‘సుప్రీంకోర్టు’పైనే న్యాయ విద్యార్థుల తిరుగుబాటు – హైదరాబాద్ నల్సార్ స్టూడెంట్స్ నిరసన వెల్లువ
సహనం వందే, హైదరాబాద్: నల్సార్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిని ముఖ్య అతిథిగా పిలవద్దంటూ లా విద్యార్థులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఢిల్లీలో నీట్ పరీక్షా విధానంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల అణచివేతను, ఆందోళనకారులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యవహరించిన తీరును, ఆయన చేసిన వ్యాఖ్యలను విద్యార్థులు తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగ హక్కులను కాలరాసేలా ఉన్న ఇటువంటి వ్యక్తులు ముఖ్య అతిథిగా వస్తే తమ డిగ్రీలను స్వీకరించలేమని వారు…