సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ మారణహోమంపై మౌనం

సహనం వందే, హైదరాబాద్:కాశ్మీర్ లోని పహల్గాంలో 26 మంది అమాయక ప్రజలను ఉగ్రవాదులు కాల్చి చంపితే… కేంద్ర ప్రభుత్వం ఏకంగా పాకిస్తాన్ తో యుద్ధమే చేసింది. అందుకు సహకరించిన వారిపై దేశద్రోహం కేసు పెట్టి లోన పడేసింది. ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వాలంటే ఇలా చేయాల్సిందే. కానీ హైదరాబాదు శివారు పటాన్‌చెరు మండలంలోని పాశమైలారంలో ఉన్న సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ లో పేలుడు సంభవించి ఏకంగా 43 మందికి పైగా చనిపోవడం… దాదాపు అంతే సంఖ్యలో గల్లంతు…

Read More

యూరియా ‘అధికారి’ దయ – ఎక్కడికక్కడ బ్లాక్…

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో యూరియా కొరత ఉందని… కేంద్రం అవసరమైనంత కేటాయించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. సీజన్ ఊపందుకోవడంతో ఆయన కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశారు. 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇంకేం ఇదే అదనుగా భావించిన మార్క్ ఫెడ్ లోని ఒక అధికారి దళారులతో చేతులు కలిపారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ చేయిస్తున్నట్టు పెద్ద ఎత్తున…

Read More

ఆయిల్ పామ్ అక్రమార్కులకు చుక్కలే

సహనం వందే, అశ్వారావుపేట: ఆయిల్ పామ్ మొక్కల్లో అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో ఆయిల్ పామ్ తోటలను భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ (ఐఐఓపీఆర్) బృందం మూడు రోజులు పర్యటించింది. గురువారంతో వారి పర్యటన ముగిసింది. వర్షంలోనూ ఆ బృందం పట్టుదలగా క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయడం విశేషం. ఈ మూడు రోజుల్లో శాస్త్రవేత్తల బృందం 3 వేల ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించింది. ఇందులో నుంచి 100 నమూనాలను…

Read More

ఆయిల్ ఫెడ్ తిరుమలేశ్వర్ రెడ్డిపై వేటు.. ఫైనాన్స్ విభాగం తొలగింపు

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ లో ప్రక్షాళన పర్వం ఊపందుకుంది. ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ వరుస కథనాలతో ఈ కార్పొరేషన్ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మొక్కల అక్రమాలు, నర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణ వివాదం… కొందరు అధికారులు కీలకమైన విభాగాలను తమ గుప్పెట్లో పెట్టుకుని దోపిడీకి పాల్పడుతుండటం… ఇలాంటి అన్ని విషయాలపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కార్పొరేషన్ కొత్త ఎండీ శంకరయ్య…

Read More

ఆయిల్ పామ్ నర్సరీల్లో నాసిరకం మొక్కలా? – తుమ్మల ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగులో నెలకొన్న మందకొడి పరిస్థితిపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నర్సరీల్లో నాసిరకం మొక్కలు (కల్లింగ్ మొక్కలు) ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి మొక్కలు ఏ మాత్రం ఉండకూడదని… రైతులకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన వాటినే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో మంగళవారం ఉద్యానశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఆయిల్ పామ్ సాగు పురోగతి, ఇతర ఉద్యాన పంటల స్థితిగతులపై…

Read More

పని గంటలు దాటితే హెల్త్ రిమైండర్ – ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

సహనం వందే, న్యూఢిల్లీ:వారానికి 70 గంటలు పని చేయాలని… అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు 1986లో మనదేశంలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేసినప్పుడు కూడా ఆయన వ్యతిరేకించారు. ఆయన తీరు పట్ల టెకీలు, కార్మిక సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా తన ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగులు ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’పై దృష్టి సారించి…

Read More

వర్షంలోనూ ఆయిల్ పామ్ తోటల పరిశీలన

సహనం వందే, అశ్వారావుపేట:ఆయిల్ పామ్ తోటల్లో జన్యపర లోపం ఉన్న మొక్కలను, ఆఫ్-టైప్ మొక్కలను గుర్తించేందుకు ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు మంగళవారం నుంచి తిరిగి పరిశీలన ప్రారంభించారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చెట్టుచెట్టుకూ తిరిగి పరిశీలించినందుకు ఆయిల్ పామ్ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్షుణ్ణమైన పరిశీలన వల్ల అశ్వారావుపేట ఆయిల్ పామ్ నర్సరీలో జరిగిన మోసాలకు, తద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రైతుల తోటల్లో ఆఫ్-టైప్, జన్యపర లోపం…

Read More

ఆయిల్ పామ్ అక్రమాలపై డీఎన్ఏ కొరడా – నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన

సహనం వందే, హైదరాబాద్:కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాలతో అశ్వారావుపేటలో భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్) శాస్త్రవేత్తలు మంగళవారం నుంచి మూడు రోజులు పర్యటించనున్నారు. ఇటీవల ఆ ప్రాంతానికి వచ్చిన ఈ బృందం… పూర్తిస్థాయిలో ఈ మూడు రోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేయమంది. ఆయిల్ పామ్ మొక్కల్లో జరిగిన అక్రమాలు… నాణ్యతా లోపాలపై ఈ బృందం లోతైన పరిశోధన చేయనుంది. అంతేకాదు అత్యంత శాస్త్రీయ పద్ధతిలో ఏకంగా డీఎన్ఏ పరీక్షలు చేయాలని…

Read More

‘కాంపౌండర్ల వైద్యంతో కాటికే’ – నకిలీ వైద్యులతో ప్రాణాలు హరి

సహనం వందే, రంగారెడ్డి జిల్లా:రంగారెడ్డి జిల్లా షాబాద్, హైతాబాద్ ప్రాంతాల్లో డాక్టర్లుగా చెలామణి అవుతున్న కాంపౌండర్లు, నకిలీ వైద్యుల గుట్టు రట్టైంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలోని బృందం నిర్వహించిన తనిఖీలలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఫస్ట్ ఎయిడ్ బోర్డులు పెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా అల్లోపతి దవాఖానాలు నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను గుర్తించారు. కాంపౌండర్ గా పనిచేసి పెద్ద డాక్టర్లుగా చెప్పుకుంటున్నట్లు…

Read More

పారాక్వాట్ తో పొలాలు వల్లకాడు -రైతుల్లో పార్కిన్సన్స్ వ్యాధి

సహనం వందే, హైదరాబాద్:భారత్, అమెరికా దేశాల్లో విస్తృతంగా ఉపయోగించే ప్రమాదకరమైన పారాక్వాట్ హెర్బిసైడ్‌ (గడ్డి మందు) వల్ల పార్కిన్సన్స్ వ్యాధి సంభవిస్తుందనే ఆందోళనలు నెలకొన్నాయి. దీనివల్ల రైతులు, వ్యవసాయ కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వాషింగ్టన్ పోస్టులో ప్రచురితమైన కథనం ప్రకారం… పారాక్వాట్ వాడకం వల్ల అమెరికన్ రైతులు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇదే సమస్య భారత దేశంలోనూ తీవ్రంగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో పారాక్వాట్ విష ప్రభావం…పారాక్వాట్ కలుపు నివారణకు…

Read More