D Vitamin deficiency Dengue severe

డీ-లోపం… డెంగీ తీవ్రం – ఐసీఎంఆర్ పరిశోధనలో తేలిన చేదు నిజం

సహనం వందే, హైదరాబాద్: దోమ కాటుతో వచ్చే డెంగీ ప్రాణాంతకంగా మారుతోంది. కొందరిలో సాధారణ జ్వరంగా తగ్గిపోతుంటే మరికొందరిలో ఎందుకు తీవ్రమవుతోంది అన్నది మిస్టరీగా మారింది. దీనిపై శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనల్లో విటమిన్ డీ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఈ అంశాల గురించి భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అధ్యయన నివేదిక విస్తుపోయే అంశాలను వెల్లడించింది. ఆ నివేదికపై గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ కిరణ్ మాదలతో ‘సహనం వందే’ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది….

Read More
Dr.Kiran Madala press Note

డాక్టర్ల డిమాండ్లపై కి’రణ్’ మాదల – వైద్య ఆరోగ్యశాఖ తీరుపై మండిపాటు

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాణాలు కాపాడే డాక్టర్లు తమ డిమాండ్లపై రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. బకాయిల కోసం విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వైద్యుల గోడును పట్టించుకోని సర్కారు తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందని ఎరియర్స్తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ మాదల తమ న్యాయమైన డిమాండ్ల కోసం గళమెత్తారు. యూజీసీ పీఆర్సీ బకాయిలు 2016 నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం 2024లో జీవో…

Read More
10 Min delivery Workers Strike

డెలివరీలో ‘టైమ్ బాంబ్’ – 10 నిమిషాల ఫుడ్ సరఫరాతో ప్రాణాలకు ముప్పు

సహనం వందే, హైదరాబాద్: మన ఆకలి తీర్చే గిగ్ కార్మికులు ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొత్త ఏడాది వేడుకల వేళ తమ కష్టాలను ప్రపంచానికి చాటేందుకు సిద్ధమయ్యారు. కంపెనీల మితిమీరిన వేగం ప్రాణాల మీదకు తెస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 నిమిషాల డెలివరీ పేరుతో సాగిస్తున్న మరణ మృదంగాన్ని అడ్డుకోవాలని దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. 10 నిమిషాల డేంజర్డెలివరీ యాప్స్ ఇప్పుడు 10 నిమిషాల డెలివరీ అంటూ వింత ప్రయోగాలు చేస్తున్నాయి. దీనివల్ల డెలివరీ…

Read More
Digvijay Singh Vs Revanth Reddy

దిగ్విజయ్ సింగ్ వర్సెస్ రేవంత్ రెడ్డి – కాంగ్రెస్ పార్టీలో కాషాయ మంటలు

సహనం వందే, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పార్టీలో పెద్ద దుమారమే రేపింది. బీజేపీ, ఆరెస్సెస్ సంస్థాగత బలాన్ని ఆయన కొనియాడగా… దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సోనియాగాంధీ నాయకత్వం వల్లే సామాన్యులు ప్రధానులు అయ్యారని రేవంత్ బదులిచ్చారు. దిగ్విజయ్ సింగ్ సంచలన పోస్ట్రాజ్యసభ సభ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఎక్స్…

Read More
Social Media Ban to teenagers in Australia

బాల్యం అమూల్యం… అడ్డొస్తే భరతం – సోషల్ మీడియాకు ఆస్ట్రేలియా చుక్కలు

సహనం వందే, హైదరాబాద్: బాల్యం సోషల్ మీడియా వాడకంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.16 ఏళ్లలోపు పిల్లలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు వాడకుండా నిషేధం విధించింది. ప్రపంచంలోనే ఇలాంటి చట్టం తెచ్చిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ చట్టం వల్ల టెక్ దిగ్గజాలకు వందల కోట్ల రూపాయల జరిమానాలు పడే అవకాశం ఉంది. చారిత్రాత్మక చట్టం అమలుఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియా నియంత్రణలో సరికొత్త చరిత్ర…

Read More
Maoist

మావోయిజంలో ఎండమావులు – తుపాకీ గొట్టంతోనే మార్పు అంటూ స్లో’గన్’

