డాక్టర్లపై డాలర్ సెగ – భారతీయ వైద్యులకు హెచ్1బీ గుదిబండ

సహనం వందే, అమెరికా:అమెరికా ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న విదేశీ వైద్యులకు హెచ్1బీ వీసా ఫీజు రూపంలో అకస్మాత్తుగా పెనుభారం పడింది. అగ్రరాజ్యం తాజాగా వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంపై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) అగ్గిమీద గుగ్గిలమైంది. ఈ భారీ ఫీజు వైద్య సేవలకు అడ్డంకిగా మారుతుందని, దీని ప్రభావం వల్ల దేశ ఆరోగ్య రంగం కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికన్ల ఆరోగ్య భద్రతకు అత్యవసరం అయిన వైద్యులను ఈ నిబంధన…

Read More

పచ్చబొట్టుకు పండగ – దక్షిణ కొరియాలో టాటూకు చట్టబద్ధత!

సహనం వందే, సియోల్:కొత్త చట్టంతో దక్షిణ కొరియాలో ఇక టాటూ కళకు స్వేచ్ఛ వచ్చింది. ఇప్పటివరకు చీకటి గదుల్లో రహస్యంగా పనిచేసిన టాటూ కళాకారులకు మంచి రోజులు వచ్చాయి. జాతీయ అసెంబ్లీ టాటూ కళను చట్టబద్ధం చేస్తూ చారిత్రక బిల్లును గురువారం ఆమోదించింది. ఈ చట్టం దక్షిణ కొరియా సమాజంలో టాటూలపై ఉన్న అపోహలను తొలగించి కళగా గుర్తించే దిశగా వేసిన అతిపెద్ద అడుగు. కళాకారుల జీవితాల్లో వెలుగు…దక్షిణ కొరియాలో టాటూలు వేయడం ఎప్పటి నుంచో నిషేధం….

Read More

మీడియాపై నరమేధం – యెమెన్‌లో 31 మంది జర్నలిస్టుల మృతి

సహనం వందే, న్యూఢిల్లీ:మధ్యప్రాచ్యంలో జర్నలిస్టుల భద్రతకు మరోసారి పెనుముప్పు పొంచి ఉంది. యెమెన్‌లో ఒక వార్తాపత్రిక కార్యాలయంపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో 31 మంది జర్నలిస్టులు, మీడియా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జర్నలిస్టుల రక్షణ కమిటీ (కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్) నివేదిక ప్రకారం… జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని జరిగిన అతి పెద్ద దాడి ఇదే. ఇజ్రాయిల్ ప్రభుత్వం ఈ దాడిని హౌతీ తిరుగుబాటుదారుల మీడియా కేంద్రంగా చెప్పుకుంటున్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో మీడియా సిబ్బందిని…

Read More

భారత మగాళ్లకు అమెరికాలో డిమాండ్ – ఇండియన్ భర్త కోసం ఒక మహిళ ప్రయత్నం

సహనం వందే, అమెరికా:న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ ప్రపంచానికి కేంద్ర బిందువు లాంటిది. అక్కడ విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన ప్రజలు కనిపిస్తుంటారు. అలాంటి చోట ఒక అమెరికన్ మహిళ ‘భారతీయ భర్త కావాలి’ అని రాసి ఉన్న ప్లకార్డుతో నిలబడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆధునిక కాలంలో డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ప్రేమ వ్యవహారాలకు వేదికగా మారుతున్నప్పుడు… ఆ మహిళ పాత పద్ధతిని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించింది….

Read More

లండన్ మండెన్ – ‘మా దేశం మాక్కావాలి’.. బ్రిటన్ లో నిరసనలు

సహనం వందే, లండన్:లండన్ నగరం వలస వ్యతిరేక నినాదాలతో హోరెత్తిపోయింది. యాంటీ-ఇమ్మిగ్రేషన్ ఉద్యమం గట్టి గళంతో ముందుకు సాగుతోంది. వెస్ట్‌మిన్‌స్టర్ బ్రిడ్జి నుంచి హౌస్ ఆఫ్ పార్లమెంట్ వరకు వేలాది మంది ప్రజలు కదలివచ్చారు. అతివాద కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన ఈ ‘యునైట్ ది కింగ్‌డమ్’ ర్యాలీకి లక్షన్నర మందికి పైగా హాజరయ్యారని నివేదికలు చెబుతున్నాయి. వలసవాదాన్ని వ్యతిరేకిస్తూ, అక్రమ వలసదారులను వెంటనే వెనక్కి పంపించాలని వీరు డిమాండ్ చేశారు. నిరసన శాంతియుతంగా మొదలైనా…

