Students Vs Ranks

పిల్లలా? రోగులా? – ర్యాంకుల రోత… తెలివికి పాతర

సహనం వందే, హైదరాబాద్: భారతీయ విద్యావ్యవస్థలో మార్కులే కొలమానంగా మారుతున్నాయి. బోర్డు పరీక్షల సీజన్ వచ్చిందంటే ఇళ్లు ఒత్తిడి గదులుగా మారుతున్నాయి. పిల్లల కంటే తల్లిదండ్రులే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. ఇది పిల్లలను మేధావులుగా కాకుండా కేవలం ఆందోళన చెందే రోగులుగా మారుస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈవో వినీత్ నాయర్ ఈ ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు. మార్కులు కేవలం జ్ఞాపకశక్తిని మాత్రమే పరీక్షిస్తాయని ఆయన విశ్లేషించారు. మార్కులతోనే నాయకత్వ లక్షణాలు రావుప్రస్తుత విద్యా విధానం నాయకులను…

Read More
Aline Sherin Organs donar

పాపకు అధికార లాంచనాలతో అంత్యక్రియలు – చిన్నారికి కేరళ గౌరవం

సహనం వందే, కేరళ: మృత్యువు ఒడిలోనూ మరో ఐదుగురికి ప్రాణం పోసిన పసిపాప కథ ఇది. కేరళ రోడ్డు ప్రమాదంలో కేవలం పది నెలల వయసున్న ఆలిన్ షెరిన్ అబ్రహం అత్యంత పిన్న వయస్కురాలైన అవయవ దాతగా చరిత్ర సృష్టించింది. తన మరణంతో ఐదుగురు చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ చిన్నారి త్యాగం చూసి అగ్రనటులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. ఘోర ప్రమాదం మిగిల్చిన శోకంపతనంతిట్ట జిల్లాకు చెందిన అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ జాన్…

Read More
Face transplantation

‘ఫేస్’ కాపీ పేస్ట్ – ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ముఖమార్పిడి

సహనం వందే, న్యూఢిల్లీ: ముఖంపై యాసిడ్ పడినా… తుపాకీ గుండు దూసుకెళ్లినా లేదా అగ్నిప్రమాదంలో రూపం ఛిద్రమైనా ఇకపై చింతించాల్సిన పనిలేదు. పాత ముఖాన్ని తీసేసి మరో వ్యక్తి ముఖాన్ని అమర్చే అత్యంత సంక్లిష్టమైన ముఖ మార్పిడి (ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్) చికిత్సకు ఎయిమ్స్ ఢిల్లీ సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఇటువంటి సాహసోపేతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. పాత ముఖం పోతుందా?ముఖం మార్పిడి కోసం ఎయిమ్స్ అనుమతులు పొందింది. రాబోయే ఏడాది లోపు మొదటి ముఖ…

Read More
Madras High Court

న్యాయపీఠం ‘యాభై లక్షల’ బేరం – మద్రాస్ హైకోర్టు జడ్జి పేరుతో భారీ లంచం

సహనం వందే, తమిళనాడు: భారత న్యాయవ్యవస్థ పవిత్రతను ఒక న్యాయవాది అంగడి సరుకుగా మార్చేశాడు. సాక్షాత్తూ హైకోర్టు జడ్జికే లంచం ఇవ్వాలంటూ క్లయింట్ నుంచి యాభై లక్షల రూపాయలు వసూలు చేసిన దారుణం వెలుగుచూసింది. తీర్పును కొనుగోలు చేయవచ్చనే భ్రమ కల్పించి న్యాయమూర్తి ప్రతిష్టను బజారున పడేసిన ఈ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జడ్జి పేరుతో లాయర్ మాయాజాలం…చెన్నైలోని 12వ అడిషనల్ స్పెషల్ సీబీఐ కోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వుపై గణేష్ అగర్వాల్, నరేష్…

Read More
India's IT employees

ఐటీ ఆఫీసుల్లో ఆధునిక బానిసలు – డిజిటల్ కూలీలుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు

సహనం వందే, హైదరాబాద్/బెంగళూరు: మెరిసే గాజు భవనాలు… అత్యాధునిక క్యాంపస్‌లు… బిలియన్ డాలర్ల లాభాలు.. ఇదీ భారత ఐటీ రంగం ప్రపంచానికి చూపిస్తున్న ముఖచిత్రం. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఒక తరం యువత నిశ్శబ్దంగా నలిగిపోతోంది. 2026లోనూ 2013 నాటి వేతనాలనే ఆఫర్ చేస్తూ కార్పొరేట్ దిగ్గజాలు సాగిస్తున్న ఈ ఆర్ధిక ఉగ్రవాదాన్ని విశ్లేషకులు ఆధునిక బానిసత్వంగా అభివర్ణిస్తున్నారు. దశాబ్ద కాలపు దోపిడీప్రపంచం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వైపు దూసుకుపోతుంటే… భారత ఐటీ కంపెనీల…

