అగ్రరాజ్యంగా చైనా – నాటి రష్యా పాత్రను పోషిస్తున్న డ్రాగన్ కంట్రీ

సహనం వందే, చైనా:ఒకప్పుడు కమ్యూనిస్ట్ రష్యా అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని ప్రపంచానికి అండగా నిలబడింది. ఇప్పుడు అదే బాధ్యతను కమ్యూనిస్ట్ చైనా భుజానికెత్తుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అమెరికాపై విమర్శల వర్షం కురిపిస్తూ అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త సంచలనం సృష్టిస్తున్నారు. అమెరికా విధానాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురవుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ సుంకాల విధానాల వల్ల అనేక దేశాలు నష్టపోతున్నాయి. చైనా, భారత్‌ వంటి దేశాలను లెక్కచేయకుండా సుంకాలు విధిస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగించడంపై షీ…

Read More

అమెరికాలో హై’డ్రగ్స్’బాద్ నరమేధం – ఫెంటానిల్‌ వాడి వందల మంది మృతి

సహనం వందే, హైదరాబాద్:వసుధ ఫార్మా కెమ్ కంపెనీ అమెరికాతో సహా పలు దేశాల్లో డ్రగ్ నరమేధం సృష్టిస్తుంది. ఆ కంపెనీ ప్రమాదకర ఫెంటానిల్‌ డ్రగ్ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను ఏకంగా అమెరికాకే సరఫరా చేయడంతో ఆ దేశంలో వందల మంది చనిపోయారు. దీంతో ఆ కంపెనీ సీఈవో, మార్కెటింగ్ డైరెక్టర్లను ఈ ఏడాది మార్చి 20వ తేదీన అమెరికా ఫెడరల్ ఏజెన్సీ అరెస్టు చేయడంతో హైదరాబాద్ పరువు గంగలో కలిసింది. దీనిపై అప్పుడే సహనం వందే…

Read More

కిమ్ ట్రైన్… మిస్సైల్ రైడ్ – బాంప్రూఫ్ రైల్లో కిమ్ చైనాకు ప్రయాణం

సహనం వందే, ఉత్తర కొరియా:ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆరేళ్ల తర్వాత పొరుగు దేశం చైనాలో పర్యటించిన ఆయన విమానంలో కాకుండా తన ప్రత్యేకమైన బాంప్రూఫ్ రైలులో ప్రయాణించడం అంతర్జాతీయ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ రైలు కేవలం ప్రయాణ సాధనం కాదు. ఒక కదిలే భద్రతా కోట. సుమారు 90 కోచ్‌లు, బుల్లెట్‌ప్రూఫ్ రక్షణ, మిస్సైల్ వ్యవస్థ, బాంబు నిరోధక వ్యవస్థలు, అత్యంత విలాసవంతమైన…

Read More

గాజా యుద్ధంలో జర్నలిస్టుల ఊచకోత – 210 మంది హత్య

సహనం వందే, న్యూయార్క్:గాజా యుద్ధంలో జర్నలిస్టులను టార్గెట్ చేసి ఇజ్రాయిల్ హత్య చేస్తోందని ఆరోపిస్తూ ప్రపంచ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 50 దేశాల నుంచి 200కు పైగా మీడియా సంస్థలు సోమవారం భారీ నిరసనలకు దిగాయి. పత్రికలు నల్లటి ముఖ చిత్రాలను ప్రచురించగా… టెలివిజన్, రేడియోలు తమ ప్రసారాలను నిలిపివేశాయి. ఈ నిరసన ద్వారా గాజాలో స్వేచ్ఛాయుత వార్తా కవరేజీకి అనుమతించాలని, అమాయక జర్నలిస్టుల హత్యలను ఆపాలని డిమాండ్ చేశాయి. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్,…

Read More

కమ్యూనిస్టు కారులో మోడీ షికారు – చైనాలో హాంగ్చీ ఎల్5లో మోడీ ప్రయాణం

సహనం వందే, చైనా:షాంఘై సహకార సదస్సు కోసం చైనా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సొంతంగా వాడే అత్యంత ప్రతిష్టాత్మకమైన కారు హాంగ్చీ ఎల్5 లిమోసిన్‌లో ఆయన ప్రయాణించారు. ఈ కారు కేవలం ఉన్నత స్థాయి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, ఎంపిక చేసిన విదేశీ అతిథులకు మాత్రమే కేటాయించేది. 2019లో జిన్‌పింగ్ భారత్‌క వచ్చినప్పుడు ఇదే కారులో ప్రయాణించారు. ఈ కారు కేవలం…

