జీరో యూరియా దందా… వ్యాపారుల మాయ- ఫ్యాక్టరీల నుంచి నేరుగా తెచ్చి వ్యాపారం

సహనం వందే, హైదరాబాద్:రైతుకు యూరియా కొరత నిద్రపట్టనివ్వడం లేదు. వ్యవసాయ పనులను పక్కనపెట్టి గంటల తరబడి ఎరువుల దుకాణాల ముందు క్యూలో నిల్చోవడం నిత్యకృత్యమైపోయింది. ఈ దుస్థితిని కొందరు డీలర్లు, వ్యాపారులు అవకాశంగా తీసుకుని యూరియా బ్లాక్ దందాకు తెరతీశారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ. 270 విలువ గల 45 కిలోల యూరియా బస్తాను కొన్నిచోట్ల రూ. 500 పైగా అమ్ముతున్నారు. ఒక బస్తా కావాలంటే ఇతర సరుకులను కూడా కొనాలనే షరతులు, క్యాష్ అండ్ క్యారీ…

Read More

నెంబర్ అడగొద్దు… కస్టమర్స్ చెప్పొద్దు – ఇక మొబైల్ నెంబర్లు అడగడం నేరమే!

సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో డిజిటల్ యుగం విస్తరిస్తున్న కొద్దీ వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో అమలులోకి రానున్న నూతన డేటా రక్షణ చట్టం ప్రకారం రిటైల్ దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారుల మొబైల్ నెంబర్లను అడగడం నేరంగా పరిగణించబడుతుంది. ఇప్పటివరకు దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్ ప్రక్రియలో మొబైల్ నెంబర్లు సేకరించడం ఒక…

Read More

వెలుగులోకి నటి చీకటి కోణం – మళయాళ లక్ష్మీ మీనన్‌పై కిడ్నాప్‌ కేసు

సహనం వందే, కోచి:సినిమా తెరపై అందమైన పాత్రలతో యువతను అలరించిన యువ నటి లక్ష్మీ మీనన్‌ పై కిడ్నాప్‌, దాడి కేసు నమోదవ్వడం సినీ లోకాన్ని కుదిపేసింది. పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక నటి ఇలాంటి తీవ్రమైన ఆరోపణల్లో చిక్కుకోవడం పరిశ్రమ వర్గాలను, ఆమె అభిమానులను విస్మయానికి గురిచేసింది. కొచ్చిలోని ఒక ఐటీ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేయడంతో ఈ వివాదం ఒక్కసారిగా సంచలనంగా మారింది. సినిమాలకు…

Read More

సిగ్నల్ ట్యాంపరింగ్ తో రైలు ఆపి దోపిడీ – నాగర్‌సోల్‌-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన

సహనం వందే, గుంటూరు:దొంగలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రైలు సిగ్నల్ వ్యవస్థనే ట్యాంపరింగ్ చేసి అర్ధరాత్రి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇది రైల్వే వ్యవస్థ డొల్లతనానికి నిదర్శనం. గుంటూరు జిల్లాలో అటువంటి సంఘటనే జరిగింది. నాగర్‌సోల్ నుంచి నర్సాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలోని మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి వద్ద దుండగులు సిగ్నల్ వ్యవస్థను ట్యాంపర్ చేశారు. రెడ్ సిగ్నల్ కనిపించడంతో లోకో పైలట్ రైలును 35…

Read More

అపార్ట్‌మెంట్లు డ్రగ్స్ అడ్డాలు – పబ్‌, రిసార్ట్‌, ఫామ్‌హౌస్‌లపై నిఘాతో మార్పు

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ మహానగరంలో అపార్ట్‌మెంట్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. గతంలో పబ్‌లు, రిసార్ట్‌లు, ఫామ్‌హౌస్‌లలో చీకటి సామ్రాజ్యాన్ని నడిపించిన నేరగాళ్లు… ఇప్పుడు తమ కార్యకలాపాలకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పోలీసుల నిఘా కళ్ళ నుంచి తప్పించుకోవడానికి సర్వీస్ అపార్ట్‌మెంట్లు, గెస్ట్ హౌస్‌లను అడ్డాగా మార్చుకుని అక్కడే డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కొండాపూర్‌లో జరిగిన సంఘటన ఈ ప్రమాదకరమైన పోకడకు అద్దం పట్టింది. పోలీసులు ఒక సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి రేవ్ పార్టీ…

