Eswara Chari Death

బీసీ బిడ్డ బలిదానం… రగులుతున్న తెలంగాణ

సహనం వందే, హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న బీసీ యువకుడు సాయి ఈశ్వరాచారి చికిత్స పొందుతూ కన్నుమూయడం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లను ఏకంగా 17 శాతానికి తగ్గించడంతో బీసీ వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం తమను మోసం…

Read More
TS Outsourcing JAC

బతుకు కోసం బతుకు – ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల బానిసత్వం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న లక్షలాది మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నా వీరికి జీతాలు మాత్రం సకాలంలో అందడం లేదు. నెలలు గడుస్తున్నా వేతనం రాక ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంటి అద్దె, పిల్లల ఫీజులు చెల్లించలేక అప్పుల బాధతో అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదనేందుకు, పాలనా యంత్రాంగం సరిగా పనిచేయడం లేదనేందుకు ఈ జీతాల జాప్యమే నిదర్శనం. ఈ సమస్యను…

Read More
Acid Attack at Warangal

నర్సింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి

సహనం వందే, వరంగల్:నర్సింగ్ విద్యార్థినిపై మంగళవారం ముగ్గురు దుండగులు యాసిడ్ దాడి చేసి పరారయ్యారు. హనుమకొండలోని కాలేజీ నుంచి ద్విచక్ర వాహనంపై అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న ఆమెపై హెల్మెట్లు ధరించిన దుండగులు యాసిడ్ చల్లారు. ఈ దాడిలో విద్యార్థినికి నడుము, ఎడమ కాలిపై గాయాలయ్యాయి. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త ఎన్డీటీవీ సోర్స్: https://www.ndtv.com/india-news/telangana-nursing-student-attacked-with-chemical-substance-suffers-injuries-9734317

Read More
PG Medical Seats

కొత్తగా 4201 పీజీ మెడికల్ సీట్లు – తెలంగాణకు 353 సీట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు భారీగా పెరిగాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 4201 కొత్త పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది. 2025-26 విద్యా సంవత్సరానికి బ్రాడ్ స్పెషాలిటీల్లో ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఈ పూర్తి జాబితాను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా…ఈ కొత్త సీట్లను రాష్ట్రాల వారీగా విభజించారు. కర్ణాటకకు అత్యధికంగా 712 సీట్లు దక్కగా, ఉత్తరప్రదేశ్‌కు 613,…

Read More
Health Insurance Claim rejected

లక్షల బిల్లు… బీమాకు చిల్లు – హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల మాయాజాలం

సహనం వందే, హైదరాబాద్: ఆయన పేరు రఘునందన్… హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అనుకోని పరిస్థితుల్లో ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వారం రోజులపాటు ఉన్నందుకు,,,, ఆయనకు చికిత్స చేసినందుకు ఆ ఆసుపత్రి 8 లక్షల రూపాయలు బిల్లు వేసింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న ధీమాలో ఆ ఉద్యోగి ఉన్నాడు. బిల్లు చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి బీమా కంపెనీ కొర్రీలు పెట్టింది. మీరు చేయించుకున్న చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదని బాంబు పేల్చింది….

Read More
World AIDs Day

టార్గెట్ 2030… ఎయిడ్స్‌ ఎండ్ – ఐదేళ్లలో వ్యాధి పూర్తి నిర్మూలనే లక్ష్యం

సహనం వందే, హైదరాబాద్:భారతదేశం గత పదిహేనేళ్లలో హెచ్‌ఐవీ నియంత్రణలో విజయం సాధించింది. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు దేశ ఆరోగ్య రంగానికి పెద్ద బూస్ట్‌ ఇచ్చాయి. 2010 నుంచి 2024 మధ్య కొత్తగా నమోదవుతున్న హెచ్‌ఐవీ కేసుల్లో ఏకంగా 48.7 శాతం తగ్గుదల కనిపించింది. అలాగే ఎయిడ్స్ కారణంగా చనిపోయే వారి సంఖ్య 81.4 శాతం క్షీణించడం మరో గొప్ప ఘనతగా చెప్పుకోవచ్చు. సరైన…

Read More
Online platform Food Safety Inspection

ఆన్ లైన్ లో సరు’కుళ్లు’- బ్లింక్ ఇట్, జెప్టో, జొమాటోల నాసిరకం సప్లై

సహనం వందే, హైదరాబాద్: ఆన్ లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో మనం నిత్యం కొనే సరుకులు ఎంతవరకు సురక్షితం? తాజా తనిఖీల్లో వెల్లడైన వివరాలు వినియోగదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. జొమాటో, స్విగ్గీ, రిలయన్స్ జియోమార్ట్, జెప్టో, బ్లింక్ ఇట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల స్టోరేజ్ సెంటర్లు, గోదాముల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఎంత దారుణంగా ఉల్లంఘనకు గురవుతున్నాయో ఈ దాడులు బట్టబయలు చేశాయి. గడువు ముగిసిన, నాణ్యత లేని సరుకులను అమ్ముతూ ఈ సంస్థలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయనే…

Read More
Dr.Narahari TGGDA President raise voice on Allowances

అలవెన్స్ లాక్… డాక్టర్ల షాక్ – టీజీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ నరహరి ఆవేదన

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో నూతనంగా స్థాపించిన మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొత్తగా 10 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయగా… వాటిల్లో పనిచేస్తున్న వైద్యులకు ఇవ్వాల్సిన అదనపు అలవెన్స్ కేవలం 5 కళాశాలలకు మాత్రమే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై సంఘం నిప్పులు చెరిగింది. ప్రభుత్వమే విడుదల చేసిన అధికారిక ఉత్తర్వులలో పది కళాశాలల ప్రస్తావన స్పష్టంగా ఉన్నప్పటికీ…

Read More
ఐ-బొమ్మ రవి తండ్రి అప్పారావు 'మెగా' వార్నింగ్

ఐ బొమ్మ అప్పారావు ‘మెగా’ వార్నింగ్ – సినిమా పరిశ్రమను ఉతికి ఆరేసిన రవి తండ్రి

సహనం వందే, హైదరాబాద్: ఐ బొమ్మ నిర్వాహకుడు రవి తండ్రి అప్పారావు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తన కొడుకును ఎన్‌కౌంటర్ చేయాలని సినీ నిర్మాత సి. కల్యాణ్ బహిరంగంగా వ్యాఖ్యానించడంపై అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకును ఎన్‌కౌంటర్ చేసే అంత తప్పు ఏమీ చేయలేదని… నిజంగా ఎన్‌కౌంటర్ చేయాలంటే కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టి టికెట్ రేట్లు పెంచి సామాన్య ప్రజలను వినోదానికి దూరం చేస్తున్న కల్యాణ్‌ను,…

Read More
64Complaints to Hydra in One day

బడాబాబుల గుండెల్లో ‘హైడ్రా’ గుబులు – అక్రమాలకు బ్రేక్… బాధితులకు భరోసా

సహనం వందే, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ను ఆక్రమణలు, భూకబ్జాలు ఏ స్థాయిలో పట్టి పీడిస్తున్నాయో చెప్పడానికి ‘హైడ్రా‘ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులే నిదర్శనం. సోమవారం ఒక్కరోజే ఏకంగా 64 ఫిర్యాదులు అందాయంటే సామాన్యుడి కష్టం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైడ్రా పరిష్కారాలను చూసి ధైర్యం చేసి ఫిర్యాదుల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. లే అవుట్ల మ్యాపులు పట్టుకు వచ్చి అక్రమణలను కళ్లకు కట్టినట్టు వివరించడం చూస్తుంటే అధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నారన్న ప్రశ్న…

Read More