మక్కు రాజకీయాలు వారిని మరింత దిగజారుస్తున్నాయి. ఇటీవల ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ ప్రతినిధులు, ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు ఆసన్నగూడెం గ్రామంలో పర్యటించినప్పుడు వెలుగుచూసిన వాస్తవాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక పెద్ద…

Read More

వైద్య విద్యకు ‘ఎన్ఎంసీ’ చెద – అవినీతి అడ్డా జాతీయ మెడికల్ ‘కమీ’షన్

సహనం వందే, హైదరాబాద్:భారత వైద్య విద్య రంగాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి, అక్రమాలపై ప్రపంచ ప్రఖ్యాత వైద్య పత్రిక ‘లాన్సెట్’ బాంబు పేల్చింది! జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) వ్యవస్థీకృత అవినీతికి, అసమర్థతకు నిలయంగా మారిందని ఘాటుగా విమర్శించింది. జులై 19న ప్రచురితమైన ఈ సంచలనాత్మక నివేదిక… భారత వైద్య విద్య భవిష్యత్తును, ప్రజల ఆరోగ్య సంరక్షణ నాణ్యతను అంధకారంలోకి నెట్టేస్తోందని హెచ్చరించింది. ఎన్‌ఎంసీ అక్రమాల పుట్ట అని దునుమాడింది. లంచాల బాగోతం… వ్యవస్థకే చీడజూన్ 30న…

Read More

నర్మెట్ట వెనుక త్రిబుల్ ‘ఎస్’ల కుట్ర – సురేందర్, సుధాకర్, శ్రీకాంత్ రెడ్డీల స్కెచ్

సహనం వందే, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నర్మెట్ట లో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ మెగా ఫ్యాక్టరీ వెనుక ఘరానా దోపిడి జరుగుతుందని ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ మండిపడుతుంది. ఏమీ లేకుండా ఆయిల్ ఫెడ్ అక్కడ అంత పెద్ద ఫ్యాక్టరీ ఎందుకు కడుతుందని అసోసియేషన్ నాయకులు నిలదీస్తున్నారు. దాని వల్ల ఆ ప్రాంత ఆయిల్ పామ్ రైతులకు ఏమైనా ఉపయోగం ఉందా? లేక ఆయిల్ ఫెడ్ కేవలం రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు దోచి పెట్టటానికి ఇదంతా చేస్తుందా?…

Read More

నకిలీ రోగులతో ‘మహావీర్ంగం’ – మహావీర్ మెడికల్ కాలేజీకి కౌంట్ డౌ(ట్)న్

సహనం వందే, హైదరాబాద్: వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీ మాయలు ఒకటీ రెండు కావు. నకిలీ రోగులు… వారికి లేనిపోని రోగాలు అంటగట్టి కేస్ సీట్లు తయారు చేయటం… ఘోస్ట్ ఫ్యాకల్టీని సిద్ధం చేసుకోవడం… ఇలా ఆ కాలేజీ యాజమాన్యం రాత్రీ పగలు బిజీలో పడిపోయింది. ఈ నెలాఖరులోగా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలు ఉండటంతో సినిమా సెట్టింగులా కాలేజీని సిద్ధం చేస్తున్నారు. కొన్ని పరికరాలను బయట నుంచి తెప్పించి తాత్కాలిక ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వసనీయ…

Read More

రేవంత్ వర్సెస్ రాజ’కోపాల్’ – ‘నేనే సీఎం’ రగడ

సహనం వందే, హైదరాబాద్: ‘రాబోయే పదేళ్లు నేనే సీఎం’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లను కలవర పెడుతున్నాయి. ఈ ప్రకటనపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించడంతో పార్టీలో అసమ్మతి జ్వాలలు రగులుకుంటున్నాయి. మంత్రి పదవి దక్కకపోవడంతో రాజగోపాల్‌ రెడ్డి అసంతృప్తితో ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌ సామ్రాజ్యం నడుస్తోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘పదేళ్ల సీఎం’ ప్రకటన దుమారంజటప్రోలులో…

Read More

సీబీఐ వేట… ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీపై వేటు

సహనం వందే, హైదరాబాద్:ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై సీబీఐ వేట మొదలైంది. కాలేజీల గుర్తింపు, సీట్ల రెన్యువల్ కోసం ఎన్ఎంసీ తనిఖీ బృందాలకు లంచం ఇచ్చినట్టు అనేక కాలేజీలపై సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా ఎన్ఎంసీ చైర్మన్ గంగాధర్ పై వేటు వేసిన అనంతరం ఇప్పుడు కాలేజీ మాఫియాలకు చుక్కలు చూపిస్తుంది. అందులో భాగంగా తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్న ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపు రద్దు కావడంతో వైద్య…

Read More

మార్క్’ఫ్రాడ్’… యూరియా ‘బ్లాక్’ – దళారులకు అధికారుల అండ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో యూరియా కొరత రైతులను వెన్నాడుతుంది. కొరతను నివారించని అధికారులు… కొద్దిపాటి స్టాక్ ను దళారుల చేతుల్లో పెట్టి నల్ల బజారుకు తరలిస్తున్నారు. ఈ విషయంలో కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కు అవుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ప్రాథమిక సహకార సంఘాలు, మార్క్ ఫెడ్ అధికారులు, దళారులు ఏకమై బ్లాక్ మార్కెటుకు తరలిస్తున్నారు. ఈ విషయంలో కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కు అవుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వివిధ…

Read More

‘సీతారామ’… జగ్గారం గిరిజనుల రైతుల గోడు వినుమ

సహనం వందే, హైదరాబాద్: అత్యంత పవిత్రమైన సీతారాముల పేరుతో నిర్మిస్తున్న ప్రాజెక్టు అది. అంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టు కింద ఉన్న గిరిజన రైతులకు గత ప్రభుత్వం నుండి అన్యాయమే జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు ముఖ్యమైన మంత్రులు ఉన్నా న్యాయం జరగకపోవడం పట్ల ఆదివాసీలు మండిపడుతున్నారు. దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన గిరిజన రైతులు తమ భూములకు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద ఐదేళ్లుగా నష్టపరిహారం అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు….

Read More

కవిత ‘ఢీ’ఆర్ఎస్ – తండ్రి పార్టీతో కవిత బంధానికి ముగింపు?

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికర చర్చ ఎమ్మెల్సీ కవిత చుట్టూ తిరుగుతోంది. బీఆర్‌ఎస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా? కవిత ఇక పార్టీకి పూర్తిగా దూరమైనట్టేనా? అంటే ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు అవుననే సూచిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఆమె అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కదలికలు, చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ విషయంలో పార్టీ వైఖరిని ఉద్దేశించి ఆమె…

Read More