Bank Loans

బడాబాబులకు బ్యాంకులు బంపర్ ఆఫర్ – ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు రద్దు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో బ్యాంకులు కేవలం కోటీశ్వరుల కోసమే పని చేస్తున్నాయి. వాళ్లకు వందలు వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పులు ఇస్తున్నాయి. అంతే కాదు వాళ్లు అప్పులు చెల్లించడానికి సిద్ధంగా లేకపోతే వాటిని రద్దు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఏమాత్రం వెనకా ముందు ఆలోచించడం లేదు. వాటిని ఏకబిగిన రద్దు చేస్తుంది. తాజాగా ఆరు లక్షల కోట్ల రూపాయలకు పైగా పాత బకాయిలను రద్దు చేయడం దారుణం. ఎవరి సొమ్ము ఎవరికి ధారాదత్తం?దేశంలో బ్యాంకుల…

Read More
Ram Mohan Naidu Union Minister for Civil Aviation

అసమర్థ మంత్రి… ఇండిగో కంత్రి – విమాన మంత్రిని తొలగించాలన్న డిమాండ్లు

సహనం వందే, న్యూఢిల్లీ: ఒక పది మంది రోడ్డుమీదకు వచ్చి చిన్నపాటి నిరసన చేస్తే ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారని వారిని తక్షణమే పోలీసులు అరెస్టు చేస్తారు. అనుమతి లేకుండా 50 మంది ధర్నా చేస్తే శాంతిభద్రతలకు విఘాతం అంటూ పోలీసులు లోన పడేస్తారు. మరి దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రయాణికులను ఇబ్బందుల పాలు చేసి… అనేక పెళ్లిళ్లు రద్దయి పోవడానికి కారకులైన ఇండిగో యాజమాన్యంపై ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలేదు? ఇంత జరిగితే దానికి బాధ్యులైన వ్యక్తిని అరెస్టు…

Read More
Arnav Goswamy comments Civil Aviation Minister

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుని ఉతికిపారేసిన అర్నాబ్‌ గోస్వామి

సహనం వందే, అమరావతి: దేశంలో ఇండిగో విమానయాన సంస్థ సృష్టించిన సంక్షోభంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు వైఖరి తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇంత పెద్ద సమస్య ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా, కేంద్ర మంత్రి మాత్రం కనీసం స్పందించడం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని జాతీయ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. అసలు మంత్రి ఏం చేస్తున్నారంటూ… నెట్‌ ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారా? లేక రీల్స్‌, నెట్ ఫ్లిక్స్ చూస్తున్నాడా? అంటూ రిపబ్లిక్‌ టీవీ ప్రజెంటర్‌ అర్నాబ్‌…

Read More
Maseedu@Ayodhya

అయోధ్యలో మసీదు – రామాలయం పక్కనే నిర్మాణానికి రంగం సిద్ధం

సహనం వందే, అయోధ్య: అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి సరిగ్గా 33 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1992 డిసెంబర్ 6న జరిగిన ఈ ఘటన దేశ రాజకీయాల్లో, మతపరమైన అంశాల్లో పెను ఉద్రిక్తతకు దారితీసింది. ఆ వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు దివ్యమైన రామాలయ నిర్మాణం పూర్తయి ఇప్పుడు అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో కోర్టు ఆదేశాల మేరకు కేటాయించిన స్థలంలో కొత్త మసీదు నిర్మాణం కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇది…

Read More
400 Indigo Flights Cancelled

ఇండిగో ఇదేం రోగం? – ఈరోజు 400 విమానాలు రద్దు

సహనం వందే, హైదరాబాద్: దేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో వరుసగా నాలుగో రోజు కూడా ప్రయాణికుల ఆందోళనలు ఆగడం లేదు. ఇండిగో విమానాలు ఆలస్యం కావడం… చివరి నిమిషంలో రద్దు కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇది ఎంతటి దారుణమో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని 6 ముఖ్య నగరాలలో గురువారం బయలుదేరిన విమానాలు కేవలం ఎనిమిదిన్నర శాతం మాత్రమే. ఇంత దారుణమైన సేవను విమానయాన సంస్థ…

