ఏఐ మోజు… లైఫ్ క్లోజ్ – యూజర్ డేటా దోపిడీ!

సహనం వందే, అమెరికా:తమ కొత్త ఏఐ సాధనం జెమినిని అడ్డుపెట్టుకుని యూజర్ల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత డేటాను, రహస్య సంభాషణలను గుట్టుగా దొంగిలిస్తోందంటూ అమెరికాలో గూగుల్ సంస్థపై దావా దాఖలైంది. మనం స్నేహితులతో షేర్ చేసుకునే ప్రతి చిన్న మాట… వ్యాపార రహస్యాలు దాగి ఉన్న ప్రతి ఈమెయిల్… పంపే ప్రతి ఫోటో… పత్రం… అన్నీ గూగుల్ నియంత్రణలో ఉన్న ఈ జెమిని ఏఐకి అందుబాటులోకి వెళ్లిపోవడం టెక్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వినియోగదారుల ప్రైవసీకి…

Read More

పోరాడి ఓడిన సివిల్స్ యోధుడు – దశాబ్ద కాలపు ప్రయాణం

సహనం వందే, న్యూఢిల్లీ:ఐఏఎస్ కావాలనేది లక్షలాది మంది యువత కల. అయితే ఆ కల కోసం ఒక దశాబ్దానికి పైగా ఒంటరి పోరాటం చేసిన ఓ వ్యక్తి ఉదంతం ఇప్పుడు ఎంతోమంది హృదయాలను కదిలిస్తోంది. కునాల్ ఆర్ విరుల్కార్ అనే అభ్యర్థి ఏకంగా 12 సార్లు సివిల్స్ పరీక్షలో విజయం సాధించడానికి శ్రమించారు. పట్టుదలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆయన ప్రయాణం 2012లో మొదలైంది. 7 సార్లు ప్రిలిమ్స్ అడ్డంకిని దాటి మెయిన్స్ వరకు చేరుకున్నారు. 5…

Read More

నైట్ డ్యూటీ… డబుల్ శాలరీ – ఉత్తరప్రదేశ్ మహిళలకు ప్రత్యేక సౌకర్యం

సహనం వందే, ఉత్తరప్రదేశ్:ఉత్తరప్రదేశ్‌లో ఇకపై మహిళలు కూడా రాత్రి వేళల్లో పనులు చేసేందుకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఆదేశాల ప్రకారం… మహిళలు ఇక నుంచి సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేయవచ్చు. అయితే ఈ వెసులుబాటు ప్రమాదకరమైన పరిశ్రమల్లోని 29 రకాల పనులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ విషయంలో మహిళల అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం…

Read More

‘ఎగ్జిట్’ నాటకం… వెనుక కుతంత్రం – మాయాజాలం కాదు… మహా మోసం

సహనం వందే, హైదరాబాద్:ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందు ఉత్కంఠను అమాంతం పెంచే ఎగ్జిట్ పోల్స్ కేవలం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే తీర్పు కాదు. ఇది రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం పకడ్బందీగా అల్లిన అంకెల జూదం. వీటి ఉద్దేశం.. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ వర్గాలు తమ ఆర్థిక వ్యూహాలను అమలు చేసుకోవడమే. అంతేకాదు కౌంటింగ్‌కు ముందు తమ ప్రేక్షకులను, పాఠకులను నిలుపుకునేందుకు మీడియాకు పనికివస్తాయి. అందుకే దీనిని కేవలం ఉత్కంఠ కోసమే అనుకుంటే పొరపాటే. గోడ దూకే నాయకులకు…

Read More

టెర్రరిజం… ఢిల్లీ & హైదరాబాద్ – ఈ రెండు నగరాలే కేంద్రాలుగా ఉగ్రవాదం

సహనం వందే, హైదరాబాద్:భారతదేశ భద్రతకు ఏళ్లుగా ఒకే రకమైన ముప్పు పొంచి ఉంది. అది ఉగ్రవాదం. 2000వ సంవత్సరంలో దేశ రాజధాని ఎర్రకోటపై లష్కరే తోయిబా కాల్పులు జరిపింది. ఢిల్లీ పోలీసులు పాకిస్తానీ ఉగ్రవాది అష్ఫాక్ అహ్మద్‌ను పట్టుకున్న నాటి నుంచి దేశంలో ఐఎస్ఐ విషపు కోరలు ఎంత లోతుగా పాతుకుపోయాయో ప్రపంచానికి తెలిసిందే. పాత ఢిల్లీలోని జామా మసీదు ప్రాంతం, హైదరాబాద్ పాతబస్తీ జిహాదీ కార్యకలాపాలకు, నకిలీ నోట్లు, పేలుడు పదార్థాలు దాచడానికి ప్రధాన కేంద్రాలుగా…

