సీబీఐ వేట… ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీపై వేటు

సహనం వందే, హైదరాబాద్:ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై సీబీఐ వేట మొదలైంది. కాలేజీల గుర్తింపు, సీట్ల రెన్యువల్ కోసం ఎన్ఎంసీ తనిఖీ బృందాలకు లంచం ఇచ్చినట్టు అనేక కాలేజీలపై సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా ఎన్ఎంసీ చైర్మన్ గంగాధర్ పై వేటు వేసిన అనంతరం ఇప్పుడు కాలేజీ మాఫియాలకు చుక్కలు చూపిస్తుంది. అందులో భాగంగా తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్న ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపు రద్దు కావడంతో వైద్య…

Read More

మార్క్’ఫ్రాడ్’… యూరియా ‘బ్లాక్’ – దళారులకు అధికారుల అండ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో యూరియా కొరత రైతులను వెన్నాడుతుంది. కొరతను నివారించని అధికారులు… కొద్దిపాటి స్టాక్ ను దళారుల చేతుల్లో పెట్టి నల్ల బజారుకు తరలిస్తున్నారు. ఈ విషయంలో కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కు అవుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ప్రాథమిక సహకార సంఘాలు, మార్క్ ఫెడ్ అధికారులు, దళారులు ఏకమై బ్లాక్ మార్కెటుకు తరలిస్తున్నారు. ఈ విషయంలో కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కు అవుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వివిధ…

Read More

‘సీతారామ’… జగ్గారం గిరిజనుల రైతుల గోడు వినుమ

సహనం వందే, హైదరాబాద్: అత్యంత పవిత్రమైన సీతారాముల పేరుతో నిర్మిస్తున్న ప్రాజెక్టు అది. అంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టు కింద ఉన్న గిరిజన రైతులకు గత ప్రభుత్వం నుండి అన్యాయమే జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు ముఖ్యమైన మంత్రులు ఉన్నా న్యాయం జరగకపోవడం పట్ల ఆదివాసీలు మండిపడుతున్నారు. దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన గిరిజన రైతులు తమ భూములకు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద ఐదేళ్లుగా నష్టపరిహారం అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు….

Read More

కవిత ‘ఢీ’ఆర్ఎస్ – తండ్రి పార్టీతో కవిత బంధానికి ముగింపు?

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికర చర్చ ఎమ్మెల్సీ కవిత చుట్టూ తిరుగుతోంది. బీఆర్‌ఎస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా? కవిత ఇక పార్టీకి పూర్తిగా దూరమైనట్టేనా? అంటే ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు అవుననే సూచిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఆమె అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కదలికలు, చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ విషయంలో పార్టీ వైఖరిని ఉద్దేశించి ఆమె…

Read More

రీజినల్ రింగ్ రైలుతో ట్రాఫిక్ కు చెక్

సహనం వందే, న్యూఢిల్లీ: తెలంగాణను సాంకేతిక, పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సెమీకండక్టర్ల ప్రాజెక్టులతో పాటు కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వినూత్న ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు పుష్కలంగా ఉన్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్రమంత్రి…

Read More

ఆర్ఎంపీలకు రాజకీయ అండ’దండలు’ – మెడికల్ కౌన్సిల్ ఫైర్

సహనం వందే, హైదరాబాద్: ఆర్ఎంపీలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. అనర్హులైన ఆర్ఎంపీలకు మద్దతు ఇవ్వడం ద్వారా నకిలీ వైద్యాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని కౌన్సిల్ మండిపడింది. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. అవకాశవాద రాజకీయాల కోసం అనర్హులైన వైద్యులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ డాక్టరు అయినందున తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుండి వైద్యుడిగా ఆయన పేరును…

Read More

ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి పుట్టలు-బుసలు కొడుతున్న అక్రమాలు

సహనం వందే, వేంసూర్: ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి పుట్టలు వెలుగు చూస్తున్నాయి. ఆ పుట్టలను తవ్వుతుంటే అక్రమాల విషపు నాగులు బుసలు కొడుతున్నాయి. ఆయిల్ ఫెడ్ అధికారుల అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. అక్కడి రైతుల జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారు. వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డగోలు సంపాదనకు మరిగిన కొందరు అధికారులు రైతులకు నాసిరకం మొక్కలు అంటగట్టడంపై నిరసన వ్యక్తం అవుతుంది. ఆయిల్ పామ్ మొక్కల్లో ఎక్కువ సంఖ్యలో జన్యు లోపం ఉన్నట్టు…

Read More

కృష్ణా, గోదావరి నదీ జలాలపై కీలక ఒప్పందం

సహనం వందే, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీపై నెలకొన్న సమస్యలకు పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ సమక్షంలో బుధవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరిపిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది, దీనిని తెలంగాణకు ఒక విజయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More

ఇండియా కూటమి బీసీ నినాదం – ముఖ్యమంత్రి రేవంత్ చొరవ

సహనం వందే, హైదరాబాద్:ఇండియా కూటమి పార్టీలలో బీసీ చర్చను లేవనెత్తేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేశారు. కూటమి పార్టీల ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లును ఆమోదింప చేసుకోవాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ పార్టీ అయినందున… దాని అధినేత రాహుల్ గాంధీ అనుమతి తీసుకుని సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున…

Read More

ఆర్ఎంపీల గుప్పిట్లో ఆసుపత్రులు

సహనం వందే, హైదరాబాద్:ఆర్ఎంపీల పై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చేస్తున్న దాడులు ప్రతి నిత్యం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులైన వైద్యులను పట్టుకోవడంలో మెడికల్ కౌన్సిల్ నిర్విరామంగా కృషి చేస్తోంది. ఆర్ఎంపీలను ఏరివేయడమే లక్ష్యంగా ఆ కౌన్సిల్ ఏర్పడిందా అన్న విధంగా దాడులు నిర్వహిస్తోంది. అర్హత లేకుండా వైద్యం చేయడాన్ని ఎవ్వరూ ఆమోదించరు. కానీ అదే ఆర్ఎంపీల నీడలో అనేక ఆసుపత్రులు నడుస్తున్నాయంటే అతిశయోక్తికాదు. ఇలా చేస్తున్నందువల్లే రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులు రోగులతో రోగాలతో కళకళలాడుతున్నాయి. చిన్న…

Read More