గాంధీయిజం జిందాబాద్ – కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే పిలుపు
సహనం వందే, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ కేంద్రంగా రగులుతున్న విద్యార్థి ఉద్యమంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్ తరహా హింసాత్మక లేదా తీవ్రవాద పోరాటాలను మన దేశానికి వర్తింపజేయకూడదని ఆయన స్పష్టం చేశారు. భారత విద్యార్థి లోకం కేవలం మహాత్మా గాంధీ చూపించిన శాంతియుత అహింసా మార్గంలోనే తమ హక్కుల సాధనకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ వేదికగా చేపట్టిన ఆందోళనలను మసిపూసి మారేడుకాయ చేసేందుకు…