Read More

జెన్ జెడ్ వెనుక ‘డీజే’ సౌండ్ – నేపాల్ ను కుదిపేసిన నేత సుదాన్ గురుంగ్

సహనం వందే, నేపాల్:నేపాల్‌లో అవినీతి, కుటుంబ రాజకీయాలు… అలాగే సోషల్ మీడియా నిషేధంపై జెన్ జెడ్ యువతలో రేగిన ఆగ్రహం ఇప్పుడు రాజకీయ విప్లవంగా మారింది. ఈ పోరాటంలో ప్రభుత్వాన్ని గడగడలాడించిన యువ కెరటం 36 ఏళ్ల సుదాన్ గురుంగ్. ‘హమి నేపాల్’ అనే సంస్థకు అధ్యక్షుడైన గురుంగ్… ఈ నిరసనలకు ఊపిరి పోశాడు. వాటిని దేశవ్యాప్తంగా వ్యాపింపజేశాడు. ‘కొత్త తరం ముందుకు వచ్చి, పాత విధానాలను సవాల్ చేయాల’ని గురుంగ్ చెప్పిన మాటలు లక్షలాది మంది…

Read More

విలాసంపై విప్లవాగ్ని – నేపాల్ అధికార పెద్దల లగ్జరీపై ఆగ్రహజ్వాల

సహనం వందే, నేపాల్:నేపాల్‌ లో ప్రభుత్వ పెద్దల విలాసవంతమైన జీవితంపై యువతలో ఆగ్రహం అగ్నిపర్వతంలా పేలింది. లగ్జరీ కార్లు, ఖరీదైన విదేశీ ప్రయాణాలు, కళ్ళు చెదిరే జీవనశైలికి సంబంధించిన నాయకుల పిల్లల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ‘నెపో కిడ్స్’ హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అయ్యాయి. దేశంలో నాలుగో వంతు ప్రజలు పేదరికంతో అల్లాడుతుంటే పాలకుల వారసులు చేస్తున్న విచ్చలవిడి ఖర్చులను చూసి యువత సహనం కోల్పోయింది. ఈ సోషల్ మీడియా ప్రచారం కేవలం సమాచారం కోసం మాత్రమే…

Read More

కుబేరుడి పీఠాన్ని కోల్పోయిన మస్క్

సహనం వందే, అమెరికా:ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ తన పీఠాన్ని కోల్పోయాడు. అపారమైన కంప్యూటింగ్ శక్తికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఒరాకిల్ సహవ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ అనూహ్యంగా అతడిని అధిగమించి కొత్త ధనవంతుల రాజుగా అవతరించాడు. ఒరాకిల్ అద్భుతమైన ఆదాయ నివేదికతో లారీ సంపద ఒక్క రోజులోనే ఆకాశానికి ఎగిసింది. ఒరాకిల్ ఆదాయంతో దూకుడు…ఒరాకిల్ సంస్థ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఆదాయ నివేదిక ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కృత్రిమ మేధస్సు కంపెనీల నుంచి వచ్చిన భారీ…

Read More

నేపాల్‌లో ‘జెన్-జెడ్’ విప్లవం – సోషల్ మీడియా నిషేధంపై కన్నెర్ర

సహనం వందే, నేపాల్:నేపాల్‌లో యువత చేపట్టిన నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. అవినీతి, సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా ‘జెన్-జెడ్’ యువత వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కేపీ శర్మ ఓలి ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించడంతో ఈ ఉద్యమం మొదలైంది. సోమవారం ఆందోళనకారులు, పోలీసులు పార్లమెంట్ సమీపంలో ఘర్షణ పడటంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 ఏళ్ల బాలుడితో సహా 19 మంది మరణించారు. 300 మందికి పైగా…

Read More

పాప కోసం ప్రధాని పంతం – అయినా లెక్క చేయని జర్మనీ దేశం

సహనం వందే, న్యూఢిల్లీ:బెర్లిన్ నగరంలో జర్మనీ ప్రభుత్వ సంరక్షణలో ఉన్న నాలుగేళ్ల భారతీయ బాలిక అరిహా షా వ్యవహారం అంతర్జాతీయ దౌత్య వివాదంగా మారింది. ఆ పాపను భారత్‌కు అప్పగించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ జర్మనీ విదేశాంగ మంత్రిని కోరారు. గతంలో స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విషయాన్ని జర్మన్ ఛాన్సలర్‌ ముందు ప్రస్తావించారు. దేశం మొత్తం ఒకే గొంతుకగా ‘సేవ్ అరిహా షా’ ఉద్యమం నడుస్తున్నా జర్మనీ అధికారులు మాత్రం…

Read More