Read More

కొత్త ఇంట్లో రోగాల కుంపటి – అడుగుపెట్టిన రోజు నుంచి జబ్బుల జాతర

సహనం వందే, అమెరికా:ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇల్లు ఒక పెద్ద కల. అమెరికాలోని ఓహియోకు చెందిన సారా, కోలిన్ దంపతులు కూడా అదే కలను సాకారం చేసుకున్నారు. 2024 మే నెలలో సుమారు రూ. 3.3 కోట్లు వెచ్చించి ఒక అందమైన ఇంటిని కొనుగోలు చేశారు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ దంపతులు సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కొన్ని రోజుల్లోనే సారాకు వింత ఆరోగ్య సమస్యలు…

Read More

మా దేశం… మా కోసం – టూరిస్ట్ గోబ్యాక్ – యూరోపియన్ల నినాదం

సహనం వందే, యూరప్:ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్థానిక ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ‘మా దేశం మా కోసమే’నని అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. టూరిస్టుల పేరుతో తమ అందమైన నగరాలను నాశనం చేస్తున్నారని… తమ జీవనశైలిని, సంస్కృతిని, ఉనికిని ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఆదాయ వనరుగా భావించిన పర్యాటకం ఇప్పుడు యూరప్‌లోని అనేక నగరాలకు సమస్యగా మారింది. పర్యాటకుల తాకిడి పెరిగి స్థానిక సంస్కృతి, జీవనశైలి దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ బార్సిలోనా నుంచి…

Read More

ఏఐ సైకోసిస్ – దాంతోనే ఒంటరిగా గడిపితే భ్రమల్లో జీవితం

సహనం వందే, అమెరికా:కృత్రిమ మేధస్సు (ఏఐ) అభివృద్ధి మానవాళికి పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ఏఐ పితామహుడిగా పేరుగాంచిన జాఫ్రీ హింటన్ చేసిన హెచ్చరికలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఏఐ పరిశోధన ఒక ఆయుధాల పోటీలా మారిందని, దీనిపై నియంత్రణ లేకపోతే అణ్వాయుధాల కంటే ప్రమాదకరమైన పరిణామాలు తప్పవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ విప్లవం ప్రపంచంలో పెను మార్పులు తీసుకొస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు విస్మరిస్తున్న కంపెనీలు…ఒకప్పుడు…

Read More

యుద్ధ విషాదం… అందంతో సందేశం – మిస్ యూనివర్స్ వేదికపై పాలస్తీనా గొంతుక

సహనం వందే, పాలస్తీనా:యుద్ధం… బాధలు… నిరాశతో నిండిన పాలస్తీనా నేల నుంచి ఒక ఆశాకిరణం ప్రపంచ వేదికపై మెరిసిపోనుంది. మిస్ యూనివర్స్ పోటీ చరిత్రలో తొలిసారిగా పాలస్తీనా తరఫున ఒక ప్రతినిధి పాల్గొనబోతున్నారు. ఆమె పేరు నదీన్ అయూబ్. పాలస్తీనా ప్రజల కన్నీళ్లు, కలలను తనలో నింపుకొని ఆమె ఇప్పుడు ప్రపంచానికి తమ గొంతుకగా నిలబడబోతున్నారు. నవంబర్‌లో జరిగే మిస్ యూనివర్స్ ఫైనల్స్ వేదికపై పాలస్తీనా జెండా ఎగరవేయడానికి ఆమె సిద్ధమయ్యారు. అందం నీడలో సందేశం..‌.అందాల పోటీలు…

Read More

బీపీ కొత్త లెక్కల షాకింగ్ – అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కొత్త గైడ్ లైన్స్

సహనం వందే, న్యూయార్క్:అధిక రక్తపోటును నియంత్రించడానికి కొత్త మార్గదర్శకాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కలిసి శుక్రవారం విడుదల చేశాయి. 2017 తర్వాత వచ్చిన ఈ తాజా సూచనలు, రక్తపోటును అదుపులో ఉంచడం ద్వారా గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధులు, మధుమేహం, జ్ఞాపకశక్తి సమస్యలు వంటి వాటిని నివారించవచ్చని స్పష్టం చేస్తున్నాయి. ఈ కొత్త నియమాలు పాతవాటి కంటే చాలా కఠినంగా ఉండడమే కాకుండా, మద్యం వినియోగాన్ని పూర్తిగా మానేయాలని సిఫారసు చేస్తున్నాయి….

Read More