Suresh Chanda IAS complaints on Solar Electricity System

సోలార్ బిల్… ఐఏఎస్ ఫైర్ – చార్జీల పెంపుపై మాజీ సీఎండీ ఫిర్యాదు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో సోలార్ వినియోగదారుల బిల్లులు ఒక్కసారిగా రెట్టింపు కావడంతో తీవ్ర కలకలం రేగుతోంది. డిస్కం అధికారులు ఎటువంటి నోటీసు లేకుండా రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలను పక్కనబెట్టి నెట్ మీటరింగ్ స్థానంలో గ్రాస్ మీటరింగ్‌ను అమలు చేయడమే దీనికి కారణం. గ్రిడ్‌కు ఇచ్చిన కరెంటుకు తక్కువ ధర చెల్లిస్తూ తీసుకున్న కరెంటుకు మాత్రం అధిక రిటైల్ ధర వసూలు చేస్తున్నారు. ఇది ప్రజలను మోసం చేయడమేనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో సీఎండీ, తెలంగాణ రిటైర్డ్ సీనియర్…

Read More
AP Politicians' Weekend @Hyderabad

ఆదివారం ‘అమరావతి’ అనాథ – హైదరాబాదులో నేతల వీకెండ్ ఎంజాయ్

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ అంటే వారికి పీక్ అవర్స్ లో పని చేసే ఒక తాత్కాలిక కార్యాలయం మాత్రమే! వీకెండ్ వచ్చిందంటే చాలు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, అత్యున్నత అధికారులు అనేకమంది హుటాహుటిన హైదరాబాద్‌కి పరిగెడుతున్నారు! ఏపీ రాజకీయాలు, పాలన ఇప్పుడు వారాంతపు షటిల్ సర్వీస్‌ల చుట్టే తిరుగుతోంది. రాజధాని ప్రాంతంలో వారాంతంలో బోసిపోయి ఉంటుంది. ప్రత్యేక విమానంలోనే పయనం…వారాంతంలో నేతలు హైదరాబాదుకు వెళ్లడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాలను……

Read More
ఐదేళ్లకు కోర్టు మెట్లు ఎక్కుతున్న మాజీ సీఎం

కోర్టు హుకూం… జగన్ కదిలెన్ – ఐదేళ్లకు కోర్టు మెట్లు ఎక్కుతున్న మాజీ సీఎం

సహనం వందే, హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించలేదు. దీంతో చాలా ఏళ్ల విరామం తర్వాత గురువారం (నేడు) ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. సుదీర్ఘంగా బెయిల్‌పై ఉన్న జగన్… చివరిసారిగా 2020 జనవరి 10న కోర్టుకు వచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత దాదాపు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలనా బాధ్యతలు, భద్రతా కారణాలు చూపుతూ కోర్టుకు రాకుండా…

Read More

‘బొమ్మ’కు బ్రేక్… హీరోల ఖుష్ – ఐ బొమ్మ మూసివేతతో పైరసీ ముగిసినట్టేనా?

సహనం వందే, హైదరాబాద్:సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివి రెండు కంపెనీలకు సీఈఓ స్థాయికి ఎదిగిన ఓ యువ మేధావి… చీకటి ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆయనే ఐ బొమ్మ, బప్పం వంటి పైరసీ సైట్లకు సూత్రధారి ఇమ్మడి రవి. తన కంప్యూటర్ టెక్నాలజీ నైపుణ్యాన్ని సరైన మార్గంలో కాకుండా సినిమా పరిశ్రమను నాశనం చేసే పైరసీ దారికి మళ్లించాడు. రవి టెక్నాలజీ నైపుణ్యం చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. అతనిని జైలుకు పంపించడంతో…

Read More

సెవెన్ రూల్… నాగ్ స్టైల్ – నాగార్జున యంగ్ మంత్ర

సహనం వందే, హైదరాబాద్:ఎప్పుడూ యవ్వనంగా ఉల్లాసంగా ఉండాలంటే ప్రత్యేక డైట్‌లు, ఖరీదైన సప్లిమెంట్లు అవసరం లేదని జీర్ణకోశ వ్యాధి నిపుణులు అంటున్నారు. చాలా సులువైన ఒకే ఒక్క సాధారణ నియమం పాటిస్తే సరిపోతుందని చెపుతున్నారు. ఆ రహస్యం మరేదో కాదు… రాత్రి భోజనాన్ని త్వరగా పూర్తి చేయడమే. 60 ఏళ్లు దాటినా తన యవ్వన శక్తితో ఆకట్టుకుంటున్న అగ్ర నటుడు నాగార్జున అలవాటు కూడా సరిగ్గా ఇదే కావడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే…