సహనం వందే, హైదరాబాద్: అడవి బాట పడితే అద్భుతాలు జరుగుతాయని కొందరు నమ్ముతారు. తుపాకీ పడితేనే సమాజంలో మార్పు వస్తుందని భావిస్తారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టుల అనుభవాల ద్వారా వారి జీవితాల్లోని అసలు నిజాలు విస్మయం కలిగిస్తున్నాయి. ఆదర్శాల ముసుగులో అన్యాయంమావోయిస్టు ఉద్యమం ఆరంభంలో గొప్ప ఆదర్శాలతో మొదలైంది. పేదల సంక్షేమమే ధ్యేయంగా అడవి బాట పట్టారు. కానీ కాలక్రమేణా ఆ లక్ష్యాలు పక్కకు వెళ్లాయి. సాధారణ ప్రజలను రక్షించాల్సిన…

Read More
Govt.Doctors Dharna

తెల్లకోటుకు గడ్డుకాలం – అందని జీతాలు… రోడ్డునపడ్డ బతుకులు

సహనం వందే, హైదరాబాద్: రోగులకు ప్రాణం పోసే వైద్యుల బతుకులు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం దెబ్బకు తెలంగాణ గడ్డపై వైద్య వ్యవస్థ కునారిల్లుతోంది. అహోరాత్రులు శ్రమిస్తున్నా అందని జీతాలు… పదోన్నతులు లేని సర్వీసులతో డాక్టర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ దుస్థితిపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సమరశంఖం పూరించింది. ఈ మేరకు శనివారం వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జీతాల కోసం నిరీక్షణతెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో…

Read More
Delhi - Hyderabad - India capital Issue

ఢిల్లీకి గుడ్ బై… దక్షిణాదికి జై – రాజధాని హోదాపై రగులుతున్న కొత్త రచ్చ

సహనం వందే, బెంగళూరు: భారతదేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. ఒకప్పుడు వైభవం చాటిన దేశ రాజధాని… నేడు భయం, విషపూరిత గాలికి చిరునామాగా మారింది. బెంగళూరులో నివసిస్తున్న ఒక ఢిల్లీ యువతి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రాజధానిగా ఢిల్లీ అర్హతను ఆమె ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. వైరల్ వార్.. రాజకీయ జోరుఢిల్లీలో గాలి పీల్చడమే ఒక సాహసంలా మారిపోయింది. ప్రతి ఏటా…

Read More
Outsourcing employees

వెట్టికి వెల లేదు… చాకిరికి విలువ లేదు – ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బతుకు దయనీయం

సహనం వందే, హైదరాబాద్: అనేక ప్రభుత్వ శాఖల్లో కీలకమైన పనులన్నీ భుజాన వేసుకుని నడిపిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన కనీస ప్రయోజనాలు అందక ఏజెన్సీల దోపిడీకి గురవుతూ వారు మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఈ వెతలపై ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ నిర్వహించిన పోలింగ్ లో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. సగం మందికి పైగా వేతన వివక్ష…ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో సగం మంది తీవ్రమైన వేతన…

Read More
Minorities issue

మతం.. మైనారిటీలు ఖతం – జాతీయ మైనారిటీల కమిషన్ వెల్లడి

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశం లౌకిక రాజ్యమని రాజ్యాంగం చెబుతున్నా నేడు పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తోంది. అధికారం అండతో పెచ్చరిల్లుతున్న రాజకీయ మతవాదం దేశ ఐక్యతను దెబ్బతీస్తోంది. ముస్లింలను శత్రువులుగా చూపిస్తూ… క్రిస్టియన్లను మత మార్పిడి దొంగలుగా చిత్రీకరిస్తూ సాగుతున్న ఈ హింసాకాండ వెనుక బలమైన రాజకీయ ఎజెండా ఉందనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. పెరిగిన భయం…దేశంలో మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉంది. జాతీయ మైనారిటీల కమిషన్ లెక్కల ప్రకారం 2024లో మొత్తం 1390 ఫిర్యాదులు వచ్చాయి….

Read More