మెడికో తల్లిదండ్రుల చలో కరీంనగర్ – ప్రతిమ, చల్మెడ మెడికల్ కాలేజీలపై ఆగ్రహం
సహనం వందే, కరీంనగర్: కరీంనగర్లో వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ప్రతిమ, చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని వారు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తూ నాలుగున్నర సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సుకు ఐదేళ్ల ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే కాలేజీ యాజమాన్యాలు మొండిగా సమాధానం ఇస్తుండటంతో గందరగోళం నెలకొంది. అక్రమ ఫీజుల వసూళ్ల పర్వంకరీంనగర్లోని ప్రతిమ, చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలల తీరుపై తల్లిదండ్రుల కమిటీ పోరాటం చేస్తోంది. విద్యార్థుల…