Read More

ఎగ్జిట్ హైప్… రిజల్ట్ డౌట్ – బీహార్ లో కమలం జోరు… కథ వేరు

సహనం వందే, పాట్నా:బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై నెలకొన్న ఏకపక్ష అంచనాలు విమర్శలకు తావిస్తున్నాయి. దైనిక్ జాగరణ్, మాట్రిజ్, పీపుల్స్ ఇన్‌సైట్, చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్ సహా మొత్తం తొమ్మిది ప్రముఖ సర్వే సంస్థలు బీహార్‌లో ఎన్డీయేదే తిరుగులేని అధికారం అని ముక్తకంఠంతో చెప్పాయి. ఈ అంచనాల ప్రకారం సరాసరి ఎన్డీయే కూటమి సుమారు 157 స్థానాలు దక్కించుకుంటుంది. అంటే అధికార పీఠం దక్కించుకోవడానికి అవసరమైన 122 స్థానాల మెజారిటీని చాలా తేలికగా దాటేస్తుందన్న మాట….

Read More

బీహార్ ఎన్నికల్లో ఎర్రకోట పేలుళ్లు – ఢిల్లీ ఉద్రిక్తతతో దేశ వ్యాప్తంగా అలర్ట్

సహనం వందే, న్యూఢిల్లీ/పాట్నా:బీహార్ ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన పేలుడు దేశ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటన ఎన్నికల సమయంలో భద్రతా పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చింది. మొదటి దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిన బీహార్‌లో… ఈ పేలుడు ప్రభావం రెండో దశ ఓటర్లలో భయాన్ని నింపుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు….

Read More

‘లక్ష’ల్లో ఆశ… ‘వంద’తో నిరాశ – భారత్ లో మస్క్ టెస్లా ఆశలు మటాష్

సహనం వందే, న్యూఢిల్లీ:భారత్‌లో టెస్లా వాహనాల విక్రయాలు చూస్తే దిగ్భ్రాంతి కలగక మానదు. టెస్లాను భారత్‌కు తీసుకొస్తే లక్షల్లో కార్లు అమ్ముడవుతాయని ఎలాన్ మస్క్ పెట్టుకున్న అంచనాలు పటాపంచలయ్యాయి. అక్టోబర్‌లో టెస్లా అమ్మింది కేవలం 40 వాహనాలు మాత్రమే! సెప్టెంబర్‌లో అమ్ముడైన 64 వాహనాలతో పోలిస్తే ఇది ఏకంగా 37% పతనం. జూలై నుంచి ఇప్పటివరకు అమ్మిన మొత్తం కార్లు 144 మాత్రమే. కొన్ని వందల ఆర్డర్లతో టెస్లా చేస్తున్న ఈ మౌన ప్రదర్శన చూస్తుంటే దేశీయ…

Read More

బీహార్ ఎన్నికల్లో అమ్మాయిల ఎర – ‘ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్’ లీక్స్

సహనం వందే, పాట్నా:ఒకవైపు బీహార్‌లో ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు తెరవెనుక కొందరు ప్రజా ప్రతినిధులు చేస్తున్న దారుణాలు దేశాన్ని కుదిపేశాయి! ఎన్నికల సమయంలో లాబీయింగ్ కోసం… పెద్ద పెద్ద నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అమ్మాయిలను సరఫరా చేయడం నివ్వెరపరిచింది. ప్రముఖ జాతీయ మీడియా ‘దైనిక్ భాస్కర్’ నిర్వహించిన ‘ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్’ బయటపెట్టిన రహస్యాలు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి ప్రజాప్రతినిధులు తమ విలాసాల కోసం ఏకంగా అమ్మాయిలను సరఫరా చేసే నెట్‌వర్క్‌ను ఆశ్రయిస్తున్నారట!…

Read More

జైలు పాలవుతున్న జస్టిస్ – నేరం నిరూపితం కాకుంటే జైల్లోనే జీవితం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతీయ న్యాయం కళ్ల గంతలు కట్టుకుని ఉందంటే బహుశా ఇదేనేమో! దేశంలో అత్యున్నత న్యాయస్థానం నుంచి వచ్చిన మాటలు ఇవి. సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్ నాథ్ స్వయంగా విడుదల చేసిన నివేదిక ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తోంది. మన జైళ్లలో మగ్గుతున్న మొత్తం ఖైదీల్లో 70 శాతం మందికి పైగా ఇంకా అండర్‌ట్రయల్స్‌ (నేరం రుజువు కానివారు) కావడం వ్యవస్థకు అద్దం పడుతోంది. ఎంతోమంది పౌరులు దోషులుగా తేలకముందే సంవత్సరాల తరబడి జైలు శిక్ష అనుభవిస్తుంటే న్యాయం…

Read More