నటులకు కోట్లు… కార్మికులకు పాట్లు – టాలీవుడ్ ఇండస్ట్రీలో విచిత్ర పరిస్థితి

సహనం వందే, హైదరాబాద్:టాలీవుడ్ పరిశ్రమలో పెద్ద పెద్ద నటులకు వందల కోట్లు చెల్లించే బడా నిర్మాతలు… సినిమా షూటింగ్ లలో పాల్గొనే కార్మికులకు మాత్రం రోజువారి కూలీ ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు. హీరో హీరోయిన్లకు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చే నిర్మాతలు… కార్మికుల ఆకలి తీర్చడానికి కూడా ముందుకు రావడం లేదు. దీనిపై తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, కోశాధికారి టీవీ…

Read More

టీఆర్ఎస్ (డి) గౌరవ అధ్యక్షురాలిగా ప్రసన్న

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) (టీఆర్ఎస్ (డి)) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని, సమస్యలపై పోరాడే మహిళగా గుర్తింపు పొందిన ప్రసన్నను తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. పరిచయం అవసరం లేని పేరుగా తెలంగాణలో సుపరిచితులైన ప్రసన్న, ఇకపై పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. ఆమె పోరాట స్ఫూర్తి పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

Read More

బ‌స్తీతో ‘హైడ్రా’ దోస్తీ – హైడ్రా క‌మిష‌న‌ర్‌ ఏవీ రంగ‌నాథ్ శ్రీకారం

సహనం వందే, హైద‌రాబాద్‌: కూల‌గొట్టుడు కాదు.. ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన, అంద‌రికీ నివాస యోగ్య‌మైన‌ న‌గ‌ర నిర్మాణ‌మే తమ ల‌క్ష్య‌మ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్ప‌ష్టం చేశారు. హైడ్రా అంటే భ‌యం కాద‌ని… న‌గ‌ర ప్ర‌జ‌లంద‌రికీ ఓ అభ‌యం అని అన్నారు.చెరువులు, నాలాలు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను క‌బ్జా చేసిన వారు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు సూచించారు. 5 ఎక‌రాల భూమిని క‌బ్జా చేసి అందులో ప‌ని వాళ్ల‌కోసం ఒక షెడ్డు వేసి……

Read More

ఎంబీబీఎస్ కు డబ్బా కాలేజీల దెబ్బ – నాలుగేళ్లలో నిండని 11,966 సీట్లు

సహనం వందే, ఢిల్లీ: ఒకప్పుడు ఎంబీబీఎస్ లో సీటు రావడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు అవకాశాలు మరింత పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. కానీ అనేక కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. సీట్ల కోసం విద్యార్థులు ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు… అయినప్పటికీ ఎంబీబీఎస్ సీట్లు మిగిలి పోవడానికి కారణం ఏంటనేది చర్చనీయాంశం అయింది. 2024-25 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,849 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా ఉన్నాయని కేంద్ర…

Read More

‘సృష్టి’కి సాయం… అమ్మకు ద్రోహం -ఫెర్టిలిటీ సెంటర్లకు వైద్యాధికారుల వత్తాసు

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాదులో అనేక ఫెర్టిలిటీ సెంటర్లలో అక్రమాలు జరుగుతున్నట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు అక్రమంగా ఫెర్టిలిటీ సెంటర్లు నడుపుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. సంతానం లేని దంపతులకు అక్రమ పద్ధతిలో శిశువులను అంటగట్టుతున్నారు. నగరంలో దాదాపు 180 ఫెర్టిలిటీ సెంటర్లు ఉండగా… కొన్ని సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొందరు వైద్యాధికారుల చేయూతతోనే ఈ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకుగాను కొందరు వైద్యాధికారులకు…

Read More

‘మహా’ డైవర్షన్ మెసేజ్- నేడు మహావీర్ మెడికల్ కాలేజీలో తనిఖీలు

సహనం వందే, హైదరాబాద్:మహావీర్ మెడికల్ కాలేజీ యాజమాన్యం తన తప్పులను సరిదిద్దుకోకుండా దిక్కుమాలిన వ్యవహారాలన్నీ చేస్తూ బుక్ అవుతుంది. గురువారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఫ్యాకల్టీ, డాక్టర్లు, ఇతర వాట్సాప్ గ్రూపులలో ఒక మెసేజ్ పెట్టారు. శుక్రవారం హెల్త్ యూనివర్సిటీ అధికారుల తనిఖీ ఉన్నందున ఉదయం ఏడున్నర గంటలకే బోధనాసుపత్రిలో అందుబాటులో ఉండాలని ఆ మెసేజ్ లో స్పష్టం చేశారు. అయితే ఇందులో ఏమైనా మతలబు ఉందా అన్న చర్చ కాలేజీ వర్గాలలో నెలకొంది. గత…

Read More

చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటం – గురుకులలో ఫుడ్ పాయిజన్ తో 48 మంది చావడమా?

సహనం వందే, హైదరాబాద్:మనం నాగరిక సమాజంలోనే బతుకుతున్నామా? ఏఐ కాలంలోనూ పేద విద్యార్థులను కాపాడుకునే స్థితిలో కూడా లేమా? ఐఏఎస్ వంటి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్న గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి అనేకమంది విద్యార్థులు మరణిస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగానికి చీమకుట్టినట్టు కూడా లేదా? తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో 886 ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగి 48 మంది బహుజన పేద విద్యార్థులు మరణించారంటే… ఇవి సాధారణ మరణాలు కావు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంతో జరిగిన హత్యలుగా…

Read More

డాక్టర్లా? బూచోళ్ళా? – ఆసుపత్రుల్లో శిశువులకు రక్షణ కరువు

సహనం వందే, హైదరాబాద్:‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌ వ్యవహారంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆసుపత్రుల్లో పుట్టిన శిశువులకు అసలు రక్షణ ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజస్థాన్లో ఎత్తుకొచ్చిన శిశువును కొనుగోలు చేసి… సరోగసి ద్వారా పుట్టించామని ఆ బిడ్డను తల్లిదండ్రులకు విక్రయించిన డాక్టర్ నమ్రత వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలలో శిశువులను ఎత్తుకుచ్చే గ్యాంగ్ తో ఫెర్టిలిటీ సెంటర్ సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది….

Read More

‘సృష్టి’ వైద్యాధికారులపై చర్యలు? – తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు

సహనం వందే, హైదరాబాద్:‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌ వ్యవహారంపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు. ఆ వ్యవహారం వెనక ఉన్న అధికారులు ఎవరో తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వైద్యాధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయంపై మంత్రి దామోదర రాజనర్సింహ ‘సహనం వందే’ ప్రతినిధితో మాట్లాడుతూ… సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తున్నట్లు…

Read More

విత్తనాల దందా… అధికారుల అండ – అధిక ధరలతో అన్నదాత లూటీ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరకు విక్రయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోయాబీన్ విత్తనాల కు ప్రభుత్వం నిర్ణయించిన ధర కేవలం రూ. 2,400 మాత్రమే కాగా… కొందరు వ్యాపారులు రైతుల నుంచి రూ. 2,600 వరకు…

Read More