10,000 మందిపై… డెంగీ క్లినికల్ ట్రయల్స్

సహనం వందే, హైదరాబాద్:డెంగీ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా వాలంటీర్లతో కూడిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ‘డెంగీఆల్’ అనే సింగిల్-డోస్ డెంగీ వ్యాక్సిన్ సామర్థ్యం, సురక్షితత్వం, రోగనిరోధకతను పరిశీలించడం ఈ అధ్యయనం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయోగం ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తి అయినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 20 సెంటర్లలో ట్రయల్స్…ఈ క్లినికల్ ట్రయల్స్ దేశంలోని 20…

Read More

కెనడాలో ఖలిస్తాన్ ఎంబసీ – సర్రేలో రాయబార కార్యాలయ బోర్డు

సహనం వందే, కెనడా:కెనడాలోని సర్రేలో గురు నానక్ సిక్కు గురుద్వారా ప్రాంగణంలో ఖలిస్తాన్ రాయబార కార్యాలయం అనే బోర్డు ఏర్పాటు కావడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇది పంజాబ్ ను విభజించేలా కుట్ర జరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే భారత్, కెనడా సంబంధాలను మరింత దిగజార్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఖలిస్తాన్ సమర్థకులు కెనడా గడ్డపై స్వేచ్ఛగా తమ కార్యకలాపాలను కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది. సిఖ్స్ ఫర్ జస్టిస్ పాత్ర…సర్రేలోని గురు నానక్ సిక్కు గురుద్వారా ప్రాంగణంలో…

Read More

గ్రహాంతరవాసులతో వినాశనం – స్టీఫెన్ హాకింగ్ హెచ్చరికలో నిజమెంత?

సహనం వందే, లండన్:ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ గ్రహాంతరవాసుల గురించి చేసిన హెచ్చరికలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఆకాశంలో కనిపించే గుర్తు తెలియని వస్తువులు (యూఎఫ్ఓ), గ్రహాంతరవాసుల గురించి రోజురోజుకు ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో హాకింగ్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు ప్రజల మనసుల్లో ఆందోళన రేపుతున్నాయి. గ్రహాంతరవాసులతో మనకు సంబంధాలు ఏర్పడితే అది మానవ జాతికి ముప్పుగా మారవచ్చని ఆయన హెచ్చరించారు. ఈ విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ చర్చకు దారితీస్తున్నాయి. గ్రహాంతరవాసులు…

Read More

బెంగాలీ … బంగ్లాదేశ్ భాష’ – బెంగాల్ భగ్గు… సీఎం మమత ఆగ్రహం

సహనం వందే, కోల్‌కతా:ఢిల్లీ పోలీసులు బెంగాలీ భాషను ‘బంగ్లాదేశ్ భాష’గా పేర్కొనడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది భారత రాజ్యాంగాన్ని, బెంగాలీ మాట్లాడే ప్రజలను అవమానించడమేనని మమత ఆరోపించారు. బెంగాలీ భాషను ‘బంగ్లాదేశ్ భాష’గా పేర్కొంటూ ఢిల్లీలోని బంగా భవన్‌కు లోధి కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ఒక లేఖను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అసలేం జరిగింది?ఢిల్లీలో ఎలాంటి పత్రాలు…

Read More

కేసీఆర్ దోషి… హరీష్ పాత్రధారి – కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతులేని అవినీతి

సహనం వందే, హైదరాబాద్:కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రిమండలి యధాతథంగా ఆమోదించినట్టు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం సమగ్రంగా చర్చించింది. అనంతరం రేవంత్ రెడ్డి…

