అవినీతిలో బ్యాం’కింగ్’ – లంచాల్లో టాప్ పొజిషన్లో బ్యాంకులు
సహనం వందే, న్యూఢిల్లీ: దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి లీలలు బట్టబయలయ్యాయి. కేంద్ర విజిలెన్స్ కమిషన్ విడుదల చేసిన సరికొత్త నివేదిక ప్రభుత్వ శాఖల బండారాన్ని బట్టబయలు చేసింది. గతేడాది ఏకంగా 70,584 అవినీతి ఫిర్యాదులు రావడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. సామాన్యుడి చెమట ఊడ్చి సంపాదించిన సొమ్మును అవినీతిపరులు దోచుకుంటుంటే దేశం ఎలా పురోగమిస్తుంది? అవినీతిలో బ్యాంకులే టాప్…బ్యాంకుల్లో అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో చూస్తే దిమ్మతిరిగిపోతుంది. ఈ మొత్తం అవినీతి లొసుగుల జాబితాలో సామాన్యులతో…