Read More
Rahul Gandhi Comments on Puthin Visit

విదేశీ స్నేహం… విపక్షం దూరం – కేంద్ర సర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్

సహనం వందే, న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటన సందర్భంగా ప్రతిపక్షానికి చుక్కెదురైంది. విదేశీ ప్రముఖులు దేశాన్ని సందర్శించినప్పుడు సంప్రదాయబద్ధంగా ప్రతిపక్ష నాయకులతో కూడా సమావేశమవడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని పూర్తిగా తుంగలో తొక్కిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం పార్లమెంట్ బయట విలేకరులతో మాట్లాడిన రాహుల్ గాంధీ… విదేశీ ప్రతినిధులు ప్రతిపక్ష నాయకులను కలువకుండా కేంద్రం వ్యవస్థీకృతంగా అడ్డుకుంటోందని ఆరోపించారు. అభద్రతా భావంతోనే ఆంక్షలు…గతంలో…

Read More
Tata Trust Money to BJP

టాటా ట్రస్ట్… బీజేపీ లూట్ – కాషాయం ఖజానాకు గుట్టలుగా నిధులు

సహనం వందే, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ఎన్నికల బాండ్ల వ్యవహారంపై తెరపడింది అనుకుంటున్న తరుణంలో రాజకీయ పార్టీలకు నిధుల ప్రవాహం మరో కొత్త రూపంలో కొనసాగుతోంది. కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న ప్రొగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ (పీఈటీ) ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీగా రూ. 915 కోట్ల విరాళాల పంపిణీ జరిగింది. అందులో 83 శాతం వాటా ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖాతాలోకి చేరింది. టాటా ట్రస్ట్…

Read More
16th Finance Commission Report

దక్షిణాది వాటాపై మళ్లీ కుట్ర – కేంద్రానికి 16వ ఆర్థిక సంఘం నివేదిక

సహనం వందే, హైదరాబాద్:16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు అరవింద్ పనగరియా తన నివేదికను గతవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్ల కాలానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయాల పంపిణీని ఈ నివేదిక నిర్ణయించనుంది. కీలకమైన ఈ నివేదికను ఇంకా బహిర్గతం చేయకుండా వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. దీనిపై అప్పుడే తీవ్ర ఆందోళన మొదలైంది. కేంద్ర నిధుల పంపిణీ పాత పద్ధతిలోనే…

Read More
New Labor Laws

కొత్త చట్టం… బానిసత్వం – కార్మికుల 8 గంటల పని పరిమితి ఎత్తివేత

సహనం వందే, న్యూఢిల్లీ:యువతి యువకుల్లారా మీరు దేశాన్ని అభివృద్ధి చేయాలంటే బాగా పనిచేయాలి. అలా చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జోలికి వెళ్ళమాకండి. ఎందుకంటే మీకు కుటుంబంతో గడిపే సమయం ఉండదు. ఇప్పటివరకు రోజుకు 8 గంటలున్న పని విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 12 గంటల వరకు పెంచుకునేలా సవరణలు చేసింది. హైదరాబాదు లాంటి చోట్ల 12 గంటలు పని చేసిన తర్వాత ట్రాఫిక్ లో రెండు మూడు గంటలు పోతుంది. అంటే రోజుకు మీరు 15…

Read More

ఊరు పొమ్మంది… సర్వే రమ్మంది – వచ్చే ఏడాది భారీ సర్వేకు కేంద్రం ఏర్పాట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో వలస కార్మికులు, వారి కుటుంబ జీవితాలను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2026-27 సంవత్సరంలో దేశవ్యాప్తంగా భారీ వలస సర్వే జరగబోతోంది. గతంలో కేవలం ఎంత మంది వలస వెళ్లారనే గణాంకాలకే పరిమితమైన ఈ సర్వే… ఇకపై వలస కార్మికుల జీవిత నాణ్యతను పూర్తిగా తెలుసుకునే లక్ష్యంతో రూపుదిద్దుకుంది. దాదాపు రెండు దశాబ్దాలకు (2007-08) జరుగుతున్న ఈ అధ్యయనం వలస కార్మికుల బతుకు బాగుపడాలనే సంకల్పంతో రూపొందుతోంది. ఆరు నెలలు…

Read More