Read More
T20 India Vs Pakistan

విద్వేషంతో కోట్ల వర్షం – భారత్-పాక్ ఆటతో 2000 కోట్ల ఆదాయం

భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ పోరు ఆరంభం కాకముందే వ్యాపార సామ్రాజ్యంలో ప్రకటనల యుద్ధం మొదలైంది. ఇది కేవలం 22 గజాల పిచ్ మీద జరిగే ఆట కాదు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పగను పెట్టుబడిగా మార్చుకుంటున్న మహా వ్యాపార కుతంత్రం. దేశభక్తి ముసుగులో కార్పొరేట్ సంస్థలు కోట్లాది రూపాయల లాభాలను గడిస్తున్నాయి. కరచాలనం లేని క్రీడా దౌత్యంకొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగే మ్యాచ్‌కు ముందు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. టాస్…

Read More
Walking

నడకతోనే నూరేళ్ల ఆయుష్షు – బ్లూ జోన్ ప్రాంత ప్రజల మంత్రం ఇదే

సహనం వందే, హైదరాబాద్: నిండు నూరేళ్లు జీవించాలంటే రోజూ జిమ్ లో గంటలు గంటలు గడపాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటలీలోని సార్డీనియా దీవిలో వందేళ్లు దాటిన వృద్ధులను చూశాక ప్రముఖ పరిశోధకుడు స్టీవెన్ ఆస్టాడ్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కఠినమైన వ్యాయామం కంటే రోజూవారీ పనుల్లో భాగంగా చేసే నడకతోనే ఆరోగ్యానికి అసలైన శ్రీరామరక్ష అని ఆయన తేల్చి చెప్పారు. బ్లూ జోన్ మంత్రం ఇదేప్రపంచంలో ప్రజలు ఎక్కువ కాలం జీవించే ప్రాంతాలను బ్లూ…

Read More
Valentines Day

వాలెంటైన్ వేళ బ్రేకప్ విందులు – ఒకవైపు ప్రేమలు… ఇంకోవైపు వీడ్కోలు

సహనం వందే, హైదరాబాద్: ఫిబ్రవరి 14… ప్రేమ జంటలంతా వాలెంటైన్స్ డే కోసం సిద్ధమవుతుంటే, మరికొందరు మాత్రం అదే రోజు ప్రేమకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకుంటున్నారు. గులాబీ పువ్వులు, గిఫ్టుల సందడి మధ్య రెస్టారెంట్లలో కూర్చుని విడిపోవడం ఇప్పుడు ఒక ట్రెండ్. ఇది వినడానికి వింతగా ఉన్నా ఖరీదైన హోటళ్లలో విందు ఆరగిస్తూ బంధాలను తెంచుకోవడం వెనుక బలమైన ఆర్థిక లెక్కలు ఉన్నాయి. ప్రేమ ముగింపుకు పబ్లిక్ వేదికవాలెంటైన్స్ డే రోజున రద్దీగా ఉండే రెస్టారెంట్లను ఎంచుకోవడం…

Read More
Bacteria in Branded Milk

బ్రాండెడ్ పాలల్లో బ్యాక్టీరియా విస్ఫోటనం – పాల ముసుగులో బడా డైయిరీలో దగా

సహనం వందే, హైదరాబాద్: కోట్లాది మంది భారతీయుల నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకున్న డైయిరీ దిగ్గజాలు ఇప్పుడు వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అముల్, మదర్ డైయిరీ, కంట్రీ డిలైట్ వంటి అగ్రగామి సంస్థల ఉత్పత్తుల్లో ప్రాణాంతక బ్యాక్టీరియా పొంచివుందని ట్రస్టిఫైడ్ సంస్థ జరిపిన తాజా పరిశోధనలో బట్టబయలైంది. ఇది కేవలం నాణ్యతా లోపం కాదు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ బడా డైయిరీ సంస్థలు సాగిస్తున్న వ్యవస్థాగత నేరమని ఈ నివేదిక నిరూపిస్తోంది. ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డ బండారంఆహార స్వచ్ఛతను…

Read More
Indian Journalism

నిజం రాస్తే మరణశాసనం – భారతదేశంలో కలంపట్టిన యోధులపై కత్తులు

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంలో కలం పట్టిన యోధులపై కత్తులు వేలాడుతున్నాయి. అవినీతి తిమింగలాల గుట్టు రట్టు చేస్తే ప్రాణాలే పోయే ప్రమాదకర స్థితి నెలకొంది. పారదర్శకత మచ్చుకైనా కనిపించని చోట ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్-2025’ వెల్లడించిన చేదు నిజాలు దేశ పాలనలోని లోపాలను ఎండగడుతున్నాయి. ఇది కేవలం వ్యవస్థాగత వైఫల్యం కాదు… భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి. రక్తంతో తడిసిన కలంనిజం చెప్పే గొంతును నొక్కడమే పాలకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2012 నుండి…

Read More