Read More

టెర్రరిజం… ఢిల్లీ & హైదరాబాద్ – ఈ రెండు నగరాలే కేంద్రాలుగా ఉగ్రవాదం

సహనం వందే, హైదరాబాద్:భారతదేశ భద్రతకు ఏళ్లుగా ఒకే రకమైన ముప్పు పొంచి ఉంది. అది ఉగ్రవాదం. 2000వ సంవత్సరంలో దేశ రాజధాని ఎర్రకోటపై లష్కరే తోయిబా కాల్పులు జరిపింది. ఢిల్లీ పోలీసులు పాకిస్తానీ ఉగ్రవాది అష్ఫాక్ అహ్మద్‌ను పట్టుకున్న నాటి నుంచి దేశంలో ఐఎస్ఐ విషపు కోరలు ఎంత లోతుగా పాతుకుపోయాయో ప్రపంచానికి తెలిసిందే. పాత ఢిల్లీలోని జామా మసీదు ప్రాంతం, హైదరాబాద్ పాతబస్తీ జిహాదీ కార్యకలాపాలకు, నకిలీ నోట్లు, పేలుడు పదార్థాలు దాచడానికి ప్రధాన కేంద్రాలుగా…

Read More

అర లక్ష కోట్లకు హైడ్రా రక్షణ – కమిషనర్ రంగనాథ్ వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కాపాడడంలో హైడ్రా సాధించిన విజయం అసాధారణమైనది. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు ఏకంగా 181 డ్రైవ్స్ నిర్వహించి 954 కబ్జాలను తొలగించినట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు ప్రకటించారు. ఈ క్రమంలో మొత్తం 1045.12 ఎకరాల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ సుమారు రూ. 50,000 కోట్ల నుండి రూ. 55,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో ప్రభుత్వ భూములు 531.82 ఎకరాలు,…

Read More

మా ‘కంత్రి’ కుటుంబం – మాగంటి మృతిపై అతని తల్లి సంచలనం

సహనం వందే, హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్న తరుణంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆమె కుటుంబం నుంచే బిగ్ షాక్ తగిలింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వారసత్వంపై కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం చుట్టూ ముసలం ముదిరి అది ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. ఉపఎన్నికల ప్రక్రియ నడుస్తుండగానే రెవెన్యూ అధికారుల విచారణకు ఈ వివాదం దారితీయడం బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళన నింపుతోంది. మాగంటి కుటుంబంలోని ఈ కలహాల ప్రభావం ఈ…

Read More

లైక్ చేస్తే లూటీ – 30,000 మంది… రూ. 1,500 కోట్లు లూటీ

సహనం వందే, హైదరాబాద్:డిజిటల్‌ ప్రపంచంలో చిన్న లైక్‌ కూడా ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందో సుమిత్ కుమార్ ఉదంతం నిరూపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని చెఫ్ సుమిత్… ఒక ఆర్థిక సలహాదారు వీడియోకు లైక్ కొట్టగానే పది నిమిషాల్లోనే వాట్సాప్ సందేశం వచ్చింది. పెట్టుబడి కోసం ఎర వేయడానికి సైబర్ నేరగాళ్లు ఎంత వేగంగా పకడ్బందీగా పనిచేస్తున్నారో చెప్పడానికి ఇదే ఉదాహరణ. వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ సభ్యులతో లాభాల ఊసేత్తుతూ తమ వలలో చిక్కుకున్న వ్యక్తికి ఆశ…

Read More

పగలు కోడ్‌… రాత్రి రోడ్ – హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్లుగా టెక్కీలు

సహనం వందే, హైదరాబాద్:క్యాబ్ డ్రైవర్ మీకు ఫోన్‌లో కార్పొరేట్ భాషలో సమాధానమిస్తే ఆశ్చర్యపోకండి. అతను టెక్కీ అయి ఉండొచ్చు. ఇది కేవలం డబ్బు కోసం కాదు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఒంటరితనం, ఆఫీసులో అవిశ్రాంతంగా చేసిన పని నుంచి కాస్త రిలీఫ్ అవ్వడానికి రాత్రిళ్లు క్యాబ్‌లు నడుపుతున్నారు. ఇది మన కార్పొరేట్ సంస్కృతిలోని దారుణమైన పరిస్థితిని తెలియజేస్తుంది. టెక్కీల కొత్త జీవనంఅభినవ్ అనే 27 ఏళ్ల యువకుడు రెండేళ్ల క్రితం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం…

Read More