‘హైడ్రా’పై అవాస్తవాల దాడి – పుకార్లను నమ్మవద్దు

సహనం వందే, హైదరాబాద్:హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. కొందరు కావాలనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఎక్కడ కూల్చివేతలు జరిగినా, లేనిపోని అంశాలను హైడ్రాకు ఆపాదించి ప్రచారం చేస్తున్నారు. అయినా హైడ్రా ఇవేవీ పట్టించుకోకుండా ప్రజలకు మంచి చేయడానికే కృషి చేస్తోంది. పర్యావరణ పరిరక్షణతో కూడిన నగర నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆరు చెరువులను అభివృద్ధి చేసింది. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. ఈ పనులను కేంద్ర బృందాలు కూడా సందర్శించి…

Read More

ఎన్టీఆర్ విలన్… చివరికి హీరో

(రేటింగ్: 2.5/5) సహనం వందే, హైదరాబాద్:వార్-2 సినిమా మొదటి గంట సూపర్ గా ఉంది. హృతిక్ రోషన్ యాక్షన్ ఎక్సలెంట్. సినిమా మొదలైన అర గంటకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన యాక్షన్ తో సినిమా హాల్లో కేక పుట్టించాడు. ఒక మనిషి ఇగోను కెలికితే ఎంత దూరమైనా వెళ్తాడు అనే ఎన్టీఆర్ డైలాగ్ బాగుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ విలన్ అని అర్థం అవుతుంది. రా ఇంటిలిజెన్స్ వ్యవస్థలో ఉంటూ గ్యాంగ్ స్టర్లకు…

Read More

ఎంఎన్ జే డైరెక్టర్ రిటైర్మెంట్ రగడ

సహనం వందే, హైదరాబాద్:నిబంధనల ప్రకారం ఉద్యోగ విరమణ చేయాల్సిన వ్యక్తి… ఆ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ విధుల్లో ఉండడాన్ని మీరు ఎక్కడైనా చూశారా? అంతే కాదు ఒక రాష్ట్రంలో రిటైర్డ్ కావలసిన వ్యక్తి… మరో రాష్ట్రంలో దర్జాగా అధికారికంగా అదే స్థాయి హోదాలో ఉండడాన్ని ఏమనుకోవాలి? అచ్చంగా తెలంగాణలో ఒక డాక్టర్ విషయంలో అదే జరుగుతుంది. హైదరాబాదు ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ శ్రీనివాసులును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. అక్కడ పోస్టు లేదనే కారణంతో అది…

Read More

ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల ఆగడాలు – నచ్చని సీటొచ్చినా రద్దు చేసుకోకుండా అడ్డు

సహనం వందే, హైదరాబాద్:ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి నచ్చని కాలేజీల్లో సీట్లు కేటాయించినప్పటికీ, అధికారులు పెట్టిన నిబంధనల వల్ల వాటిని రద్దు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితులను కొన్ని ప్రైవేటు కాలేజీలు అవకాశంగా తీసుకుని, విద్యార్థులపై పెత్తనం చెలాయిస్తున్నాయి. నిర్దిష్టమైన కళాశాలలో చేరకపోతే ఫీజులు, ఒరిజినల్ సర్టిఫికెట్లు వెనక్కి ఇవ్వబోమని బెదిరిస్తున్నాయి. దీంతో మంచి కళాశాలలు లేదా నచ్చిన కోర్సులో సీటు వస్తుందని ఆశపడిన విద్యార్థుల కలలు అడియాశలయ్యాయి. మూడో…

Read More

సీజన్ బాగుంది… యూరియా ఏదండి – కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రైతన్న గోస

సహనం వందే, హైదరాబాద్:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ గొడవలతో తెలంగాణ రైతాంగం నలిగిపోతోంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రానికి కావాల్సిన యూరియా సరఫరాలో కేంద్రం ఘోర నిర్లక్ష్యం చూపుతోందని, రైతుల బతుకులతో ఆడుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగితాల మీద కేటాయింపులు చేసినట్లు చూపించి, నిజానికి సరఫరాలో లోటు తెచ్చి రైతులను ఇబ్బందుల పాలు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. కాగితాలపైనే కేటాయింపులు…తెలంగాణకు ఈ ఖరీఫ్ సీజన్‌లో 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినట్లు కేంద్రం ప్రకటించింది….

