Future AI Technology

మైండ్ రీడింగ్ మెషీన్ – 2026 – మనసును చదివే మాయా యంత్రం

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. మనం ఊహించని అద్భుతాలు వచ్చే ఏడాది కళ్లముందు సాక్షాత్కరించబోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల నుంచి రోబోల వరకు ప్రతి రంగంలోనూ పెను మార్పులు రానున్నాయి. అయితే ఈ టెక్నాలజీతో పాటు సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు పెను మార్పులకు నాంది పలుకుతోంది. మడత ఫోన్ల రాకస్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మడతపెట్టే ఐఫోన్ వచ్చేస్తోంది. దీని డిజైన్…

Read More
AI Dolls to Elderly People

అమ్మమ్మకు ‘ఏఐ’ బొమ్మ… వృద్ధాప్యంలో తోడు – వయసు పైబడిన వారికి మాట్లాడే బొమ్మలు

సహనం వందే, దక్షిణ కొరియా: దక్షిణ కొరియాలో ఇప్పుడు వృద్ధుల మానసిక ఆరోగ్యం ఒక పెద్ద సమస్యగా మారింది. అభివృద్ధి చెందిన దేశాలలోకెల్లా ఇక్కడే వృద్ధులు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక నివేదిక ప్రకారం ప్రతిరోజూ సుమారు 10 మంది వృద్ధులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొరియా వేగంగా అతి-వృద్ధ సమాజంగా మారిపోయింది. దేశ జనాభాలో దాదాపు ఐదో వంతు 65 ఏళ్లు పైబడిన వారే. దీంతో కుటుంబ…

Read More

ఏఐని నమ్మితే నట్టేటే – సుందర్ పిచాయ్ షాకింగ్ కామెంట్స్

సహనం వందే, అమెరికా:ఏఐ విప్లవం ప్రపంచాన్ని చుట్టేస్తుంటే… గూగుల్ అధిపతి సుందర్ పిచాయ్ మాత్రం దాన్ని అంతగా నమ్మొద్దంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని నివ్వెర పరిచాయి. ‘ఏఐ అందించే సమాచారాన్ని కళ్లు మూసుకుని నమ్మొద్దు’ అని ఆయన వినియోగదారులకు సూచించడంపై టెక్నాలజీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఏఐ వ్యవస్థలు ఇప్పటికీ తప్పులు చేస్తున్నాయని… వాటిని కేవలం ఒక సమాచార వనరుగా మాత్రమే పరిగణించాలని గూగుల్ సీఈఓ పిచాయ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఏఐపైనే…

Read More

నేతల లూటీ… ఏఐ లాఠీ – రాజకీయ అవినీతిని వెలికితీసేలా కొత్త ఫీచర్

సహనం వందే, హైదరాబాద్:దేశ రాజకీయాల్లో త్వరలో ఒక పెను సంచలనం చోటు చేసుకోనుంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సెర్చ్ ఇంజిన్ పెర్ప్లెక్సిటీ ఏఐ తీసుకొస్తున్న నూతన ఫీచర్ భారతీయ రాజకీయ నాయకుల స్టాక్ హోల్డింగ్స్ గుట్టు రట్టు చేయనుంది. ఇప్పటివరకు ఎన్నికల అఫిడవిట్లు, ఆస్తి డిక్లరేషన్లలో అస్పష్టంగా ఉన్న నేతల ఆర్థిక కార్యకలాపాలు, షేర్ల పెట్టుబడులు ప్రజల కళ్ల ముందు పారదర్శకంగా ఆవిష్కృతం కాబోతున్నాయి. పెర్ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు….

Read More

ఏఐ చాట్… స్మశానానికి రూట్ – మెంటలెక్కిస్తున్న చాట్‌జీపీటీ

సహనం వందే, హైదరాబాద్:సాధారణంగా కనిపించే ఏఐ చాట్‌బాట్లు ఇప్పుడు వినియోగదారుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాట్‌జీపీటీని తయారుచేసిన ఓపెన్‌ఏఐ సంస్థ తాజాగా బయటపెట్టిన లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ వినియోగదారులలో వారానికి దాదాపు 0.07 శాతం మంది పిచ్చి ఆలోచనలు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు గురవుతున్నారని సంస్థ వెల్లడించింది. ఈ శాతం చిన్నదే అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా వారానికి దాదాపు 80 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నందున… ఈ లెక్క లక్షల్లో…

Read More

ఏఐ సైకోసిస్ – దాంతోనే ఒంటరిగా గడిపితే భ్రమల్లో జీవితం

సహనం వందే, అమెరికా:కృత్రిమ మేధస్సు (ఏఐ) అభివృద్ధి మానవాళికి పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ఏఐ పితామహుడిగా పేరుగాంచిన జాఫ్రీ హింటన్ చేసిన హెచ్చరికలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఏఐ పరిశోధన ఒక ఆయుధాల పోటీలా మారిందని, దీనిపై నియంత్రణ లేకపోతే అణ్వాయుధాల కంటే ప్రమాదకరమైన పరిణామాలు తప్పవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ విప్లవం ప్రపంచంలో పెను మార్పులు తీసుకొస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు విస్మరిస్తున్న కంపెనీలు…ఒకప్పుడు…

Read More

ఆకలి తీర్చని ఏఐ

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక విప్లవం ఈ శతాబ్దాన్ని అబ్బురపరుస్తోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) జీవితాలను మార్చేస్తోంది. అంతరిక్ష యాత్రలు సామాన్యమవుతున్నాయి. గంటల ప్రయాణాలు నిమిషాల్లో సాధ్యమవుతున్నాయి. వైద్యం, రవాణా, సమాచార రంగాల్లో సైన్స్ అనూహ్యమైన పురోగతిని సాధిస్తోంది. కానీ ఈ అద్భుతమైన సాంకేతికత ఉన్నా, భారతదేశంలో కోట్లాది మంది ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఈ ఆకలి కేకల్లో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బహుజనులే ఉన్నారు. ఏఐ వంటి సాంకేతికత ఈ బహుజనుల…

Read More