పేదల వైద్యంపై పిడుగు – ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్ పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 2500 కోట్లు, తెలంగాణలో రూ.1400 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు సేవలను నిలిపివేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేయాలని నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్టీఆర్ పథకం కింద ఉన్న ఓపీడీ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం… పేదలకు శాపంప్రైవేటు ఆస్పత్రులు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు కనీస స్పందన చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో…

Read More

రగులుతున్న గిరిజన వివాదం – లంబాడీల ఆత్మగౌరవ పోరాటం

సహనం వందే, కొత్తగూడెం:కొత్తగూడెం పట్టణం లంబాడీల ఆత్మగౌరవ నినాదాలతో హోరెత్తిపోయింది. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ… రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని వేసిన కేసు విషయంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు. ఒకవైపు ఆదివాసీలతో, మరోవైపు లంబాడీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించడం సమస్యను పరిష్కరించడానికి కాదని,…

Read More

ఎవరేమనుకుంటారో…? – ఈ ప్రశ్నే విద్యార్థుల ఆత్మహత్యకు కారణం

సహనం వందే, హైదరాబాద్:పరీక్షా ఫలితాలు వచ్చాయి. యోగిత తన గదిలో తలుపు వేసుకుని కూర్చుంది. రిలేటివ్స్ ఫోన్ల మోత… కోచింగ్ సెంటర్ల హడావుడి… గుమ్మం బయట తల్లి నిట్టూర్పు… ఇవన్నీ యోగితకు ఓ ఉచ్చులా బిగుసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కన్నీళ్లతో ఉన్న యోగిత తెల్లరేసరికి నిర్జీవంగా మారింది. ఇదొక్క యోగిత కథే కాదు. మధ్యతరగతి కుటుంబాలలో ఇలాంటి విషాదాలు నిత్యకృత్యం. మార్కులకు, ర్యాంకులకు ప్రాణం అర్పించే ఎంతోమంది విద్యార్థుల వేదన ఇది. 2022లో మన దేశంలో 1.7…

Read More

డాక్టర్‌ రఘురామ్‌ కు గ్లాస్గో కీర్తి కిరీటం

సహనం వందే, లండన్:హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రొమ్ము క్యాన్సర్‌ శస్త్రవైద్యుడు డాక్టర్‌ రఘురామ్‌ పిల్లరిశెట్టి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటన్‌లోని ప్రఖ్యాత గ్లాస్గో రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ అండ్‌ సర్జన్స్‌ (ఆర్‌సీపీఎస్‌జీ) ఆయనకు గౌరవ ఫెలోషిప్‌ ప్రదానం చేసింది. దక్షిణాసియాలో ఈ గౌరవం పొందిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా 1997లో ఇదే కాలేజీ నుంచి ఎఫ్‌ఆర్‌సీఎస్‌ పరీక్షలో అర్హత పొంది ఇప్పుడు గౌరవ ఫెలోషిప్‌ అందుకున్న ఏకైక శస్త్ర వైద్యుడుగా ప్రపంచంలోనే…

Read More

‘శ్రీనివాసా’ గోవిందా – ఎట్టకేలకు ఎంఎన్ జే డైరెక్టర్ తొలగింపు

సహనం వందే, హైదరాబాద్‌:ఎట్టకేలకు ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులును రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. కొత్త ఇంచార్జి డైరెక్టర్ గా డాక్టర్ జోసెఫ్ బెంజిమెన్ ను నియమించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సహనం వందే’, ‘ఆర్టికల్ టుడే’ డిజిటల్ పేపర్లు రాసిన వరుస కథనాలతో డాక్టర్ శ్రీనివాసులుపై వేటు పడింది. ఆయన డైరెక్టర్ గా కొనసాగడంపై ‘సహనం వందే’ https://sahanamvande.com/?p=6557, ‘ఆర్టికల్ టుడే’ https://articletoday.in/ shock-to-dr-srinivasulu-as-dopt-sacks-mnj-director/ డిజిటల్…

Read More

హరీష్ రావుకు ముఖ్యమంత్రి యోగం – ఫ్లాష్ సర్వే పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో చెక్కర్లు

సహనం వందే, హైదరాబాద్:ఫ్లాష్ సర్వే పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో 20 పేజీల రిపోర్ట్ చెక్కర్లు కొడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు కాంగ్రెస్ పార్టీకే మరింత ప్రయోజనం కలిగిస్తుందని సర్వే వెల్లడించింది. సర్వేలో అత్యంత ఆసక్తికరమైన విషయం హరీష్ రావు ప్రజల మనిషిగా ముందుకు వస్తున్నాడని… కేసీఆర్ కుటుంబంలో అంతర్గత యుద్ధం హరీష్ కి లాభిస్తుందని తేలింది. దీంతో హరీష్ రావే భవిష్యత్ ముఖ్యమంత్రి అవుతారని చాలామంది నమ్ముతున్నారు. కేటీఆర్‌కు మించి ప్రజల దగ్గర హరీష్‌కు బలమైన…

Read More

గ్రూప్-1… గుండెల్లో గన్ – మూడున్నరేళ్ల నిరీక్షణ పటాపంచలు

సహనం వందే, హైదరాబాద్:మూడున్నరేళ్ల నిరీక్షణ… నిద్రాహారాలు లేని కఠోర శ్రమ… అసంఖ్యాకమైన ఆశల పతాక. వీటన్నింటికీ ప్రతిఫలంగా తుది జాబితాలో తమ పేర్లు చూసుకుని మురిసిపోయారు గ్రూప్-1 అభ్యర్థులు. నియామక పత్రాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు వారి ఆశలపై పిడుగుపాటులా పడింది. తుది జాబితాను రద్దు చేస్తూ మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించడం..‌. లేదంటే మళ్ళీ పరీక్షలు పెట్టాలని సూచించడం… ఈ తీర్పుతో వారి గుండె ఝల్లుమంది. ఈ…

Read More

అల్లు అర్జున్ కు మరో షాక్ – అల్లు బిజినెస్ పార్క్‌ పై జీహెచ్ఎంసీ కన్నెర్ర

సహనం వందే, హైదరాబాద్:పుష్ప-2 సినిమా విడుదలైనప్పటినుంచి అల్లు కుటుంబాన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. అల్లు అర్జున్ ఏకంగా జైలుకు వెళ్లి రావాల్సి వచ్చింది. తాజాగా ఆయన తండ్రి అల్లు అరవింద్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో సినీ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన అల్లు బిజినెస్ పార్క్‌ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పెంట్‌హౌస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తీవ్రంగా స్పందించింది. అనుమతులు లేకుండా…

Read More

వేటు కోసం వెయిట్ – బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల రగడ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం సంచలనం సృష్టించింది. ఈ ఫిరాయింపులపై వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఒకరిద్దరు మినహా ఎవరూ స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో…

Read More

వేల కోట్ల డ్రగ్స్… ముంబై దెబ్బ అదుర్స్ – హైదరాబాదులో రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ సీజ్

సహనం వందే, హైదరాబాద్:దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ ఇప్పుడు డ్రగ్స్ మాఫియాకు కేంద్రంగా మారుతోంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు మేడ్చల్‌లో నిర్వహించిన ఆపరేషన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంతో నగరంలో అక్రమ డ్రగ్స్ తయారీ ఏ స్థాయిలో జరుగుతుందో వెల్లడైంది. ఎక్స్‌టీసీ, మోలీ, ఎండీఎంఏ వంటి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌తో పాటు, వాటి తయారీకి అవసరమైన…

Read More