Read More

భట్టి కిరికిరి… రాజగోపాల్ కెలికి కెలికి

సహనం వందే, హైదరాబాద్:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టాయి. పార్టీలో మరింత ముదురుతున్న ఈ వ్యవహారంపై భట్టి వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేశాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి రాజుకుంటోందని మరోసారి స్పష్టమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా, పార్టీలోని ముఖ్య నేతల పైనా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని ఆయన చేసిన ట్వీట్ స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ లో…

Read More

ఎమ్మెల్యే చేతిలో బీసీ భవితవ్యం – నియోజకవర్గం యూనిట్ గా రిజర్వేషన్లు

సహనం వందే, హైదరాబాద్:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆశలు అడియాశలు అవుతున్నాయి. అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మోక్షం లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ధర్నా నిర్వహించినప్పటికీ కేంద్రం నుంచి ఏమాత్రం కదిలిక రాలేదు. దీంతో రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాకపోయినప్పటికీ పార్టీ పరంగానే 42% సీట్లను బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. నియోజకవర్గం యూనిట్ గా అమలు…

Read More

నర్సింగ్ ఉద్యోగాల్లో లింగ వివక్ష – పురుష నర్సులకు ప్రమోషన్లు కరువు!

సహనం వందే, హైదరాబాద్:నర్సింగ్ వృత్తిలో మహిళలకు మాత్రమే అవకాశాలు ఉంటాయనే అపోహను దాటి, ఇప్పుడు పురుషులు కూడా ఈ రంగంలో రాణిస్తున్నారు. అయితే తెలంగాణలో పురుష నర్సులకు ప్రమోషన్లలో తీవ్ర వివక్ష ఎదురవుతోంది. సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి సేవలందిస్తున్నప్పటికీ పాత జీవోల కారణంగా వారికి పదోన్నతులు రావడం లేదు. పాత నిబంధనలను సవరించాలని తెలంగాణ నర్సస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఎదురవుతున్న వివక్ష…2005లో పురుష విద్యార్థులకు నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం కల్పించేలా జీవో 82ను…

Read More

నిర్మాతల కొర్రీ… కార్మికుల వర్రీ – కొలిక్కిరాని సినిమా కార్మికుల వ్యవహారం

సహనం వందే, హైదరాబాద్:తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల జీతాల పెంపు విషయంలో నెలకొన్న వివాదం సద్దుమణగలేదు. వేతనాల పెంపునకు నిర్మాతలు షరతులతో కూడిన ప్రతిపాదనలు ముందుకు తెచ్చినప్పటికీ, కార్మిక సంఘాల నాయకులు వాటిని తిరస్కరించారు. ఫలితంగా ఈ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఇకపై తమ నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఫెడరేషన్ నేతలు ప్రకటించారు. నిర్మాతల షరతుల్లోని మెలికలు…నిర్మాతలు శనివారం మీడియా సమావేశంలో వేతనాల పెంపుపై తమ నిర్ణయాలను ప్రకటించారు. రోజుకు 2 వేల రూపాయల…

Read More

సేవా మార్గంలో ‘మణి’ కుమార్ – డాక్టర్లకు ఇస్టా డిజిటల్ మీడియా ద్వారా అవార్డులు

సహనం వందే, హైదరాబాద్:సాధారణంగా జీవితంలో డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించిన తర్వాత చాలా మంది సుఖంగా గడపాలనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం తాము నిలదొక్కుకున్న తర్వాత సమాజానికి తమ వంతు ఏదైనా చేయాలని భావిస్తారు. అలాంటి వారిలో ఒకరు ఇస్టా డిజిటల్ మీడియా వ్యవస్థాపకుడు మణి కుమార్. బీటెక్ పూర్తి చేసి, విజయవంతమైన మొబైల్ వ్యాపారంతో మంచి ఆదాయం, పేరు సంపాదించిన మణి… కేవలం డబ్బు సంపాదనకు పరిమితం కాకుండా, వైద్యులకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో…

Read More