ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ – అర్ధరాత్రి నుంచి వైద్య సేవలు బంద్

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆదివారం అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపి వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన 1300 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ పరిణామం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు చేసినందుకు తమకు రావాల్సిన బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని నెట్‌వర్క్ ఆసుపత్రులు చాలా…

Read More

కుర్చీ వదలని ఎంఎన్ జే డైరెక్టర్

సహనం వందే, హైదరాబాద్:ఎంఎన్ జే డైరెక్టర్ శ్రీనివాసులును వెంటనే రిలీవ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఈనెల 26వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటికీ ప్రతిరోజూ ఆయన ఆస్పత్రికి వస్తూనే ఉన్నారు. అంతేకాదు డైరెక్టర్ పోస్టులో విధులు నిర్వహిస్తుండటంపై ఆసుపత్రి వర్గాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తప్పించినా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి యంత్రాంగం ఆయనను ఎందుకు రిలీవ్ చేయడం లేదని…

Read More

స్మిత సబర్’వార్’ – రేవంత్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సెలవు నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ఆరు నెలలపాటు చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవడం వెనుక నిజమైన కారణాలు ఏంటనేది అంతుచిక్కడం లేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకు ప్రాధాన్యత లేని పోస్టులు కట్టబెట్టడం, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరిగే సమయంలో సెలవు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు తావిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో…

Read More

జీరో యూరియా దందా… వ్యాపారుల మాయ- ఫ్యాక్టరీల నుంచి నేరుగా తెచ్చి వ్యాపారం

సహనం వందే, హైదరాబాద్:రైతుకు యూరియా కొరత నిద్రపట్టనివ్వడం లేదు. వ్యవసాయ పనులను పక్కనపెట్టి గంటల తరబడి ఎరువుల దుకాణాల ముందు క్యూలో నిల్చోవడం నిత్యకృత్యమైపోయింది. ఈ దుస్థితిని కొందరు డీలర్లు, వ్యాపారులు అవకాశంగా తీసుకుని యూరియా బ్లాక్ దందాకు తెరతీశారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ. 270 విలువ గల 45 కిలోల యూరియా బస్తాను కొన్నిచోట్ల రూ. 500 పైగా అమ్ముతున్నారు. ఒక బస్తా కావాలంటే ఇతర సరుకులను కూడా కొనాలనే షరతులు, క్యాష్ అండ్ క్యారీ…

Read More

యూరియా సరఫరాలో కేంద్రం నిర్లక్ష్యం – జాన్ వెస్లీ విమర్శ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియాను అందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, రైతులు నెలరోజులుగా యూరియా కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి బీజేపీ నాయకులు సృష్టిస్తున్న తప్పుడు ప్రచారమే కారణమని ఆరోపించారు. కృత్రిమ కొరత పేరుతో బీజేపీ…

Read More

అధికారుల తీరుతో అన్నదాత బలి – నాడు రుణమాఫీ… నేడు యూరియా

సహనం వందే, హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రభుత్వంలో ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి వ్యవసాయశాఖలో ఎవరైనా కోవర్టులుగా పనిచేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కొందరు రాజకీయ పండితులు. అప్పట్లో రుణమాఫీ విషయంలోనూ… ఇప్పుడు యూరియా కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ యంత్రాంగ నిర్లక్ష్యమే నిదర్శనమని చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉంటూ సర్కారును ఇరుకున పెట్టే విధంగా కొందరు వ్యవసాయ అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దలతో కలిసి…

Read More

వైద్య అనుబంధ వృత్తుల కౌన్సిల్ ఏర్పాటుకు డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మినహా వైద్య రంగానికి చెందిన 57 రకాల అనుబంధ వృత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2021 మార్చిలో వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర కౌన్సిల్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. చివరికి సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర కౌన్సిల్స్‌ను…

Read More

ఎంఎన్ జే డైరెక్టర్ పై వేటు – డాక్టర్ శ్రీనివాసులుకు డీవోపీటీ షాక్!

సహనం వందే, హైదరాబాద్‌:ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులుపై వేటు పడింది. ఆయనను తిరిగి వెనక్కి పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సాధారణ పరిపాలన విభాగం తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ఏపీకి కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలంటూ శ్రీనివాసులు చేసిన అభ్యర్థనను కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వశాఖ (డీవోపీటీ) తిరస్కరించింది. 2017 జనవరి 17న జారీ చేసిన ఆ ఉత్తర్వులు…

Read More

తెలుగు భాషపై మార్వాడీ ద్వేషం – దశాబ్దాలైనా స్థానిక భాష మాట్లాడని జాతి

సహనం వందే, హైదరాబాద్:శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని… సొంత తెలివి తేటలతో వ్యాపారాలు చేస్తున్నామని చెప్పుకుంటున్న మార్వాడీలు… ఇన్నేళ్ల కాలంలో తెలుగు భాష ఎందుకు నేర్చుకోలేదు? గ్రామాలు మొదలు హైదరాబాద్ వరకు ఎక్కడ చూసినా వాళ్ళెవరూ తెలుగు నేర్చుకోరు… మాట్లాడరు. వాళ్ల కోసం మనం హిందీ నేర్చుకోవాలి తప్ప… మార్వాడీలు మాత్రం తెలుగు నేర్చుకోరు. మనకు వచ్చినా రాకున్నా వాళ్ల భాషలోనే మాట్లాడాలి. తెలుగు భాషపై మార్వాడీ ద్వేషం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్థానిక ప్రజల భాషా,…

Read More

ప్రజా నాయకుడి శరీరమూ ప్రజలకే అంకితం – మెడికల్ కాలేజీకి సురవరం భౌతికకాయం

సహనం వందే, హైదరాబాద్:సిపిఐ అగ్రనేత, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి రెడ్ ఆర్మీ ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది. ఆయన భౌతికకాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో గౌరవించింది. అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు, నాయకులు పాల్గొని నివాళులర్పించారు. సుధాకర్ రెడ్డి చివరి కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. అంతిమయాత్రలో ముందు పోలీసులు అధికారిక గౌరవ వందనం సమర్పించగా, ఆ తర్వాత…

Read More