Read More

కొత్త ఇంట్లో రోగాల కుంపటి – అడుగుపెట్టిన రోజు నుంచి జబ్బుల జాతర

సహనం వందే, అమెరికా:ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇల్లు ఒక పెద్ద కల. అమెరికాలోని ఓహియోకు చెందిన సారా, కోలిన్ దంపతులు కూడా అదే కలను సాకారం చేసుకున్నారు. 2024 మే నెలలో సుమారు రూ. 3.3 కోట్లు వెచ్చించి ఒక అందమైన ఇంటిని కొనుగోలు చేశారు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ దంపతులు సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కొన్ని రోజుల్లోనే సారాకు వింత ఆరోగ్య సమస్యలు…

Read More

రాజమండ్రి శ్రీచైతన్యలో ర్యాగింగ్‌ భూతం – ఇస్త్రీ పెట్టెతో ఒళ్ళు కాల్చిన సీనియర్లు

సహనం వందే, రాజమండ్రి:విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం చూపించాల్సిన విద్యాసంస్థలు ముఖ్యంగా హాస్టళ్లు ఇప్పుడు హింసకు అడ్డాగా మారుతున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రాజమండ్రిలోని మోరంపూడిలో ఉన్న శ్రీ చైతన్య హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిపై సహచరులు దారుణంగా ర్యాగింగ్‌ కు పాల్పడిన ఘటన ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన గుఱ్ఱం విన్సెంట్ ప్రసాద్ అనే పదహారేళ్ల విద్యార్థిపై జరిగిన ఈ అమానుష దాడి సమాజాన్ని దిగ్భ్రాంతికి…

Read More

పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ నోటి దురుసు

సహనం వందే ఒంగోలు:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నోటి దురుసు ప్రదర్శించారు.‌ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. విమర్శలు హద్దులు దాటి పోవడం పరాకాష్ట. నారాయణ సహజంగానే తెగించి ఇష్టరాజ్యంగా మాట్లాడుతారన్న విమర్శలు ఉన్నాయి. సోమవారం ఒంగోలులో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర మహాసభలో నారాయణ ప్రసంగించారు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్…

Read More

18 వేల ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణం – ఈడీ దర్యాప్తులో వెలుగులోకి అక్రమాలు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా వైద్య విద్యలో జరిగిన భారీ కుంభకోణం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఎన్ఆర్ఐ కోటా పేరుతో నకిలీ పత్రాలతో వేలాది మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను దక్కించుకున్నట్లు తాజా దర్యాప్తులో బయటపడింది. ఈ కుంభకోణంలో దాదాపు 18 వేల మంది విద్యార్థులు ఫోర్జరీ సర్టిఫికెట్లతో వైద్య కళాశాలల్లో చేరినట్లు తేలింది. ఈ దారుణంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టి ఈ మోసాన్ని బట్టబయలు చేసింది. నకిలీ పత్రాలతో దందా…వైద్య కళాశాలల్లో…

Read More

అధికారుల తీరుతో అన్నదాత బలి – నాడు రుణమాఫీ… నేడు యూరియా

సహనం వందే, హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రభుత్వంలో ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి వ్యవసాయశాఖలో ఎవరైనా కోవర్టులుగా పనిచేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కొందరు రాజకీయ పండితులు. అప్పట్లో రుణమాఫీ విషయంలోనూ… ఇప్పుడు యూరియా కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ యంత్రాంగ నిర్లక్ష్యమే నిదర్శనమని చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉంటూ సర్కారును ఇరుకున పెట్టే విధంగా కొందరు వ్యవసాయ అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దలతో కలిసి…

Read More