గ్రూప్‌–1లో…దగాపడ్డ తెలుగు అభ్యర్థి

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు దగాపడ్డారు. దాదాపు పది సంవత్సరాలుగా పక్కాగా సన్నద్దమైన తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. గత నెల 30న మెయిన్స్‌ ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ… గ్రూప్‌–1 ఉద్యోగాలకు…

Read More

సివిల్స్‌లో మహిళా ‘శక్తి’

సహనం వందే, హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసు అర్హత పరీక్షల్లో మహిళలు సత్తా చాటారు. ఆలిండియా టాపర్‌తో పాటు ఆలిండియా రెండో ర్యాంకును నారీమణులు కైవసం చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే ఆలిండియా టాపర్‌గా నిలిచారు. రెండో స్థానంలో హర్షిత గోయల్, మూడో స్థానంలో డోంగ్రె అర్చిత్‌ పరాగ్‌ ఉన్నారు. తొలి మూడు ర్యాంకుల్లో ఇద్దరు మహిళలే కావడం గమనార్హం. సివిల్‌ సర్వీసు ఉద్యోగాలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 1009…

Read More

జపాన్‌లో తెలంగాణ జాతర!

పెట్టుబడులకు రండి.. రేవంత్ రెడ్డి ఆహ్వానం! సహనం వందే, జపాన్ వరల్డ్ ఎక్స్‌పో 2025లో భారతదేశం నుండి మొట్టమొదట పాల్గొన్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ, జపాన్ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించేందుకు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం…సులభతర పారిశ్రామిక విధానం, స్థిరమైన పాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణను పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా మారుస్తున్నాయని రేవంత్…

Read More

స్మిత వర్సెస్ సీఎం

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఒకరకంగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఢీకొంటున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ ఫోటో రీట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు పోలీసులు జారీ చేసిన నోటీసులకు ఆమె ఏమాత్రం వెరవడంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ట్వీట్లను వరుసగా రీట్వీట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. తన ట్వీట్లను తొలగించకపోగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా రీట్వీట్లు…

Read More

కుల వివక్షపై ‘రోహిత్’ కొరడా

సహనం వందే, బెంగళూరు: విద్యా వ్యవస్థలో కుల వివక్షను అరికట్టడానికి ‘రోహిత్ వేముల చట్టం’ తీసుకురావాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనను గుర్తుచేస్తూ, విద్యా సంస్థల్లో వివక్షను అరికట్టేందుకు ఈ చట్టం అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కుల వివక్ష…

Read More

ఆస్తి కోసం తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు

సహనం వందే, నారాయణపేట: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లిలో మానవ సంబంధాలు పూర్తిగా దిగజారిన ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణిస్తే కనీసం అంత్యక్రియలకు కూడా రాని కొడుకు, తండ్రికి తామే కొడుకులం అంటూ ముందుకొచ్చిన కూతుళ్ల కథ ఇది. కుమారుడికి ఆస్తి పంచినా తీరని కోపం క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తిని కుమారుడు, కుమార్తెలకు పంచారు. కుమారుడు గిరీష్‌కు 15 ఎకరాల…

Read More

ప్యాలెస్ పాలిటిక్స్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: రాజకీయ నాయకులు పేదల సేవకులమని గొప్పలు చెప్పుకుంటూ, సామాన్య దుస్తులు, చెప్పులు ధరించి అత్యంత సాధారణ జీవన శైలితో కనిపిస్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధరించే దుస్తులు అత్యంత సామాన్యుడిని గుర్తుచేస్తాయి. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సాధారణమైన బట్టలు, చెప్పులతో కనిపిస్తారు. ఇక ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటినుంచి ఒకే స్టయిల్ సాధారణ దుస్తులు ధరిస్తారు. వందల కోట్లు ఉన్న తెలంగాణ రెవిన్యూ మంత్రి పొంగిలేటి…

Read More

సిజేరియన్ డెలివరీలపై కఠిన చర్యలు

వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ సహనం వందే, హైదరాబాద్: సరియైన కారణం లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సి-సెక్షన్ ఆడిట్‌ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ కాన్పుల సంఖ్యను మరింత పెంచాలని మంత్రి అన్నారు. సాధారణ కాన్పుల వల్ల కలిగే లాభాలను, సిజేరియన్ వల్ల జరిగే నష్టాలను…

Read More

స్మితా సబర్వాల్‌కు కంచె గచ్చిబౌలి ఎఫెక్ట్

పోలీసుల నోటీసులు సహనం వందే, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల అంశానికి సంబంధించి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి దయనీయంగా ఉందంటూ వైరల్ అయిన కొన్ని నకిలీ ఫోటోలను స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పోలీసులు ఈ విషయంపై మరింత విచారణ జరుపుతున్నారు.

Read More

ఉద్యమాలకు గ్లామర్

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఆధునిక ఉద్యమాలకు కొత్త దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని 400 ఎకరాల అటవీ భూములను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, విద్యార్థులు, మేధావులు, సినీ తారలు, ప్రజాసంఘాలు ఒక్కటై ఈ భూములను కాపాడారు. ఈ భూములను పునరుద్ధరించాలని బుధవారం తీర్పు ఇవ్వడంతో ఈ ఉద్యమం చారిత్రక విజయాన్ని సాధించింది. అటవీ సంపద కోసం విద్యార్థుల…

Read More