Read More

ప్రజావాణి … ‘హైడ్రా’బాణి – రంగనాథ్ ఆధ్వర్యంలో కార్యక్రమం

సహనం వందే, హైద‌రాబాద్‌:హైడ్రా ప్రజల పక్షాన నిలుస్తోంది. ప్రజా గొంతుకగా మారుతుంది. అందుకోసం హైడ్రా కమిషనర్ ప్రత్యేకంగా ప్రజావాణి చేపట్టారు. సోమవారం నిర్వహించిన ప్ర‌జావాణికి 58 ఫిర్యాదులందాయి. ఇందులో అధిక‌భాగం పార్కుల క‌బ్జాలు, ర‌హ‌దారుల ఆక్ర‌మ‌ణ‌లు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల కాజేత ప్ర‌యత్నాల‌పై ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. ఈ ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. గూగుల్ మ్యాప్స్‌, లేఔట్ల‌తో పాటు.. ఎన్ఆర్ ఎస్‌సీ, స‌ర్వే ఆఫ్ ఇండియా, గ్రామ రికార్డుల‌ను ఫిర్యాదుదారుల ముందే ఆన్‌లైన్లో…

Read More

నటులకు కోట్లు… కార్మికులకు పాట్లు – టాలీవుడ్ ఇండస్ట్రీలో విచిత్ర పరిస్థితి

సహనం వందే, హైదరాబాద్:టాలీవుడ్ పరిశ్రమలో పెద్ద పెద్ద నటులకు వందల కోట్లు చెల్లించే బడా నిర్మాతలు… సినిమా షూటింగ్ లలో పాల్గొనే కార్మికులకు మాత్రం రోజువారి కూలీ ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు. హీరో హీరోయిన్లకు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చే నిర్మాతలు… కార్మికుల ఆకలి తీర్చడానికి కూడా ముందుకు రావడం లేదు. దీనిపై తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, కోశాధికారి టీవీ…

Read More

2 రూపాయల ఫీజు… 18 లక్షల రోగులు – 50 ఏళ్లుగా అదే ఫీజుతో వైద్య వృత్తికి గౌరవం

సహనం వందే, కన్నూర్:500 రూపాయల ఫీజు… 5 వేల రూపాయల వైద్య పరీక్షలు… వేల రూపాయల మందులు… ఇలా రోగులను దోచుకుంటున్న కొందరు డాక్టర్లను… కార్పొరేట్ ఆసుపత్రులను నేడు మనం చూస్తున్నాం. కానీ కేరళ రాష్ట్రం కన్నూర్ కు చెందిన డాక్టర్ ఎ.కె. రైరు గోపాల్ కేవలం రెండు రూపాయల ఫీజుతోనే రోగులకు వైద్యం చేయడం ఎంతో విశేషం. 50 ఏళ్లుగా ఆయన అదే ఫీజు వసూలు చేస్తున్నట్టు ఆశ్చర్యకరం. రెండు రూపాయల డాక్టర్ గా పేరొందిన…

Read More

రెమ్యూనరేషన్లలో సంస్కరణలు – కేరళలో సినీ అట్టడుగు వర్గాలకు అగ్రపీఠం

సహనం వందే, తిరువనంతపురం:కేరళలో ప్రభుత్వం చలనచిత్ర రంగాన్ని సమూలంగా మార్చడానికి ఒక కీలకమైన ముసాయిదా చలనచిత్ర విధానాన్ని విడుదల చేసింది. ఈ విధానం పరిశ్రమను అధికారికంగా గుర్తించడం, అంతర్జాతీయంగా ప్రాధాన్యత పెంచడం, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం లక్ష్యంగా రూపొందించారు. తిరువనంతపురంలో జరుగుతున్న రెండు రోజుల మలయాళం ఫిల్మ్ కాన్‌క్లేవ్ సందర్భంగా ఈ విధానాన్ని ఆవిష్కరించారు. లింగ సమానత్వానికి ప్రాధాన్యతఈ విధానం సినిమా నిర్మాణాన్ని, ప్రదర్శనను ఒక పరిశ్రమగా గుర్తించడం, మెరుగైన ఆర్థిక వనరులను సమకూర్చడం,…

Read More

టీఆర్ఎస్ (డి) గౌరవ అధ్యక్షురాలిగా ప్రసన్న

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) (టీఆర్ఎస్ (డి)) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని, సమస్యలపై పోరాడే మహిళగా గుర్తింపు పొందిన ప్రసన్నను తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. పరిచయం అవసరం లేని పేరుగా తెలంగాణలో సుపరిచితులైన ప్రసన్న, ఇకపై పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. ఆమె పోరాట స్ఫూర్తి పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

Read More